ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటే చాలా పెద్ద స్థాయిలో వందల కోట్ల పెట్టుబడితో, వివిధ భాషల కంటెంట్తో మొదలుపెట్టాల్సి ఉంటుందని.. లోకల్ స్థాయిలో అలాంటివి మొదలుపెట్టడం సాధ్యం కాదనే అభిప్రాయంతో ఉన్న చాలామందికి అల్లు అరవింద్ షాకిచ్చారు.
‘ఆహా’ పేరుతో ఈ ఏడాది ఆరంభంలో ఆయన ఓటీటీ ఫ్లాట్ఫామ్ను మొదలుపెట్టారు. ఇది పూర్తిగా తెలుగుకే పరిమితమైన యాప్ కావడం విశేషం. మామూలుగా అయితే దీనికి ఎలాంటి స్పందన వచ్చేదో కానీ.. లాక్ డౌన్ భలేగా కలిసొచ్చి ‘ఆహా’ మంచి రెస్పాన్సే తెచ్చుకుంది.
అల్లు వారి దగ్గరున్న సినిమాలకు తోడు కొత్త చిత్రాలు, ఒరిజినల్ కంటెంట్ మరీ ఎక్కువేమీ ఇవ్వకపోయినా ఇప్పటిదాకా ‘ఆహా’ యాప్కు 40 లక్షల డౌన్ లోడ్లు వచ్చాయంటే విశేషమే.
ప్రమోషన్ కూడా భారీగా ఏమీ లేకుండానే.. ఉన్నంతలో ‘ఆహా’ బాగానే విజయవంతమైందన్నది స్పష్టం. ఐతే ఇకముందు ఇలా నెట్టుకు రావడం కష్టమే. ఓన్ కంటెంట్, అది కూడా క్వాలిటీతో ఎక్కువ స్థాయిలో ఇవ్వాలి. తాము ఆ ప్రయత్నాల్లోనే ఉన్నామంటున్నారు అరవింద్.
‘ఆహా’ మొదలయ్యాక తొలిసారిగా ఆయన ఈ యాప్ గురించి మీడియాతో మాట్లాడారు. ‘ఆహా’ కోసం చాలా షోలు సిద్ధం చేస్తున్మని.. కొన్ని చర్చల దశలో ఉన్నాయని.. ఆల్రెడీ సిద్ధమైన షోలకు తోడు ఎప్పటికప్పుడు కొత్తవి రెడీ చేస్తూనే ఉంటామని ఆయనన్నారు.
థియేటర్, ఓటీటీల్లో ఏవీ దేనికీ ప్రత్యామ్నాయం కాదని.. రెండూ సమాంతరంగా నడుస్తుంటాయని ఆయనన్నారు. థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఓటీటీలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని ఆయనన్నారు. థియేటర్లు, సినిమా పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో జనాలు వీకెండ్లలో మాత్రమే థియేటర్లకు వస్తారనిపిస్తోందని.. మిగతా రోజుల్లో వినోదం కోసం ఓటీటీలు, టీవీలను ఆశ్రయించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on August 14, 2020 7:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…