ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కెలో లోకనాయకుడు కమల్ హాసన్ ఎంట్రీ వైజయంతి మూవీస్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు చిన్న వీడియోతో కూడిన అనౌన్స్ మెంట్ ని ఇచ్చారు. ఈ వార్త కొద్దిరోజుల క్రితమే లీకైనప్పటికీ యూనిట్ తరఫున ధ్రువీకరణ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత అనుమానంతో ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది కాబట్టి అంచనాలు రెట్టింపు వేగంతో పరుగులు పెట్టడం ఖాయం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కమల్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారు.
ఆగస్ట్ నుంచి కమల్ భాగానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ప్రభాస్ కమల్ లను ఒకే ఫ్రేమ్ లో చూసుకోవడం కన్నా కావాల్సింది ఏముంటుంది. సుమారు అయిదు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కెలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని, అనుపమ్ ఖేర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. వీళ్లకు కమల్ తోడవ్వడం కంటే ఎలివేషన్ వేరే ఏమొస్తుంది. నిజానికి సోలో హీరోగా తప్ప ఇతరుల సినిమాల్లో పాత్రలు వేయడం కమల్ ఎప్పుడో మానేశారు. కానీ దీనికి ఓకే చెప్పారంటే నాగ అశ్విన్ ఏ రేంజ్ లో క్యారెక్టర్ ని డిజైన్ చేశారో.
వచ్చే ఏడాది జనవరి 12 రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ప్రాజెక్ట్ కె ఆ లక్ష్యాన్ని చేరుకోగలదా లేదానేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంకా షూట్ చాలా బ్యాలన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ సమయం కావాలి. మరి చేతిలో ఉన్న ఆరు నెలలతో ఆ డెడ్ లైన్ మీట్ కావడం చాలా కష్టం. అందుకే 2024 వేసవి లేదా దసరాకి మారొచ్చనే వార్త ఉంది కానీ అదెంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ప్రాజెక్ట్ కె మీదున్న హైప్ ని చూస్తుంటే వెయ్యి కోట్ల బిజినెస్ సాధ్యమే అనిపిస్తోంది మరి.
This post was last modified on June 25, 2023 1:01 pm
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…