పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ ఆరేడేళ్ల నుంచే నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ.. గత రెండేళ్లలో పెద్ద రేంజికి ఎదిగింది. అంతకుముందంతా చిన్న సినిమాలే నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ‘బ్రో’ లాంటి పెద్ద సినిమా తీసే రేంజికి ఎదిగారు. గత ఏడాది పీపుల్ మీడియా నుంచి కార్తికేయ-2, ధమాకా రూపంలో రెండు వంద కోట్ల సినిమాలు వచ్చాయి.
దీంతో ఆ సంస్థ పేరు మార్మోగింది. అదే సమయంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలతో పెద్ద సినిమాలు లైన్లో పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు విశ్వ ప్రసాద్. ఐతే ఇలా రేంజ్ పెరిగాక ‘పీపుల్ మీడియా’ నుంచి వచ్చే సినిమాల క్వాలిటీ పడిపోతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. గత ఏడాది ఈ సంస్థకు గొప్పగా కలిసి రాగా.. 2023లో మాత్రం వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా నిర్మించిన ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ ప్రేక్షకులకు టార్చర్ చూపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం కూడా చూపించలేదు. దాని తర్వాత ‘రామబాణం’ అనే మాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది పీపుల్ మీడియా. ఆ సినిమా ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా మీద మంచి బడ్జెట్ పెట్టిన నిర్మాతలకు పెద్ద నష్టం తప్పలేదు. ఈ మధ్య పీపుల్ మీడియా డిస్ట్రిబ్యూషన్లో అడుగు పెట్టగా అందులోనూ చేదు అనుభవాలు తప్పలేదు. తమిళ అనువాద చిత్రం ‘టక్కర్’ను రిలీజ్ చేస్తే వాషౌట్ అయిపోయింది.
ప్రభాస్తో సొంతంగా సినిమాను నిర్మిస్తున్న పీపుల్ మీడియా.. అతడి ‘ఆదిపురుష్’ను భారీ రేటుకు కొని రిలీజ్ చేస్తే అది కూడా నిరాశ పరిచింది. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ కూడా పీపుల్ మీడియాకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ సినిమా ఊపు వీకెండ్ వరకే పరిమితం అయింది. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర క్రాష్ అయిన ‘బ్రో’ ఇక పుంజుకునేలా కనిపించడం లేదు. బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు. ఇలా వరుసగా చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న పీపుల్ మీడియా.. ఇక ముందు అయినా కొంచెం జాగ్రత్త పడటం మంచిది.
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…