పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం ‘బ్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సుదీర్ఘ ప్రసంగమే చేశారు. అందులో అనేక అంశాలపై మాట్లాడారు. అందరినీ ఆశ్చర్యపరిచింది.. చర్చనీయాంశంగా మారింది మాత్రం.. తమిళ సినీ పరిశ్రమ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే. తమిళ సినిమాల్లో తమిళు ఆర్టిస్టులు, టెక్నీషియన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని.. తమిళనాడు పరిధిలోనే షూటింగ్ చేయాలని సినీ పరిశ్రమలో ఈ మధ్య కొన్ని షరతుల మీద పవన్ మాట్లాడాడు.
ఇలా ఒక పరిధి పెట్టుకుంటే ఏ పరిశ్రమా ఎదగలేదని.. తెలుగు పరిశ్రమ అందరినీ అక్కున చేర్చుకుంది కాబట్టే ఈ రోజు ప్రపంచ స్థాయికి ఎదిగిందని.. ఇలాగే విశాల దృక్పథంతో ఆలోచిస్తే కోలీవుడ్ నుంచి కూడా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు వస్తాయని పవన్ పేర్కొన్నాడు. తమిళుడే అయిన దర్శకుడు సముద్రఖనిని పక్కన పెట్టుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొందరు తమిళ పీఆర్వోలు ఈ వ్యాఖ్యల గురించి పాజిటివ్గానే పోస్టులు పెట్టారు.
కానీ ఆత్మాభిమానం కొంచెం ఎక్కువగా ఉండే తమిళులు కొందరికి ఈ వ్యాఖ్యలు నచ్చట్లేదు. దీని మీద ఆల్రెడీ కొందరు నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న వారూ లేకపోలేదు. ఐతే పవన్ రాజకీయ శత్రువులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తమిళులది సంకుచిత మనస్తత్వం అని పవన్ వ్యాఖ్యానించాడని.. ఆ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడాడని అంటూ తమిళులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ను రాజకీయంగా ఎదుర్కోలేక.. ఏ చిన్న అవకాశం వచ్చినా అన్పాపులర్ చేయాలని చూసేవాళ్లు మంచి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తమిళులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనసైనికులు, పవన్ అభిమానులు.. వీరిని దీటుగానే ఎదుర్కొంటున్నారు. పవన్ వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
This post was last modified on July 26, 2023 5:09 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…