ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటే చాలా పెద్ద స్థాయిలో వందల కోట్ల పెట్టుబడితో, వివిధ భాషల కంటెంట్తో మొదలుపెట్టాల్సి ఉంటుందని.. లోకల్ స్థాయిలో అలాంటివి మొదలుపెట్టడం సాధ్యం కాదనే అభిప్రాయంతో ఉన్న చాలామందికి అల్లు అరవింద్ షాకిచ్చారు.
‘ఆహా’ పేరుతో ఈ ఏడాది ఆరంభంలో ఆయన ఓటీటీ ఫ్లాట్ఫామ్ను మొదలుపెట్టారు. ఇది పూర్తిగా తెలుగుకే పరిమితమైన యాప్ కావడం విశేషం. మామూలుగా అయితే దీనికి ఎలాంటి స్పందన వచ్చేదో కానీ.. లాక్ డౌన్ భలేగా కలిసొచ్చి ‘ఆహా’ మంచి రెస్పాన్సే తెచ్చుకుంది.
అల్లు వారి దగ్గరున్న సినిమాలకు తోడు కొత్త చిత్రాలు, ఒరిజినల్ కంటెంట్ మరీ ఎక్కువేమీ ఇవ్వకపోయినా ఇప్పటిదాకా ‘ఆహా’ యాప్కు 40 లక్షల డౌన్ లోడ్లు వచ్చాయంటే విశేషమే.
ప్రమోషన్ కూడా భారీగా ఏమీ లేకుండానే.. ఉన్నంతలో ‘ఆహా’ బాగానే విజయవంతమైందన్నది స్పష్టం. ఐతే ఇకముందు ఇలా నెట్టుకు రావడం కష్టమే. ఓన్ కంటెంట్, అది కూడా క్వాలిటీతో ఎక్కువ స్థాయిలో ఇవ్వాలి. తాము ఆ ప్రయత్నాల్లోనే ఉన్నామంటున్నారు అరవింద్.
‘ఆహా’ మొదలయ్యాక తొలిసారిగా ఆయన ఈ యాప్ గురించి మీడియాతో మాట్లాడారు. ‘ఆహా’ కోసం చాలా షోలు సిద్ధం చేస్తున్మని.. కొన్ని చర్చల దశలో ఉన్నాయని.. ఆల్రెడీ సిద్ధమైన షోలకు తోడు ఎప్పటికప్పుడు కొత్తవి రెడీ చేస్తూనే ఉంటామని ఆయనన్నారు.
థియేటర్, ఓటీటీల్లో ఏవీ దేనికీ ప్రత్యామ్నాయం కాదని.. రెండూ సమాంతరంగా నడుస్తుంటాయని ఆయనన్నారు. థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఓటీటీలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని ఆయనన్నారు. థియేటర్లు, సినిమా పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో జనాలు వీకెండ్లలో మాత్రమే థియేటర్లకు వస్తారనిపిస్తోందని.. మిగతా రోజుల్లో వినోదం కోసం ఓటీటీలు, టీవీలను ఆశ్రయించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on August 14, 2020 7:13 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…