సూపర్ స్టార్ రజినీకాంత్తో సినిమా చేసిన దర్శకుడికి అంత కష్టం ఏం వచ్చింది అనిపిస్తోందా ఈ హెడ్డింగ్ చూసి. కానీ ఇక్కడ మాట్లాడుతోంది రజినీ సినిమా ‘జైలర్’ తీసిన దర్శకుడి గురించి కాదు. మలయాళంలో ‘జైలర్’ పేరుతోనే వేరే సినిమా తీసిన షకీర్ మడత్తిల్ గురించి. అతను 2021 నవంబరులోనే ‘జైలర్’ పేరుతో మలయాళంలో ఓ సినిమా మొదలుపెట్టాడు.
అంతకు కొన్ని నెలల ముందే అతను జైలర్ టైటిల్ను రిజిస్టర్ చేయించాడు. ఈ సినిమా రకరకాల కారణాల వల్ల ఆలస్యమై వచ్చే నెల 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. అదే రోజు రజినీ సినిమా ‘జైలర్’ కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అది మలయాళ చిత్రం, ఇది తమిళ సినిమా కాబబట్టి ఇబ్బందేమీ లేదు అనుకోవడానికి లేదు. తమిళ సినిమాలు కేరళలో పెద్ద స్థాయిలో రిలీజవుతాయి. రజినీ సినిమాలకు అక్కడ డిమాండ్ ఎక్కువే.
రజినీ సినిమా, తన చిత్రం ఒకే టైటిల్తో రిలీజైతే తనకు తీవ్ర ఇబ్బంది తప్పదంటూ షకీర్ మడత్తిల్ కొన్ని రోజుల కిందటే ప్రెస్ మీట్ పెట్టి.. రజినీ సినిమాకు టైటిల్ మార్చాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం అతను కోర్టును కూడా ఆశ్రయించాడు. ఆగస్టు 22న ఈ కేసును మద్రాస్ హైకోర్టు విచారించనుంది. ఐతే ఈ లోపు రజినీ సినిమా టీంకు షకీర్ ఒక విజ్ఞప్తి చేశాడు. కనీసం కేరళ వరకు అయినా రజినీ సినిమాకు టైటిల్ మార్చి రిలీజ్ చేయాలని కోరాడు.
తన సినిమాకు రూ.5 కోట్ల ఖర్చయిందని.. తన దగ్గరున్న డబ్బుతో పాటు ఆస్తులు, బంగారం అమ్మి దీని మీద పెట్టుబడి పెట్టానని.. సినిమాను పూర్తి చేసి రిలీజ్కు సిద్ధం చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని.. తన జీవితమే ఈ సినిమా మీద ఆధారపడి ఉందని అతనన్నాడు. ఈ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయని.. రజినీ చాలా మంచి వారని.. ఆయన తన పరిస్థితిని గుర్తించి కేరళ వరకు టైటిల్ మార్చి రిలీజ్ చేయాలని అతను కోరాడు. మరి రజినీ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on July 28, 2023 12:35 pm
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…
అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం…
విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు.. బుధవారం ఉదయం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా…