నాగశౌర్య చివరి మూణ్నాలుగు సినిమాలు తీవ్ర నిరాశకే గురి చేశాయి. అతడి కొత్త సినిమా ‘రంగబలి’కి కొన్ని రోజుల ముందు వరకు అసలేమాత్రం బజ్ లేదు. ఆ టైటిలే జనాలకు పెద్దగా ఆసక్తి కలిగించలేదు. మేకింగ్ దశలో ఉండగా ఈ సినిమా గురించి అసలు చర్చే లేదు. అలాంటి సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.. చిత్ర బృందం వారం కిందట రిలీజ్ చేసిన ఒక ప్రమోషనల్ వీడియో.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన కమెడియన్ సత్యతో కలిసి నాగశౌర్య చేసిన ఈ వీడియో ఇన్స్టంట్ హిట్ అయింది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు కొందరు జర్నలిస్టులను అనుకరిస్తూ సత్య చేసిన హంగామా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. ప్రోమోను చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేసి.. సోషల్ మీడియాలో దీన్నొక సెన్సేషన్గా మార్చింది టీం. ప్రోమో చూసి ఫుల్ వీడియో మీద చాలా అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు.
ఇందులో సత్య అనుకరించిన జర్నలిస్టుల్లో ఇద్దరు ఈ వీడియో చూసి హర్టయ్యారని.. అందుకే ఫుల్ వీడియో రిలీజ్ చేయట్లేదని మధ్యలో వార్తలు వచ్చాయి. అది తెలిసి చాలామంది ప్రేక్షకులు నిరాశ చెందారు. ఫుల్ వీడియో కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. చివరికి నిన్న ఒక పార్ట్, ఈ రోజొక పార్ట్గా ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఐతే ప్రోమో చూసి ఏదో ఊహించుకున్న ప్రేక్షకులకు ఫుల్ వీడియో కిక్ ఇవ్వలేదు.
వీడియోలో హైలైట్లన్నీ ప్రోమోలోనే వెళ్లిపోయాయి తప్ప.. అంతకుమించిన మెరుపులు ఏమీ లేవిందులో. అక్కడక్కడా కొంచెం ఫన్ మినహాయిస్తే.. పేలిపోయే కామెడీ అంటూ కనిపించలేదు. ఆశించినంత క్రియేటివిటీని చిత్ర బృందం చూపించలేకపోయింది. ఎంతో ఆసక్తిగా వీడియో చూసిన ప్రేక్షకులంతా ఇప్పుడు నిట్టూరుస్తున్నారు. కాకపోతే ప్రోమో వల్ల బాగానే ప్రయోజనం పొందిన చిత్ర బృందం ఇప్పుడొస్తున్న నెగెటివిటీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…