ఏ ముహూర్తాన మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ల సినిమాకు శ్రీకారం చుట్టారో కానీ.. ఈ సినిమాకు ఏదీ కలిసి రావడం లేదు. స్క్రిప్టు ఒక పట్టాన ఓకే కాలేదు. షూటింగ్ ఆలస్యం అయింది. ఒకసారి సినిమా మొదలయ్యాక.. కథ, షూట్ చేసిన సన్నివేశాల మీద సంతృప్తి చెందక.. షూట్ ఆపి.. మళ్లీ వేరే కథ తయారు చేసి దాన్ని పట్టాలెక్కించడం.. ఆ తర్వాత కూడా చిత్రీకరణకు ఏదో ఒక అడ్డంకి రావడం.. ఈ సినిమా కష్టాలు ఎడతెగని విధంగా కొనసాగుతున్నాయి.
ఈ మధ్య టీజర్ రిలీజ్ కావడంతో అంతా సర్దుకుందని.. ఇక సంక్రాంతి లక్ష్యంగా సినిమాను ముందుకు తీసుకెళ్లడమే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ సినిమా గురించి నెగెటివ్ న్యూస్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు తమన్ను తప్పించారన్నారు. కానీ అది నిజం కాదని తేలింది. తర్వాతేమో హీరోయిన్ పూజా హెగ్డే మీద వేటు పడిందన్నారు. ఈ న్యూస్ మాత్రం నిజమే అనిపిస్తోంది.
త్రివిక్రమ్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడం అన్నది ఎవ్వరూ ఊహించని విషయం. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి పూజానే త్రివిక్రమ్కు ఫేవరెట్. ఆయనకు ఎవరైనా హీరోయిన్ మీద గురి కుదిరితే వరుసగా మూడు సినిమాలు చేస్తాడని పేరుంది. ఇంతకుముందు సమంతతో అలాగే మూడు సినిమాలు (అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ) చేశాడు. తర్వాత ఆమెను పక్కన పెట్టి పూజా హెగ్డేతో ట్రావెల్ అయ్యాడు. ఆమెతో వరుసగా అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు చేసి.. ‘గుంటూరు కారం’కు కూడా ఆమెనే కథానాయికగా ఎంచుకున్నాడు.
కానీ ఈ సినిమా నుంచి పూజా తప్పుకున్నట్లు వార్తలు రావడంతో వీరి కలయికలో హ్యాట్రిక్ మిస్సయింది. పూజాతో త్రివిక్రమ్ రిలేషన్ గురించి మీమ్ పేజీలు కొన్నేళ్ల నుంచి ఎన్నో జోకులు పేలుస్తున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ ఆమెను పక్కన పెట్టడం మీదా మీమ్స్ హోరెత్తుతున్నాయి. త్రివిక్రమ్ మనసు ఇప్పుడు సంయుక్త వైపు మళ్లిందని.. గతంలో సమంతను పక్కన పెట్టినట్లే పూజాను ఇప్పుడు సైడ్ చేసి ఆమెకు ప్రయారిటీ ఇవ్వబోతున్నాడని.. పూజా స్థానాన్ని సంయుక్తనే భర్తీ చేయబోతోందని పంచులు పేలుస్తున్నారు నెటిజన్లు. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.
This post was last modified on June 21, 2023 7:09 pm
ఇటీవలే ది ఫ్యామిలీ స్టార్ రూపంలో ఊహించని డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ నిజానికి గీత గోవిందంని మించిన అంచనాలు…
తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్…
బీహార్ లో బీజేపీ కోటకు బీటలు వారుతున్నాయి. 2019 ఎన్నికలలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి బీహార్…
గతంలో పుష్పలో శ్రీవల్లి పాత్రతోనే ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు బాలీవుడ్ లో పెద్ద బ్రేక్ ఇచ్చింది…
మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏదీ సూపర్ హిట్ అనిపించుకోలేదు. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మొదటి రెండు…
ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అక్కడ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. మే 10 నుండి ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే…