తమిళ పరిశ్రమ తమ ఆర్టిస్టులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం గురించి జారీ చేసిన నియమనిబంధనలు తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ నేరుగా దీని మీదే మాట్లాడితే దానికి స్పందనగా కోలీవుడ్ తరఫున నాజర్ అలాంటిదేమి లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడారు. నిన్న చెన్నైలో గ్రాండ్ గా జరిగిన జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికరమైన సంగతులు, ముచ్చట్లు పంచుకున్నారు. అందులో భాగంగా తెలుగు కన్నడ సినిమాల ప్రస్తావన తెచ్చారు.
ఒకప్పుడు శాండల్ వుడ్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదని కెజిఎఫ్, కాంతారా లాంటి అద్భుతాల వల్ల ఇప్పుడు ప్రపంచ మార్కెట్ ని చేరుకున్నారని కితాబిచ్చారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్పలు టాలీవుడ్ కి అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీని అందించాయని ప్రశంసలు గుప్పించారు. మనమూ వీటి సరసన నిలిచే గొప్ప చిత్రాలు అందించాలని హితవు పలికారు. అందరూ మన అన్నదమ్ములేనని, కలిసికట్టుగా సౌత్ ఇండస్ట్రీని పెద్దది చేసుకోవాలని, ప్రతి సినిమా థియేటర్లలో ఆడే స్థాయి అందుకోవాలని అన్నారు. అంటే హద్దులు పెట్టుకోవద్దని నేరుగానే చెప్పేశారు.
కేవలం తమిళనాడుకి చెందినవాళ్లు మాత్రమే పనిచేయాలనే పరిమితి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేసినట్టు అయ్యింది. నిజానికి కోలీవుడ్ ఎంత పెద్ద మార్కెట్ అయినా ఇంటర్ నేషనల్ లెవల్ లో కొనియాడబడిన సినిమా ఏదీ లేదు. అంత గొప్పగా చెప్పుకున్న పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలు తెలుగు కన్నడ కేరళలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బొటాబొటిగా గట్టెక్కాయి. విక్రమ్ లాంటివి హిందీ మార్కెట్ లో ఆడలేదు. అందుకే ఊరికే మా సినిమాలు మావే అనుకుండా అందరినీ కలుపుకుంటూ పోతేనే ఉభయకుశలోపరిగా ఉంటుంది.
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…