బూతు సినిమాల్ని పక్కన పెడితే.. మామూలు సినిమాలో పేరున్న భారతీయ కథానాయిక సగం సినిమాలో నగ్నంగా నటించడం అంటే మాటలు కాదు. తమిళ హీరోయిన్ అమలా పాల్ ఈ సాహసమే చేసింది. నగ్నంగా అంటే నగ్నంగా కనిపించినట్లు కాదు కానీ.. ఒంటి మీద నూలుపోగు లేని భావన కలిగించేలాగే నటించింది ‘ఆమె’ సినిమాలో అమలాపాల్.
తమిళంలో ‘ఆడై’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అమలా పాల్ చాలానే కష్టపడింది. సినిమా విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురైతే తన పారితోషకం కూడా వెనక్కిచ్చేసింది. ఐతే ఆమె కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కలేదు. ఈ చిత్రానికి ప్రశంసలు వచ్చిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కానీ బోల్డ్ అటెంప్ట్గా ఈ సినిమాకు కోలీవుడ్లో ప్రత్యేక స్థానం దక్కింది.
ఇప్పుడీ చిత్రం బాలీవుడ్కు వెళ్లబోతుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రభాస్ మూవీ సాహోలో కథానాయికగా నటించిన శ్రద్ధా కపూర్ హిందీ ‘ఆమె’లో లీడ్ రోల్ చేయనుందట. బాలీవుడ్ వాళ్లు సౌత్ కథలు తీసుకుని.. వాటికి తమదైన టచ్ ఇచ్చి సరికొత్తగా తయారు చేయడం మామూలే. ఈ కథ కూడా అలాగే హిందీలోకి వెళ్లనుంది.
ఐతే రీమేక్కు కూడా ఒరిజినల్ తీసిన రత్నకుమారే దర్శకత్వం వహిస్తాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. శ్రద్ధా కపూర్ స్టారే కానీ.. గ్లామర్ విషయంలో పరిమితులు పాటిస్తుంటుంది. అలాంటమ్మాయి ఈ బోల్డ్ ఫిలింలో ఎలా కనిపిస్తుంది.. ఎలా మెప్పిస్తుంది అన్నది ఆసక్తికరం. బాలీవుడ్లో అయినా ఈ సాహసోపేత కథకు మంచి ఫలితం వస్తుందేమో చూడాలి.
This post was last modified on August 15, 2020 11:52 am
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…