ఒక ఇండియన్ సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా నిన్న శాన్ డియాగో వేదికగా జరిగిన కామ్ కాన్ ఫెస్టివల్ లో ప్రాజెక్ట్ కె టైటిల్ ని కల్కి 2898 AD గా రివీల్ చేయడం సోషల్ మీడియాలో సునామి సృష్టించింది. దీనికి ప్రత్యక్ష సాక్షులుగా నిలవడం కోసం ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, రానా, నాగ్ అశ్విన్, అశ్వినీదత్ తదితరులంతా హాజరయ్యారు. అయితే హీరోయిన్ దీపికా పదుకునే మాత్రం కనిపించలేదు. ముందైతే వస్తుందనే ప్రచారం జరిగింది కానీ రాలేదు. అయితే దీనికి కారణం షూటింగులు కాదు. తప్పించుకోలేని అడ్డంకి ఒకటి వచ్చి పడటంతో యాబ్సెంట్ అయ్యింది.
యుఎస్ లో మొన్న మే నెల నుంచి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ (SAG) ఆధ్వర్యంలో నడిచే అమెరికన్ ఫెడరేషన్ అఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్(AFTRA) పాటు రైటర్స్ గిల్డ్ అఫ్ అమెరికా(WGA) నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాయి. హాలీవుడ్ కార్మిక చట్టాలు తమ హక్కులని కాలరాసే విధంగా ఉన్నాయని నిరసన తెలుపుతూ అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాయి. ఈ సంఘంలో దీపీకా పదుకునే సభ్యురాలు. వాళ్ళు పెట్టిన షరతుల ప్రకారం అమెరికాలో జరిగే ఎలాంటి ప్రోగ్రామ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనరాదు. అందుకే ఇష్టం లేకపోయినా కల్కి భామ దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఈ సమస్య లేకపోతే టీమ్ తో పాటు తను కూడా అక్కడ దర్శనమిచ్చేది. ప్రభాస్ తర్వాత టీజర్ లో రివీల్ చేసింది తనను మాత్రమే. అలాంటి అరుదయిన సందర్భంలో భాగమయ్యే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది. తన టాలీవుడ్ డెబ్యూ కూడా కల్కినే. అయితే అమితాబ్ బచ్చన్ గైర్హాజరికి కారణం మాత్రం ఆరోగ్య పరిస్థితులే అని తెలిసింది. ఒక అరుదైన సందర్భానికి వేదికగా నిలిచిన కామ్ కాన్ ని కల్కి టీమ్ బాగా సెలెబ్రేట్ చేసుకుంది. అక్కడ వచ్చిన స్పందన ఈ ప్యాన్ ఇండియా మూవీని అంతర్జాతీయ స్థాయిలో అటెన్షన్ తీసుకొచ్చింది. మున్ముందు ఇంకా భారీగా ప్లాన్ చేయబోతున్నారు.
This post was last modified on July 21, 2023 9:04 am
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…