కొణిదెల ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలున్నారు కానీ.. అక్కడి నుంచి హీరోయిన్ అయింది మాత్రం ఒక్క కొణిదెల నిహారిక మాత్రమే. అందుకు తగ్గట్లే ఆమెకు మీడియాలో, సోషల్ మీడియాలో మంచి ప్రచారమే లభిస్తుంటుంది. సినీ రంగంలో ఆశించిన విజయం సాధించకపోయినా.. ఉన్నన్నాళ్లూ నిహారిక వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఈ మధ్య ఉన్నట్లుండి పెళ్లి వార్తతో ఆమె వార్తల్లోకి వచ్చింది. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమెకు పెళ్లి ఖాయమైంది. గురువారం వీరి నిశ్చితార్థం కూడా అయిపోయింది. కరోనా నేపథ్యంలో వీలైనంత సింపుల్గానే ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుక పూర్తయిక కొద్దిసేపటికే నాగబాబు కొంచెం చమత్కారం కలిపిన ఓ ఎమోషనల్ ట్వీట్తో అందరి దృష్టిని ఆకర్షించారు.
తన అల్లుడిని ‘డియర్ చై’.. అంటూ ఆత్మీయంగా సంబోధించిన ఆయన.. నిహారిక చాలా విషయాల్లో తన లాగే ఉంటుందని అందరూ అంటుంటారని.. ఆమె మీద ప్రపంచంలోని ప్రేమనంతా చూపిస్తావని ఆశిస్తున్నా అని అన్నారు. ఇక చివరగా ఓ కామెంట్తో నాగబాబు తన ఫన్నీ యాంగిల్ చూపించారు. ‘‘ఈ రోజు నుంచి అధికారికంగా తను నీ సమస్య’’ అని ముగించారు నాగబాబు. తోడుగా ఒక కొంటె ఎమోజీని కూడా ఆయన జోడించారు.
ముందు కొంచెం ఎమోషనల్గా అనిపించినా చివరికి వచ్చేసరికి సరదాగా ఉన్న ఈ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ కూడా తన తండ్రి షేర్ చేసిన నిశ్చితార్థపు ఫొటోనే షేర్ చేస్తూ.. తన బేబీ సిస్టర్కు నిశ్చితార్థం జరిగిందని అంటూ ‘వెల్కం టు ద ఫ్యామిలీ బావా’ అని చైతన్యకు ఆహ్వానం పలికాడు. ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి డిసెంబరులో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on August 14, 2020 9:35 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…