పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ’బ్రో‘ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందు ప్రకటించినట్లే జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తమిళ హిట్ ’వినోదియ సిత్తం‘కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందించిన సముద్రఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు.
ఒరిజినల్లో ఆయన చేసిన దేవుడి పాత్రనే ఇక్కడ పవన్ చేశాడు. ఐతే సినిమాలో పవన్ చేసింది అతిథి పాత్రలా ఉంటుందనే అంచనాతో అభిమానులు ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కు కూడా పవన్ మరీ ఎక్కువ రోజులేమీ వెళ్లలేదు. కేవలం మూడు వారాల్లో అంతా అయిపోయింది. దీంతో ఇది గెస్ట్ క్యారెక్టర్ అని బలంగా నమ్ముతున్నారు.
కానీ సినిమాలో 80-90 శాతం రన్ టైంలో పవన్ ఉంటాడని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. తొలి 15 నిమిషాలు మాత్రమే పవన్ లేకుండా కథ నడుస్తుందని తేజు వెల్లడించాడు. అప్పటిదాకా తన మీదే కథ నడుస్తుందని.. ఆ తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందని.. అక్కడి నుంచి ముగింపు వరకు పవన్ పాత్ర కొనసాగుతుందని.. ఎప్పుడూ తన వెంటే ఉండే పాత్ర ఆయనదని తేజు తెలిపాడు. సినిమాలో మొత్తంగా గంటా 50 నిమిషాల రన్ టైంలో పవన్ ఉంటాడని కూడా తేజు వెల్లడించాడు.
సినిమాలో తన మీద ఒక డ్యూయెట్ ఉంటే.. పవన్, తన కాంబినేషన్లో ఇంకో పాట ఉంటుందని.. మిగతా రెండు పాటలు మాంటేజ్ తరహాలో ఉంటాయని తేజు వెల్లడించాడు. పవన్ చేసింది దేవుడి పాత్రే అయినా.. గోపాల గోపాల తరహాలో సీరియస్ గా ఉండదని.. దాన్ని పూర్తి ఎంటర్టైనింగ్ గా.. అభిమానులకు నచ్చేలా అల్లరిగా త్రివిక్రమ్, సముద్రఖని తీర్చిదిద్దారని.. తనతో కలిసి చేయడం వల్ల పవన్ కూడా చాలా సరదాగా ఈ పాత్రను చేసుకుపోయాడని.. తమ మధ్య బాండే సినిమాకు మేజర్ హైలైట్ అని తేజు తెలిపాడు.
This post was last modified on July 19, 2023 10:56 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…