పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కొత్త పుకార్లు మొదలయ్యాయి. సినిమా ఆపేస్తున్నారని, కేవలం వారం పది రోజుల షూటింగే జరిగింది కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ డ్రాప్ అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం షురూ చేశారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు. వారాహి యాత్ర గ్రాండ్ సక్సెస్ కావడంతో తక్కువ గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ రెండో విడతకు రెడీ అయ్యారు. ఈ వేడిలోనే వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు తిరిగితే జనసేనను జనానికి మరింత దగ్గర చేయొచ్చనే ప్రణాళికలో భాగంగా ప్లాన్ చేసుకున్నారు.
ఇలాంటి పరిస్థితిలో షూటింగులు కొనసాగించడం కష్టం. అసలు బ్రోకే డబ్బింగ్ ఎప్పుడు చెప్పాలో టైం దొరకనంత టైట్ గా షెడ్యూల్ ఉంది. రిలీజ్ ఇంకో ఇరవై రోజులే ఉంది కాబట్టి వీలైనంత త్వరలోనే ఆ లాంఛనం పూర్తి చేస్తారు కానీ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లకు బ్రేక్ తప్పదు. అది చిన్నదా లేక పెద్దదా అనేది ఇప్పటికిప్పుడు తేలదు. ఎన్నికలు ముందస్తుగా రావొచ్చనే రాజకీయ విశ్లేషకుల అంచనాలను ఆధారంగా చేసుకుని పవన్ ప్రజా క్షేత్రంలోనే ఉండటం అవసరం కనక సినిమాలకు ఎక్కువ టైం కేటాయించడం సాధ్యపడదు. అందుకే ఒకటి రెండు రద్దు చేస్తారని చెబుతున్నారు.
అయితే నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు కాబట్టి ఇదంతా గాలి వార్తగానే తీసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు హరీష్ శంకర్ త్వరలోనే రవితేజతో కాంబో రిపీట్ చేస్తారనే వార్త పైన న్యూస్ కి మరింత బలం చేకూర్చింది. స్టోరీ ఫిక్స్ చేసిన మాట వాస్తవమే కానీ ఎప్పుడు మొదలుపెట్టాలనేది ఇద్దరూ నిర్ణయించుకోలేదు. రవితేజ తన కమిట్మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది వేసవి దాకా ఫ్రీ అయ్యే సూచనలు తక్కువే. ఆలోగా ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయాలనేది హరీష్ టార్గెట్. ఏ పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో ఇప్పుడే చెప్పలేం
This post was last modified on July 8, 2023 1:43 pm
వేలంటైన్స్ డే వీకెండ్లో తెలుగులో మూడు పేరున్న చిత్రాలు రిలీజయ్యాయి. ఐతే అందులో ‘ఫంకీ’, ‘సీతాపయనం’ ప్రేక్షకుల నుంచి ఆశించిన…
గత వారం పది రోజులుగా తెరచాటునే ఉన్న `కోవా బన్` వివాదం.. రెండురోజుల నుంచి తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకుంది.…
ఒక సినిమా ఫలితంలో దర్శకత్వం తర్వాత ప్రధానంగా బాధ్యత వహించే విభాగం ఎడిటింగ్. పైకి ఏదో కత్తిరింపులు అతికింపులు అనే…
మాస్ రాజా రవితేజ చివరి హిట్ ఏది అంటే ఆయన అభిమానులు కూడా తడుముకునే పరిస్థితి. 2022లో వచ్చిన ‘ధమాకా’…
నయనతార కథానాయికగా పరిచయం అయి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా…
ఫీల్ గుడ్ ప్రేమకథలు సక్సెస్ కావాలంటే హీరో హీరోయిన్ల పెర్ఫార్మన్స్ చాలా కీలకం. ఏ ఒక్కరు తేడా చేసినా అవుట్…