ఇటీవలే రామబాణంతో చేదు ఫలితాన్ని అందుకున్న మెచో స్టార్ గోపీచంద్ కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఏ కాంబినేషన్ తనకు వర్కౌట్ కావడం లేదు. రొటీన్ కథలు వద్దని ఫలితాలు పదే పదే హెచ్చరికలు చేస్తున్నా కమర్షియల్ జానర్ ని వదలకుండా హిట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా ఈసారి గేరు మార్చినట్టే కనిపిస్తోంది. కన్నడ దర్శకుడు ఏ హర్షతో చేస్తున్న సినిమాకి భీమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న గోపీచంద్ ఎక్స్ ప్రెషన్ తో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.
స్క్రీన్ మీద గోపీచంద్ ఖాకీ చొక్కా తొడిగి పద్నాలుగు సంవత్సరాలయ్యింది. చివరిసారి 2010 పూరి గోలీమార్ లో గంగారాంగా చూపించిన విశ్వరూపం అందరికీ గుర్తే. అంతకు ముందు శౌర్యం, ఆంధ్రుడులో కూడా ఈ తరహా పాత్రలు చేశాడు. అయితే ఇవన్నీ బ్లాక్ బస్టర్లు కాకపోయినా తీవ్రంగా నిరాశపరిచినవి కావు. అందుకే భీమా మీద ఆ కోణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక దర్శకుడు హర్ష విషయానికి వస్తే ఇతను మామూలోడు కాదు. బాలయ్య శివరాజ్ కుమార్ కాంబో ప్రాజెక్టు ఇతనే చేయబోతున్నాడు. మూడు భాగాల సిరీస్ లో రజనీకాంత్ నటించే అవకాశం కూడా ఉంది
ఇతని ట్రాక్ రికార్డు చూస్తే డార్క్ టోన్ లో స్టైలిష్ కం ఫాంటసీ ఎంటర్ టైనర్లు బాగా తీస్తాడు. భజరంగి రెండు భాగాలు దానికి మంచి ఉదాహరణ. వేద ఇక్కడ ఆడలేదు కానీ శాండల్ వుడ్ లో రెవిన్యూ పరంగా బాగా పే చేసింది. రారండోయ్ వేడుక చూద్దాం. విశాల్ పూజలను కన్నడ లో రీమేక్ చేసుకుని హిట్లు కొట్టాడు. పునీత్ రాజ్ కుమార్ తో అంజనీ పుత్ర అనే సక్సెస్ ఫుల్ మూవీ చేశాడు. సో భీమా మీద నమ్మకం పెట్టుకోవచ్చనే వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. కెజిఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న గోపీచంద్ ఈసారి పోలీస్ దుస్తుల్లో ఏం రచ్చ చేయబోతున్నాడో
This post was last modified on June 12, 2023 1:02 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…