బూతు సినిమాల్ని పక్కన పెడితే.. మామూలు సినిమాలో పేరున్న భారతీయ కథానాయిక సగం సినిమాలో నగ్నంగా నటించడం అంటే మాటలు కాదు. తమిళ హీరోయిన్ అమలా పాల్ ఈ సాహసమే చేసింది. నగ్నంగా అంటే నగ్నంగా కనిపించినట్లు కాదు కానీ.. ఒంటి మీద నూలుపోగు లేని భావన కలిగించేలాగే నటించింది ‘ఆమె’ సినిమాలో అమలాపాల్.
తమిళంలో ‘ఆడై’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అమలా పాల్ చాలానే కష్టపడింది. సినిమా విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురైతే తన పారితోషకం కూడా వెనక్కిచ్చేసింది. ఐతే ఆమె కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కలేదు. ఈ చిత్రానికి ప్రశంసలు వచ్చిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కానీ బోల్డ్ అటెంప్ట్గా ఈ సినిమాకు కోలీవుడ్లో ప్రత్యేక స్థానం దక్కింది.
ఇప్పుడీ చిత్రం బాలీవుడ్కు వెళ్లబోతుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రభాస్ మూవీ సాహోలో కథానాయికగా నటించిన శ్రద్ధా కపూర్ హిందీ ‘ఆమె’లో లీడ్ రోల్ చేయనుందట. బాలీవుడ్ వాళ్లు సౌత్ కథలు తీసుకుని.. వాటికి తమదైన టచ్ ఇచ్చి సరికొత్తగా తయారు చేయడం మామూలే. ఈ కథ కూడా అలాగే హిందీలోకి వెళ్లనుంది.
ఐతే రీమేక్కు కూడా ఒరిజినల్ తీసిన రత్నకుమారే దర్శకత్వం వహిస్తాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. శ్రద్ధా కపూర్ స్టారే కానీ.. గ్లామర్ విషయంలో పరిమితులు పాటిస్తుంటుంది. అలాంటమ్మాయి ఈ బోల్డ్ ఫిలింలో ఎలా కనిపిస్తుంది.. ఎలా మెప్పిస్తుంది అన్నది ఆసక్తికరం. బాలీవుడ్లో అయినా ఈ సాహసోపేత కథకు మంచి ఫలితం వస్తుందేమో చూడాలి.
This post was last modified on August 15, 2020 11:52 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…