కేవలం నెల రోజుల్లో విడుదల పెట్టుకుని బ్రో సినిమా తాలూకు రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇవ్వకపోవడం పట్ల పవన్ అభిమానులు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద నిరసన వ్యక్తం చేస్తూనే వచ్చారు. సోషల్ మీడియాలో ఆ ఎఫెక్ట్ కనిపించింది. ఎప్పుడో ఆగస్ట్ లో వచ్చే భోళా శంకర్ కి ఆల్రెడీ ఒక లిరికల్ వీడియో, టీజర్ రాగా బ్రో మాత్రం రెండు మూడు పోస్టర్లతో సరిపెట్టారు. వాళ్ళను చల్లార్చేందుకు ఇవాళ వదిలిన కొత్త లుక్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ కిక్ ఇస్తోంది. ఎప్పుడో తమ్ముడులో చూసిన ఊరమాస్ బీడీ, పంచెకట్టు లుక్కులో చూసి వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. కాస్త చల్లబడ్డారు
ఇది ఓకే కానీ అసలు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే డౌట్ రావడం సహజం. దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది జనసేన వారాహి యాత్ర. పవన్ పవర్ ఫుల్ స్పీచులకు జనం నుంచి బ్రహ్మాండమైన వస్తోంది. కార్యకర్తలు, ఫాలోయర్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఇలాంటి టైంలో సినిమాల గురించి హడావిడి చేస్తే ఫ్యాన్స్ డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది గుర్తించే సమయం తక్కువగా ఉన్నా బ్రో టీమ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చింది. పొలిటికల్ గా హైలైట్ అవ్వాల్సిన టైంలో సినిమాల గురించి ఎందుకనేదే ఈ స్ట్రాటజీ
ఇక రెండో రీజన్ ఆదిపురుష్ విడుదల. తెలుగు హక్కులను నూటా ఎనభై కోట్లకు కొన్న పీపుల్స్ మీడియా దాని ప్రమోషన్లు, బిజినెస్ వ్యవహారాలు, లాభనష్టాలు తదితర పనుల్లో చాలా బిజీగా ఉంది. అందుకే బ్రో మీద ఎక్కువ ఫోకస్ లేదు. ఇప్పుడు వారాహి యాత్రకు బ్రేక్ తో పాటు ఆదిపురుష్ ఫైనల్ రన్ కు దగ్గర పడటంతో బ్రో ప్రమోషన్లు ఊపందుకోబోతున్నాయి. ఒక్క టీజరే బిజినెస్ ని అమాంతం రెట్టింపు చేస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు . ప్రస్తుతానికి రేట్లయితే భారీగా చెబుతున్నారట. మొత్తానికి జూలై 28 దాకా బ్రో తాలూకు సందడితో ఆన్ లైన్ హోరెత్తిపోవడం ఖాయం
This post was last modified on June 27, 2023 4:12 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…