కొణిదెల ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలున్నారు కానీ.. అక్కడి నుంచి హీరోయిన్ అయింది మాత్రం ఒక్క కొణిదెల నిహారిక మాత్రమే. అందుకు తగ్గట్లే ఆమెకు మీడియాలో, సోషల్ మీడియాలో మంచి ప్రచారమే లభిస్తుంటుంది. సినీ రంగంలో ఆశించిన విజయం సాధించకపోయినా.. ఉన్నన్నాళ్లూ నిహారిక వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఈ మధ్య ఉన్నట్లుండి పెళ్లి వార్తతో ఆమె వార్తల్లోకి వచ్చింది. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమెకు పెళ్లి ఖాయమైంది. గురువారం వీరి నిశ్చితార్థం కూడా అయిపోయింది. కరోనా నేపథ్యంలో వీలైనంత సింపుల్గానే ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుక పూర్తయిక కొద్దిసేపటికే నాగబాబు కొంచెం చమత్కారం కలిపిన ఓ ఎమోషనల్ ట్వీట్తో అందరి దృష్టిని ఆకర్షించారు.
తన అల్లుడిని ‘డియర్ చై’.. అంటూ ఆత్మీయంగా సంబోధించిన ఆయన.. నిహారిక చాలా విషయాల్లో తన లాగే ఉంటుందని అందరూ అంటుంటారని.. ఆమె మీద ప్రపంచంలోని ప్రేమనంతా చూపిస్తావని ఆశిస్తున్నా అని అన్నారు. ఇక చివరగా ఓ కామెంట్తో నాగబాబు తన ఫన్నీ యాంగిల్ చూపించారు. ‘‘ఈ రోజు నుంచి అధికారికంగా తను నీ సమస్య’’ అని ముగించారు నాగబాబు. తోడుగా ఒక కొంటె ఎమోజీని కూడా ఆయన జోడించారు.
ముందు కొంచెం ఎమోషనల్గా అనిపించినా చివరికి వచ్చేసరికి సరదాగా ఉన్న ఈ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ కూడా తన తండ్రి షేర్ చేసిన నిశ్చితార్థపు ఫొటోనే షేర్ చేస్తూ.. తన బేబీ సిస్టర్కు నిశ్చితార్థం జరిగిందని అంటూ ‘వెల్కం టు ద ఫ్యామిలీ బావా’ అని చైతన్యకు ఆహ్వానం పలికాడు. ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి డిసెంబరులో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on August 14, 2020 9:35 am
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…
ఏపీ మంత్రి నారా లోకేష్పై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు నిలబడి.. ప్రజలకు…