పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ ఆరేడేళ్ల నుంచే నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ.. గత రెండేళ్లలో పెద్ద రేంజికి ఎదిగింది. అంతకుముందంతా చిన్న సినిమాలే నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ‘బ్రో’ లాంటి పెద్ద సినిమా తీసే రేంజికి ఎదిగారు. గత ఏడాది పీపుల్ మీడియా నుంచి కార్తికేయ-2, ధమాకా రూపంలో రెండు వంద కోట్ల సినిమాలు వచ్చాయి.
దీంతో ఆ సంస్థ పేరు మార్మోగింది. అదే సమయంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలతో పెద్ద సినిమాలు లైన్లో పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు విశ్వ ప్రసాద్. ఐతే ఇలా రేంజ్ పెరిగాక ‘పీపుల్ మీడియా’ నుంచి వచ్చే సినిమాల క్వాలిటీ పడిపోతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. గత ఏడాది ఈ సంస్థకు గొప్పగా కలిసి రాగా.. 2023లో మాత్రం వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా నిర్మించిన ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ ప్రేక్షకులకు టార్చర్ చూపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం కూడా చూపించలేదు. దాని తర్వాత ‘రామబాణం’ అనే మాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది పీపుల్ మీడియా. ఆ సినిమా ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా మీద మంచి బడ్జెట్ పెట్టిన నిర్మాతలకు పెద్ద నష్టం తప్పలేదు. ఈ మధ్య పీపుల్ మీడియా డిస్ట్రిబ్యూషన్లో అడుగు పెట్టగా అందులోనూ చేదు అనుభవాలు తప్పలేదు. తమిళ అనువాద చిత్రం ‘టక్కర్’ను రిలీజ్ చేస్తే వాషౌట్ అయిపోయింది.
ప్రభాస్తో సొంతంగా సినిమాను నిర్మిస్తున్న పీపుల్ మీడియా.. అతడి ‘ఆదిపురుష్’ను భారీ రేటుకు కొని రిలీజ్ చేస్తే అది కూడా నిరాశ పరిచింది. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ కూడా పీపుల్ మీడియాకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ సినిమా ఊపు వీకెండ్ వరకే పరిమితం అయింది. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర క్రాష్ అయిన ‘బ్రో’ ఇక పుంజుకునేలా కనిపించడం లేదు. బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు. ఇలా వరుసగా చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న పీపుల్ మీడియా.. ఇక ముందు అయినా కొంచెం జాగ్రత్త పడటం మంచిది.
This post was last modified on August 2, 2023 3:41 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…