అవును.. దర్శకుడు అనిల్ రావిపూడి మెడపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ కత్తి పెట్టారు. తాను చెప్పిన పని చేయాల్సిందే అని బెదిరించారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐతే అనిల్, బ్రహ్మాజీ ఇద్దరూ కూడా సరదా మనుషులని అందరికీ తెలుసు. వారి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్లలో భాగంగా ఈ వెరైటీ వీడియో చేశారు.
ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 21కే అనుకున్న సినిమాను ఎనిమిది రోజులు వాయిదా వేశారు. ఇక వీడియో విషయానికి వస్తే.. ‘భగవంత్ కేసరి’ సినిమాకు సంబంధించిన షూటింగ్లో శ్రీలీలకు సూచనలిస్తూ సన్నివేశానికి రెడీ అవుతున్న సమయంలో బ్రహ్మాజీ వెళ్లి తన కొడుకు సినిమా రిలీజ్ డేట్ గురించి చెప్పాలని అనిల్ను అడిగాడు.
దానికి అనిల్ స్పందిస్తూ.. ‘‘ఎన్నిసార్లు వస్తావన్నా. మొనన మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్ అన్నావు. తర్వాత సాంగ్ అన్నావు. నేను తప్ప ఎవరూ లేరా నీకు’’ అంటూ చికాకు పడ్డాడు. వెంటనే బ్రహ్మాజీ కత్తి తీసి అనిల్ మెడ మీద పెట్టి రిలీజ్ డేట్ గురించి చెప్పమంటే.. అతను తడబడుతూ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ అనడం.. బ్రహ్మాజీ సినిమా పేరు ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అని కరెక్ట్ చేయడం.. తర్వాత రిలీజ్ డేట్ చెప్పి ప్రేక్షకులను ఈ సినిమా చూడాలని కోరడం.. ఇదంతా సరదాగా సాగిపోయింది.
ఈ రోజుల్లో ఈ మాత్రం వెరైటీ ప్రమోషన్లు లేకపోతే.. చిన్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిలో పడటం కష్టమే. ఇంతకుముందు ‘పిట్ట కథ’ అనే వైవిధ్యమైన సినిమాతో సంజయ్ రావు హీరోగా పరిచయం అయ్యాడు. కానీ అది అంతా ఆడలేదు. ఇప్పుడు అతను ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అవతారం ఎత్తాడు. అతడికి జోడీగా ప్రణవి మానవికొండ నటించింది.
This post was last modified on July 24, 2023 6:13 am
మాములుగా ఏ భాష సినిమాలైనా థియేటర్ కు ఓటిటికి మహా అయితే రెండు నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండటం…
సరైన సినిమాలు రాలేదనే కారణం స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్నికల ప్రభావం బాక్సాఫీస్ మీద తీవ్రంగా పడిన మాట వాస్తవం. వార్…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్…
మంచు విష్ణు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. కన్నప్ప. ఈ చిత్రాన్ని విష్ణు అనే కాదు.. మంచు ఫ్యామిలీనే…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…