ఇండియన్ స్పిల్ బర్గ్ గా పిలుచుకునే దర్శకుడు శంకర్ ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు చేయడం పెద్ద తలనెప్పిని తెచ్చి పెడుతోంది. ఇండియన్ 2 షూటింగ్ అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చినప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఒప్పుకున్నాడు. తీరా విక్రమ్ బ్లాక్ బస్టర్ అయ్యాక లైకాకి ఆశలు చిగురించి కోర్టు ద్వారా కమల్ హాసన్ మూవీని పూర్తి చేసేలా శంకర్ మీద ఒత్తిడి తీసుకు రాగలిగింది. దీంతో చరణ్ నిర్మాత దిల్ రాజు నిస్సహాయంగా తనకు ఇచ్చిన డేట్లకు షూటింగ్ ఏర్పాట్లు చేయడం తప్ప ఏమీ చేయలేకేపోయారు. దీని వల్లే రిలీజ్ డేట్ ఎప్పుడనేది తేలలేదు.
వచ్చే సంక్రాంతికి ఇండియన్ 2 వస్తుందనే అందరూ నమ్మారు. అదే జరిగితే వేసవిలో గేమ్ ఛేంజర్ చూడొచ్చని మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఇది జరిగేలా లేదు. తన లేటెస్ట్ రిలీజ్ మామన్నన్ ప్రమోషన్లలో భాగంగా హీరో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఇండియన్ 2 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని సెలవిచ్చాడు. కమల్ ప్రాజెక్టులో ఈయన నిర్మాణ భాగస్వామి. పక్కా సమాచారం లేనిదే ఊరికే చెప్పడు. ఇంకో ఇరవై శాతం షూటింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు చాలా ఉన్నాయట. అందుకే టైం పడుతుందని అన్నాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ జనవరిని ఆల్రెడీ మిస్ చేసుకున్న గేమ్ ఛేంజర్ ఇప్పుడు సమ్మర్ ని కూడా పోగొట్టుకున్నట్టే. ఎందుకంటే ఒకే సీజన్ లో తన రెండు సినిమాలు విడుదల చేసేందుకు శంకర్ ఒప్పుకోడని ఆల్రెడీ టాక్ ఉంది. అదే జరిగితే 2024 దసరా లేదా దీపావళి తప్ప చరణ్ దిల్ రాజులకు మరో ఆప్షన్ ఉండదు. ఇప్పటికే విపరీతమైన జాప్యంతో అసహనంగా ఉన్న ఫ్యాన్స్ కి ఇది షాక్ ఇచ్చేదే. ఇదంతా తెలిసే అభిమానులు ఎంత ఒత్తిడి చేస్తున్నా ఎస్విసి సంస్థ గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇవ్వడం మానేసింది. సో ఎలా చూసుకున్నా దీనికి లాంగ్ వెయిటింగ్ తప్పదు.
This post was last modified on June 29, 2023 10:24 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…