మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ తాలూకు కీలక షెడ్యూల్ కి రంగం సిద్ధమయ్యింది. కూతురు క్లింకార ఆగమనాన్ని మనసారా ఎంజాయ్ చేసిన చరణ్ హైదరాబాద్ సెట్లో కాలు పెట్టబోతున్నాడు. యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వీటి పర్యేవేక్షణతో పాటు సెకండ్ యూనిట్ కు సంబంధించిన వ్యవహారాలు హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలనుకి ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మాములుగా ఇదేమి పెద్ద విషయం కాకపోయినా శంకర్ లాంటి పర్ఫెక్షననిస్టులు ఈ పద్ధతి ఫాలో కారు.
కానీ ఇండియన్ 2 కోసం ఒత్తిడిలో ఉన్న శంకర్ కు వేరొకరికి తాత్కాలికంగా అయినా సరే బాధ్యతలు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే శైలేష్ కొలనుని నిర్మాత దిల్ రాజు రికమండేషన్ తోనే రంగంలోకి దించారట. వెంకటేష్ సైంధవ్ తో బిజీగా ఉన్న శైలేష్ వీలును బట్టి అవసరాన్ని బట్టి గేమ్ ఛేంజర్ లో భాగమవుతున్నాడు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యానికి గురైన ఈ సినిమా విడుదల విషయంలో ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. 2024 సంక్రాంతి,వేసవి రెండు సీజన్లు మిస్ చేసుకుంటే మళ్ళీ దసరా దాకా ఎదురు చూడాల్సి వస్తుంది.
దానికన్నా ముందే రావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ 2 సమ్మర్ కన్నా ముందే రాదని నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే చెప్పేశాడు కాబట్టి అది పొంగల్ బరి నుంచి తప్పుకున్నట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. అయితే మరో ఆ స్లాట్ లో గేమ్ ఛేంజర్ ని తీసుకురావాలన్న ఆలోచన ఉంది కానీ ఇప్పుడున్న అతి తక్కువ టైంలో పోస్ట్ ప్రొడక్షన్లు, ప్రమోషన్లు ఇవన్నీ అంత సులభంగా జరిగేవి కాదు. ఏది ఏమైనా ఇండియన్ 2 వల్ల శంకర్ ఎక్కువ దాని మీదే ఫోకస్ పెట్టడం, గేమ్ చేంజర్ తాలూకు అప్డేట్స్ గురించి పట్టించుకోకపోవడం ఫ్యాన్స్ ని అసంతృప్తికి గురి చేస్తోంది
This post was last modified on July 11, 2023 3:48 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…