టాలీవుడ్లో ఇప్పుడు ఫ్యాన్ వార్స్ తీరే మారిపోయింది. ఒకప్పుడు వంద రోజుల సెంటర్లు.. ఆపై కలెక్షన్ల లెక్కల మీద కొట్టేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లకు సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ట్వీట్లే యుద్ధాలకు ఆయుధాలుగా మారిపోయాయి. వీటన్నింట్లోకి కొత్త ట్రెండ్ అంటే.. తమ హీరోల పుట్టిన రోజుల్ని పురస్కరించుకుని హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేయడమే. మిలియన్లకు మిలియన్ల ట్వీట్లు అలవోకగా వేసేస్తూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు అభిమానులు.
తాజాగా మహేష్ అభిమానులు తమ ఆరాధ్య నటుడి పుట్టిన రోజును పురస్కరించుకుని 24 గంటల వ్యవధిలో ఏకంగా 60 మిలియన్ ట్వీట్లు వేసిన చరిత్ర సృష్టించారు. ఇది వరల్డ్ రికార్డ్ అని అంటున్నారు.
ఐతే ఆఫ్ లైన్ అయినా.. ఆన్ లైన్ అయినా ఫాలోయింగ్ విషయంలో మెగా హీరోలు ఎవరికీ తీసిపోరు. రికార్డులు నెలకొల్పడంలో, బద్దలు కొట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మహేష్ అభిమానులు నెలకొల్పిన రికార్డు వాళ్లకు కొత్త టార్గెట్ అయింది.
ఈ మధ్య సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రానున్న నేపథ్యంలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ట్రెండు మీదే ఏకంగా 28 మిలియన్ ట్వీట్లు వేసిన ఘనత వాళ్లది. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ 60 మిలియన్లు కొట్టిన నేపథ్యంలో దాన్ని కొట్టడమే కాదు.. కొత్త శిఖరాల్ని అందుకోవాలన్నది పవన్ ఫ్యాన్స్ ఆకాంక్ష. ఇందుకోసం ఏకంగా 100 మిలియన్ ట్వీట్లను టార్గెట్గా పెట్టేసుకున్నారు. పవన్ పుట్టిన రోజు కంటే ముందు చిరంజీవి బర్త్ డే రాబోతోంది ఆగస్టు 22న. ఆ రోజు కూడా ట్విట్టర్ సందడి ఓ రేంజిలో ఉండే అవకాశముంది.
ఓవరాల్గా మెగా ఫ్యాన్స్ కలిసి 100 మిలియన్ ట్వీట్ల కోసం ట్రై చేసే అవకాశాలున్నాయి. అప్పుడు సాధ్య పడ్డా పడకపోయినా.. పవన్ పుట్టిన రోజుకు మాత్రం 100 మిలియన్ ట్వీట్లు వేయాలన్న టార్గెట్ పెట్టుకుని రెడీ అవుతున్నారు ఫ్యాన్స్.
This post was last modified on August 10, 2020 3:34 pm
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…