తమిళ పరిశ్రమ తమ ఆర్టిస్టులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం గురించి జారీ చేసిన నియమనిబంధనలు తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ నేరుగా దీని మీదే మాట్లాడితే దానికి స్పందనగా కోలీవుడ్ తరఫున నాజర్ అలాంటిదేమి లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడారు. నిన్న చెన్నైలో గ్రాండ్ గా జరిగిన జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికరమైన సంగతులు, ముచ్చట్లు పంచుకున్నారు. అందులో భాగంగా తెలుగు కన్నడ సినిమాల ప్రస్తావన తెచ్చారు.
ఒకప్పుడు శాండల్ వుడ్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదని కెజిఎఫ్, కాంతారా లాంటి అద్భుతాల వల్ల ఇప్పుడు ప్రపంచ మార్కెట్ ని చేరుకున్నారని కితాబిచ్చారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్పలు టాలీవుడ్ కి అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీని అందించాయని ప్రశంసలు గుప్పించారు. మనమూ వీటి సరసన నిలిచే గొప్ప చిత్రాలు అందించాలని హితవు పలికారు. అందరూ మన అన్నదమ్ములేనని, కలిసికట్టుగా సౌత్ ఇండస్ట్రీని పెద్దది చేసుకోవాలని, ప్రతి సినిమా థియేటర్లలో ఆడే స్థాయి అందుకోవాలని అన్నారు. అంటే హద్దులు పెట్టుకోవద్దని నేరుగానే చెప్పేశారు.
కేవలం తమిళనాడుకి చెందినవాళ్లు మాత్రమే పనిచేయాలనే పరిమితి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేసినట్టు అయ్యింది. నిజానికి కోలీవుడ్ ఎంత పెద్ద మార్కెట్ అయినా ఇంటర్ నేషనల్ లెవల్ లో కొనియాడబడిన సినిమా ఏదీ లేదు. అంత గొప్పగా చెప్పుకున్న పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలు తెలుగు కన్నడ కేరళలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బొటాబొటిగా గట్టెక్కాయి. విక్రమ్ లాంటివి హిందీ మార్కెట్ లో ఆడలేదు. అందుకే ఊరికే మా సినిమాలు మావే అనుకుండా అందరినీ కలుపుకుంటూ పోతేనే ఉభయకుశలోపరిగా ఉంటుంది.
This post was last modified on July 29, 2023 10:59 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…