పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ ఆరేడేళ్ల నుంచే నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ.. గత రెండేళ్లలో పెద్ద రేంజికి ఎదిగింది. అంతకుముందంతా చిన్న సినిమాలే నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ‘బ్రో’ లాంటి పెద్ద సినిమా తీసే రేంజికి ఎదిగారు. గత ఏడాది పీపుల్ మీడియా నుంచి కార్తికేయ-2, ధమాకా రూపంలో రెండు వంద కోట్ల సినిమాలు వచ్చాయి.
దీంతో ఆ సంస్థ పేరు మార్మోగింది. అదే సమయంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలతో పెద్ద సినిమాలు లైన్లో పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు విశ్వ ప్రసాద్. ఐతే ఇలా రేంజ్ పెరిగాక ‘పీపుల్ మీడియా’ నుంచి వచ్చే సినిమాల క్వాలిటీ పడిపోతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. గత ఏడాది ఈ సంస్థకు గొప్పగా కలిసి రాగా.. 2023లో మాత్రం వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా నిర్మించిన ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ ప్రేక్షకులకు టార్చర్ చూపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం కూడా చూపించలేదు. దాని తర్వాత ‘రామబాణం’ అనే మాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది పీపుల్ మీడియా. ఆ సినిమా ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా మీద మంచి బడ్జెట్ పెట్టిన నిర్మాతలకు పెద్ద నష్టం తప్పలేదు. ఈ మధ్య పీపుల్ మీడియా డిస్ట్రిబ్యూషన్లో అడుగు పెట్టగా అందులోనూ చేదు అనుభవాలు తప్పలేదు. తమిళ అనువాద చిత్రం ‘టక్కర్’ను రిలీజ్ చేస్తే వాషౌట్ అయిపోయింది.
ప్రభాస్తో సొంతంగా సినిమాను నిర్మిస్తున్న పీపుల్ మీడియా.. అతడి ‘ఆదిపురుష్’ను భారీ రేటుకు కొని రిలీజ్ చేస్తే అది కూడా నిరాశ పరిచింది. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ కూడా పీపుల్ మీడియాకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ సినిమా ఊపు వీకెండ్ వరకే పరిమితం అయింది. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర క్రాష్ అయిన ‘బ్రో’ ఇక పుంజుకునేలా కనిపించడం లేదు. బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు. ఇలా వరుసగా చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న పీపుల్ మీడియా.. ఇక ముందు అయినా కొంచెం జాగ్రత్త పడటం మంచిది.
This post was last modified on August 2, 2023 3:41 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…