పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కొత్త పుకార్లు మొదలయ్యాయి. సినిమా ఆపేస్తున్నారని, కేవలం వారం పది రోజుల షూటింగే జరిగింది కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ డ్రాప్ అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం షురూ చేశారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు. వారాహి యాత్ర గ్రాండ్ సక్సెస్ కావడంతో తక్కువ గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ రెండో విడతకు రెడీ అయ్యారు. ఈ వేడిలోనే వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు తిరిగితే జనసేనను జనానికి మరింత దగ్గర చేయొచ్చనే ప్రణాళికలో భాగంగా ప్లాన్ చేసుకున్నారు.
ఇలాంటి పరిస్థితిలో షూటింగులు కొనసాగించడం కష్టం. అసలు బ్రోకే డబ్బింగ్ ఎప్పుడు చెప్పాలో టైం దొరకనంత టైట్ గా షెడ్యూల్ ఉంది. రిలీజ్ ఇంకో ఇరవై రోజులే ఉంది కాబట్టి వీలైనంత త్వరలోనే ఆ లాంఛనం పూర్తి చేస్తారు కానీ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లకు బ్రేక్ తప్పదు. అది చిన్నదా లేక పెద్దదా అనేది ఇప్పటికిప్పుడు తేలదు. ఎన్నికలు ముందస్తుగా రావొచ్చనే రాజకీయ విశ్లేషకుల అంచనాలను ఆధారంగా చేసుకుని పవన్ ప్రజా క్షేత్రంలోనే ఉండటం అవసరం కనక సినిమాలకు ఎక్కువ టైం కేటాయించడం సాధ్యపడదు. అందుకే ఒకటి రెండు రద్దు చేస్తారని చెబుతున్నారు.
అయితే నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు కాబట్టి ఇదంతా గాలి వార్తగానే తీసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు హరీష్ శంకర్ త్వరలోనే రవితేజతో కాంబో రిపీట్ చేస్తారనే వార్త పైన న్యూస్ కి మరింత బలం చేకూర్చింది. స్టోరీ ఫిక్స్ చేసిన మాట వాస్తవమే కానీ ఎప్పుడు మొదలుపెట్టాలనేది ఇద్దరూ నిర్ణయించుకోలేదు. రవితేజ తన కమిట్మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది వేసవి దాకా ఫ్రీ అయ్యే సూచనలు తక్కువే. ఆలోగా ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయాలనేది హరీష్ టార్గెట్. ఏ పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో ఇప్పుడే చెప్పలేం
This post was last modified on July 8, 2023 1:43 pm
వైసీపీ అధినేత జగన్ మరింత బద్నాం అవుతున్నారా? ఆయన చేస్తున్న పనులపై కూటమి సర్కారు ప్రజల్లో ప్రచారం చేస్తోందా ?…
ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు. రాజకీయ పరిష్వంగాన్ని వదిలించుకుని.. గుట్టు విప్పేస్తున్న…
తెలుగు ప్రేక్షకులకు కార్తీ అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా ఖైదీ. అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించి అక్కడి…
మలయాళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ లెక్కల్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండే హీరో.. మోహన్ లాల్. ఆ ఇండస్ట్రీలో కలెక్షన్ల రికార్డుల్లో చాలా…
తెలుగు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. అన్వేష్. ‘నా అన్వేషణ’ పేరుతో అతను…
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…