నాగశౌర్య చివరి మూణ్నాలుగు సినిమాలు తీవ్ర నిరాశకే గురి చేశాయి. అతడి కొత్త సినిమా ‘రంగబలి’కి కొన్ని రోజుల ముందు వరకు అసలేమాత్రం బజ్ లేదు. ఆ టైటిలే జనాలకు పెద్దగా ఆసక్తి కలిగించలేదు. మేకింగ్ దశలో ఉండగా ఈ సినిమా గురించి అసలు చర్చే లేదు. అలాంటి సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.. చిత్ర బృందం వారం కిందట రిలీజ్ చేసిన ఒక ప్రమోషనల్ వీడియో.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన కమెడియన్ సత్యతో కలిసి నాగశౌర్య చేసిన ఈ వీడియో ఇన్స్టంట్ హిట్ అయింది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు కొందరు జర్నలిస్టులను అనుకరిస్తూ సత్య చేసిన హంగామా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. ప్రోమోను చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేసి.. సోషల్ మీడియాలో దీన్నొక సెన్సేషన్గా మార్చింది టీం. ప్రోమో చూసి ఫుల్ వీడియో మీద చాలా అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు.
ఇందులో సత్య అనుకరించిన జర్నలిస్టుల్లో ఇద్దరు ఈ వీడియో చూసి హర్టయ్యారని.. అందుకే ఫుల్ వీడియో రిలీజ్ చేయట్లేదని మధ్యలో వార్తలు వచ్చాయి. అది తెలిసి చాలామంది ప్రేక్షకులు నిరాశ చెందారు. ఫుల్ వీడియో కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. చివరికి నిన్న ఒక పార్ట్, ఈ రోజొక పార్ట్గా ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఐతే ప్రోమో చూసి ఏదో ఊహించుకున్న ప్రేక్షకులకు ఫుల్ వీడియో కిక్ ఇవ్వలేదు.
వీడియోలో హైలైట్లన్నీ ప్రోమోలోనే వెళ్లిపోయాయి తప్ప.. అంతకుమించిన మెరుపులు ఏమీ లేవిందులో. అక్కడక్కడా కొంచెం ఫన్ మినహాయిస్తే.. పేలిపోయే కామెడీ అంటూ కనిపించలేదు. ఆశించినంత క్రియేటివిటీని చిత్ర బృందం చూపించలేకపోయింది. ఎంతో ఆసక్తిగా వీడియో చూసిన ప్రేక్షకులంతా ఇప్పుడు నిట్టూరుస్తున్నారు. కాకపోతే ప్రోమో వల్ల బాగానే ప్రయోజనం పొందిన చిత్ర బృందం ఇప్పుడొస్తున్న నెగెటివిటీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు.
This post was last modified on July 5, 2023 4:36 pm
మంచో చెడో.. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక మాట అనేశారు. జగన్ చాలా నేర్చుకోవాలి అని! ఔను. ఇది…
రాజకీయం రంగులు మార్చుకుంటుంది. ఇది ఫక్తు వాస్తవం. ముందు ఒక మాట అనేయడం.. దాని వల్ల వచ్చే పర్వ వసానాలు…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత ఆప్తులైన అధికారులు చాలా మంది ఉన్నారు. ఆయన వస్తే.. పొర్లు దండాలు పెట్టినవారు…
తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ రెండు పదుల వయసులో కూడా లేని స్థితిలో క్యాన్సర్ బారిన పడి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లో ఉన్న గోశాలకు పండగ వచ్చింది. సుమారు 30 గోవులను ఈ గోశాలలో పెంచు తున్నారు.…
డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత వరస డిజాస్టర్లతో టాలీవుడ్ మార్కెట్ కోల్పోయిన హీరోయిన్ కృతి శెట్టి మలయాళం…