వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ద్వారంపూడికి భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ చూపిస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తన తాతయ్యకు అప్పటి జిల్లా ఎస్పీ డీటీ నాయక్ బేడీలు వేసి తీసుకువెళ్లారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ద్వారంపూడి మండిపడ్డారు. తన తాతకు బేడీలు వేసి తీసుకువెళ్ళలేదని క్లారిటీనిచ్చారు. కానీ, అదే కాకినాడలో పవన్ చేతికి బేడీలు వేసి కొట్టించగలరని ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన చేతికి బేడీలు వేయడం పవన్ జన్మలో సాధ్యం కాదని అన్నారు. నీ సంగతి చూస్తానని, దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని పవన్ కు ద్వారంపూడి చాలెంజ్ చేశారు. చంద్రబాబును దేహి అని అడుక్కుంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ కు సీట్ ఇస్తే పోటీ చేయాలని సవాల్ విసిరారు. రెడ్డి సామాజిక వర్గాన్ని పవన్ ద్వేషిస్తున్నారని ఆరోపించారు. తాను రౌడీ, కబ్జాకోరు అయితే జనం గెలిపిస్తారా అని ప్రశ్నించారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని, ప్యాకేజీ కుదరకపోవడంతోనే వారాహి యాత్ర చేపడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీఎం చేయాలని కోరుతున్నారని, కానీ, కొద్ది రోజుల క్రితం తనకు సీఎం పదవి అడిగే అర్హత లేదని పవన్ చెప్పారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను అంటూనే పూనమ్ కౌర్, రేణు దేశాయ్ లపై ద్వారంపూడి షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ గురించి వారిద్దరూ బయటికి వచ్చి మాట్లాడుతామంటున్నారని అన్నారు. పవన్ డ్రగ్స్ వాడతారని అందరికీ తెలుసని, కానీ, ఆ విషయంలో తనకు క్లారిటీ లేదని అన్నారు. తాను కాకినాడలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, పవన్ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారా? అని ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు.
జనసేన చంద్రబాబు కోసం పనిచేస్తుందో రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందో చెప్పాలని నిలదీశారు. తాను మూడుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచానని, పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని, తనను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. కాకినాడలో 50 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని, అన్ని సామాజిక వర్గాల ప్రజల నుంచి తనకు మద్దతు ఉంది కాబట్టే ఎన్నికలలో రెండుసార్లు గెలిచానని ద్వారంపూడి అన్నారు. పవన్ కు పరిటాల రవి గుండు కొట్టిచ్చారని, సీఎం కావాలన్న పవన్ కోరిక సినిమాలోనే తీరుతుందని చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…
నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…