నాగశౌర్య చివరి మూణ్నాలుగు సినిమాలు తీవ్ర నిరాశకే గురి చేశాయి. అతడి కొత్త సినిమా ‘రంగబలి’కి కొన్ని రోజుల ముందు వరకు అసలేమాత్రం బజ్ లేదు. ఆ టైటిలే జనాలకు పెద్దగా ఆసక్తి కలిగించలేదు. మేకింగ్ దశలో ఉండగా ఈ సినిమా గురించి అసలు చర్చే లేదు. అలాంటి సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.. చిత్ర బృందం వారం కిందట రిలీజ్ చేసిన ఒక ప్రమోషనల్ వీడియో.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన కమెడియన్ సత్యతో కలిసి నాగశౌర్య చేసిన ఈ వీడియో ఇన్స్టంట్ హిట్ అయింది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు కొందరు జర్నలిస్టులను అనుకరిస్తూ సత్య చేసిన హంగామా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. ప్రోమోను చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేసి.. సోషల్ మీడియాలో దీన్నొక సెన్సేషన్గా మార్చింది టీం. ప్రోమో చూసి ఫుల్ వీడియో మీద చాలా అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు.
ఇందులో సత్య అనుకరించిన జర్నలిస్టుల్లో ఇద్దరు ఈ వీడియో చూసి హర్టయ్యారని.. అందుకే ఫుల్ వీడియో రిలీజ్ చేయట్లేదని మధ్యలో వార్తలు వచ్చాయి. అది తెలిసి చాలామంది ప్రేక్షకులు నిరాశ చెందారు. ఫుల్ వీడియో కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. చివరికి నిన్న ఒక పార్ట్, ఈ రోజొక పార్ట్గా ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఐతే ప్రోమో చూసి ఏదో ఊహించుకున్న ప్రేక్షకులకు ఫుల్ వీడియో కిక్ ఇవ్వలేదు.
వీడియోలో హైలైట్లన్నీ ప్రోమోలోనే వెళ్లిపోయాయి తప్ప.. అంతకుమించిన మెరుపులు ఏమీ లేవిందులో. అక్కడక్కడా కొంచెం ఫన్ మినహాయిస్తే.. పేలిపోయే కామెడీ అంటూ కనిపించలేదు. ఆశించినంత క్రియేటివిటీని చిత్ర బృందం చూపించలేకపోయింది. ఎంతో ఆసక్తిగా వీడియో చూసిన ప్రేక్షకులంతా ఇప్పుడు నిట్టూరుస్తున్నారు. కాకపోతే ప్రోమో వల్ల బాగానే ప్రయోజనం పొందిన చిత్ర బృందం ఇప్పుడొస్తున్న నెగెటివిటీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…