సూపర్ స్టార్ రజినీకాంత్తో సినిమా చేసిన దర్శకుడికి అంత కష్టం ఏం వచ్చింది అనిపిస్తోందా ఈ హెడ్డింగ్ చూసి. కానీ ఇక్కడ మాట్లాడుతోంది రజినీ సినిమా ‘జైలర్’ తీసిన దర్శకుడి గురించి కాదు. మలయాళంలో ‘జైలర్’ పేరుతోనే వేరే సినిమా తీసిన షకీర్ మడత్తిల్ గురించి. అతను 2021 నవంబరులోనే ‘జైలర్’ పేరుతో మలయాళంలో ఓ సినిమా మొదలుపెట్టాడు.
అంతకు కొన్ని నెలల ముందే అతను జైలర్ టైటిల్ను రిజిస్టర్ చేయించాడు. ఈ సినిమా రకరకాల కారణాల వల్ల ఆలస్యమై వచ్చే నెల 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. అదే రోజు రజినీ సినిమా ‘జైలర్’ కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అది మలయాళ చిత్రం, ఇది తమిళ సినిమా కాబబట్టి ఇబ్బందేమీ లేదు అనుకోవడానికి లేదు. తమిళ సినిమాలు కేరళలో పెద్ద స్థాయిలో రిలీజవుతాయి. రజినీ సినిమాలకు అక్కడ డిమాండ్ ఎక్కువే.
రజినీ సినిమా, తన చిత్రం ఒకే టైటిల్తో రిలీజైతే తనకు తీవ్ర ఇబ్బంది తప్పదంటూ షకీర్ మడత్తిల్ కొన్ని రోజుల కిందటే ప్రెస్ మీట్ పెట్టి.. రజినీ సినిమాకు టైటిల్ మార్చాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం అతను కోర్టును కూడా ఆశ్రయించాడు. ఆగస్టు 22న ఈ కేసును మద్రాస్ హైకోర్టు విచారించనుంది. ఐతే ఈ లోపు రజినీ సినిమా టీంకు షకీర్ ఒక విజ్ఞప్తి చేశాడు. కనీసం కేరళ వరకు అయినా రజినీ సినిమాకు టైటిల్ మార్చి రిలీజ్ చేయాలని కోరాడు.
తన సినిమాకు రూ.5 కోట్ల ఖర్చయిందని.. తన దగ్గరున్న డబ్బుతో పాటు ఆస్తులు, బంగారం అమ్మి దీని మీద పెట్టుబడి పెట్టానని.. సినిమాను పూర్తి చేసి రిలీజ్కు సిద్ధం చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని.. తన జీవితమే ఈ సినిమా మీద ఆధారపడి ఉందని అతనన్నాడు. ఈ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయని.. రజినీ చాలా మంచి వారని.. ఆయన తన పరిస్థితిని గుర్తించి కేరళ వరకు టైటిల్ మార్చి రిలీజ్ చేయాలని అతను కోరాడు. మరి రజినీ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on July 28, 2023 12:35 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…