కొందరు హీరోల సంగీత దర్శకుల కాంబినేషన్లు భలే కుదురుతాయి. ఒకటి రెండు హిట్లు పడగానే కొన్ని సంవత్సరాల పాటు అలాగే కొనసాగిస్తారు. ఇళయరాజా, రెహమాన్ లకు ఇలాంటి కలయికలు చాలానే ఉన్నాయి. అయితే ఎంఎం కీరవాణి – చిరంజీవికి మాత్రం ఎందుకో ఎక్కువసార్లు కాంబో రాలేదు. వీళ్లిద్దరి ఫస్ట్ కాంబినేషన్ ఘరానా మొగుడు. ఇండస్ట్రీ హిట్ సాధించిన ఆ బ్లాక్ బస్టర్ అప్పట్లో మ్యూజికల్ గానూ పెద్ద సెన్సేషన్. దీని తర్వాతే కీరవాణికి మాస్ ఎంటర్ టైనర్లు క్యూ కట్టాయి. ఆపద్బాంధవుడు ఆల్బమ్ ఎవర్ గ్రీన్ అనిపించుకుంది కానీ కమర్షియల్ ఫలితం డిజాస్టర్
చివరిసారి చేతులు కలిపింది 1994లో వచ్చిన ఎస్పి పరశురాంతో. శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది. పాటలు కూడా సోసోగానే వెళ్లాయి. ఆ తర్వాత మెగాస్టార్ పూర్తిగా కోటి, మణిశర్మల వైపు షిఫ్ట్ అయిపోవడంతో తిరిగి ఇంకో సినిమా కుదరలేదు. తిరిగి ఇప్పుడు చిరు కోసం కీరవాణి సంగీతం ఇవ్వబోతున్నారని టాక్. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే ఫాంటసీ సబ్జెక్టుకి ఆయనైతే న్యాయం చేయగలరని భావించి ఆ మేరకు ఫైనల్ చేసినట్టు వినికిడి. అఫీషియల్ ప్రకటన రావటానికి టైం పట్టొచ్చు.
ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కి వెళ్ళిపోయిన కీరవాణితో అంటే చిరంజీవి నో అని ఎలా అంటారు. పైగా ఇంత గ్యాప్ తర్వాత అంటే ఖచ్చితంగా అంచనాలతో పాటు అవుట్ ఫుట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ముల్లోక వీరుడు టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్ ని భోళా శంకర్ రిలీజయ్యాక ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా వెల్లడించే అవకాశాలున్నాయి. కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో చేయాల్సిన మూవీతో పాటు దీన్ని సమాంతరంగా షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తారట. రెండూ వచ్చే ఏడాది రిలీజయ్యేలా సెట్ చేసుకుంటున్నారు
This post was last modified on June 19, 2023 5:53 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…