ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కెలో లోకనాయకుడు కమల్ హాసన్ ఎంట్రీ వైజయంతి మూవీస్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు చిన్న వీడియోతో కూడిన అనౌన్స్ మెంట్ ని ఇచ్చారు. ఈ వార్త కొద్దిరోజుల క్రితమే లీకైనప్పటికీ యూనిట్ తరఫున ధ్రువీకరణ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత అనుమానంతో ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది కాబట్టి అంచనాలు రెట్టింపు వేగంతో పరుగులు పెట్టడం ఖాయం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కమల్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారు.
ఆగస్ట్ నుంచి కమల్ భాగానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ప్రభాస్ కమల్ లను ఒకే ఫ్రేమ్ లో చూసుకోవడం కన్నా కావాల్సింది ఏముంటుంది. సుమారు అయిదు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కెలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని, అనుపమ్ ఖేర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. వీళ్లకు కమల్ తోడవ్వడం కంటే ఎలివేషన్ వేరే ఏమొస్తుంది. నిజానికి సోలో హీరోగా తప్ప ఇతరుల సినిమాల్లో పాత్రలు వేయడం కమల్ ఎప్పుడో మానేశారు. కానీ దీనికి ఓకే చెప్పారంటే నాగ అశ్విన్ ఏ రేంజ్ లో క్యారెక్టర్ ని డిజైన్ చేశారో.
వచ్చే ఏడాది జనవరి 12 రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ప్రాజెక్ట్ కె ఆ లక్ష్యాన్ని చేరుకోగలదా లేదానేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంకా షూట్ చాలా బ్యాలన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ సమయం కావాలి. మరి చేతిలో ఉన్న ఆరు నెలలతో ఆ డెడ్ లైన్ మీట్ కావడం చాలా కష్టం. అందుకే 2024 వేసవి లేదా దసరాకి మారొచ్చనే వార్త ఉంది కానీ అదెంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ప్రాజెక్ట్ కె మీదున్న హైప్ ని చూస్తుంటే వెయ్యి కోట్ల బిజినెస్ సాధ్యమే అనిపిస్తోంది మరి.
This post was last modified on June 25, 2023 1:01 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…