కోలీవుడ్ లోనే కాదు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోలు విక్రమ్, సూర్యలు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ముఖ్యంగా శివ పుత్రుడు టైంలో వీళ్ళ బాండింగ్ స్క్రీన్ మీద అద్భుతంగా పండింది. దీంతోనే పెద్ద రేంజ్ కు చేరుకున్నారు. తర్వాత ఈ కాంబో సాధ్యపడలేదు. అయితే విక్రమ్ చేయాలని మనసుపడి కొంత కాలం షూటింగ్ జరుపుకున్న ఒక ప్యాన్ ఇండియా మూవీని ఇప్పుడు సూర్య చేయాలని డిసైడ్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. మూడేళ్ళ క్రితం 2020లో ఆర్ఎస్ విమల్ దర్శకుడిగా సూర్యపుత్ర మహావీర్ కర్ణ మొదలయ్యింది. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కూడా వచ్చాయి.
అనూహ్యంగా ఇది ఆగిపోయింది. కరోనా వచ్చి వెళ్ళాక నిర్మాతలకు ఆసక్తి పోయింది. మహాభారతంలోని కర్ణుడి విశిష్టతను కొత్త టెక్నాలజీతో చెప్పాలని తొలుత ప్లాన్ చేసుకున్నారు. కానీ విక్రమ్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు సూర్య కర్ణగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే మొత్తం వేరే టీమ్ తో. ఓం ప్రకాష్ మెహరా దర్శకత్వంలో అయిదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తారట. రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ లాంటి క్లాసిక్స్ ఇచ్చిన డైరెక్టర్ అంటే సూర్య మాత్రం ఎందుకు నో చెబుతాడు.
ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అంతా ఓకే అనుకున్నాక అఫీషియల్ గా ప్రకటిస్తారు. కర్ణ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎన్టీఆర్ ఆవిష్కరించిన వెండితెర అద్భుతం దానవీరశూరకర్ణ. నాలుగు గంటల నిడివితో అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సృష్టించిన సంచలనం గురించి కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. తర్వాత శివాజీ గణేశన్ లాంటి ఎందరో దిగ్గజాలు దాన్ని పునఃసృష్టి చేయబోయారు కానీ ఒరిజినల్ ను కనీసం మ్యాచ్ చేయలేకపోయారు. మరి ఇప్పుడు ఇంత విజువల్ ఎఫెక్ట్స్ ట్రెండ్ లో సూర్య ఎలా మరిపిస్తాడో చూడాలి. కంగువా తర్వాత వరసగా క్రేజీ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…