Movie News

దీపికా పదుకునే ఎందుకు రాలేదంటే

ఒక ఇండియన్ సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా నిన్న శాన్ డియాగో వేదికగా జరిగిన కామ్ కాన్ ఫెస్టివల్ లో ప్రాజెక్ట్ కె టైటిల్ ని కల్కి 2898 AD గా రివీల్ చేయడం సోషల్ మీడియాలో సునామి సృష్టించింది. దీనికి ప్రత్యక్ష సాక్షులుగా నిలవడం కోసం ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, రానా, నాగ్ అశ్విన్, అశ్వినీదత్ తదితరులంతా హాజరయ్యారు. అయితే హీరోయిన్ దీపికా పదుకునే మాత్రం కనిపించలేదు. ముందైతే వస్తుందనే ప్రచారం జరిగింది కానీ రాలేదు. అయితే దీనికి కారణం షూటింగులు కాదు. తప్పించుకోలేని అడ్డంకి ఒకటి వచ్చి పడటంతో యాబ్సెంట్ అయ్యింది.

యుఎస్ లో మొన్న మే నెల నుంచి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ (SAG) ఆధ్వర్యంలో నడిచే అమెరికన్ ఫెడరేషన్ అఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్(AFTRA) పాటు రైటర్స్ గిల్డ్ అఫ్ అమెరికా(WGA) నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాయి. హాలీవుడ్ కార్మిక చట్టాలు తమ హక్కులని కాలరాసే విధంగా ఉన్నాయని నిరసన తెలుపుతూ అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాయి. ఈ సంఘంలో దీపీకా పదుకునే సభ్యురాలు. వాళ్ళు పెట్టిన షరతుల ప్రకారం అమెరికాలో జరిగే ఎలాంటి ప్రోగ్రామ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనరాదు. అందుకే ఇష్టం లేకపోయినా కల్కి భామ దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఈ సమస్య లేకపోతే టీమ్ తో పాటు తను కూడా అక్కడ దర్శనమిచ్చేది. ప్రభాస్ తర్వాత టీజర్ లో రివీల్ చేసింది తనను మాత్రమే. అలాంటి అరుదయిన సందర్భంలో భాగమయ్యే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది. తన టాలీవుడ్ డెబ్యూ కూడా కల్కినే. అయితే అమితాబ్ బచ్చన్ గైర్హాజరికి కారణం మాత్రం ఆరోగ్య పరిస్థితులే అని తెలిసింది. ఒక అరుదైన సందర్భానికి వేదికగా నిలిచిన కామ్ కాన్ ని కల్కి టీమ్ బాగా సెలెబ్రేట్ చేసుకుంది. అక్కడ వచ్చిన స్పందన ఈ ప్యాన్ ఇండియా మూవీని అంతర్జాతీయ స్థాయిలో అటెన్షన్ తీసుకొచ్చింది. మున్ముందు ఇంకా భారీగా ప్లాన్ చేయబోతున్నారు.

This post was last modified on July 21, 2023 9:04 am

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

42 seconds ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

18 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

22 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago