టాలీవుడ్లో ఇప్పుడు ఫ్యాన్ వార్స్ తీరే మారిపోయింది. ఒకప్పుడు వంద రోజుల సెంటర్లు.. ఆపై కలెక్షన్ల లెక్కల మీద కొట్టేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లకు సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ట్వీట్లే యుద్ధాలకు ఆయుధాలుగా మారిపోయాయి. వీటన్నింట్లోకి కొత్త ట్రెండ్ అంటే.. తమ హీరోల పుట్టిన రోజుల్ని పురస్కరించుకుని హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేయడమే. మిలియన్లకు మిలియన్ల ట్వీట్లు అలవోకగా వేసేస్తూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు అభిమానులు.
తాజాగా మహేష్ అభిమానులు తమ ఆరాధ్య నటుడి పుట్టిన రోజును పురస్కరించుకుని 24 గంటల వ్యవధిలో ఏకంగా 60 మిలియన్ ట్వీట్లు వేసిన చరిత్ర సృష్టించారు. ఇది వరల్డ్ రికార్డ్ అని అంటున్నారు.
ఐతే ఆఫ్ లైన్ అయినా.. ఆన్ లైన్ అయినా ఫాలోయింగ్ విషయంలో మెగా హీరోలు ఎవరికీ తీసిపోరు. రికార్డులు నెలకొల్పడంలో, బద్దలు కొట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మహేష్ అభిమానులు నెలకొల్పిన రికార్డు వాళ్లకు కొత్త టార్గెట్ అయింది.
ఈ మధ్య సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రానున్న నేపథ్యంలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ట్రెండు మీదే ఏకంగా 28 మిలియన్ ట్వీట్లు వేసిన ఘనత వాళ్లది. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ 60 మిలియన్లు కొట్టిన నేపథ్యంలో దాన్ని కొట్టడమే కాదు.. కొత్త శిఖరాల్ని అందుకోవాలన్నది పవన్ ఫ్యాన్స్ ఆకాంక్ష. ఇందుకోసం ఏకంగా 100 మిలియన్ ట్వీట్లను టార్గెట్గా పెట్టేసుకున్నారు. పవన్ పుట్టిన రోజు కంటే ముందు చిరంజీవి బర్త్ డే రాబోతోంది ఆగస్టు 22న. ఆ రోజు కూడా ట్విట్టర్ సందడి ఓ రేంజిలో ఉండే అవకాశముంది.
ఓవరాల్గా మెగా ఫ్యాన్స్ కలిసి 100 మిలియన్ ట్వీట్ల కోసం ట్రై చేసే అవకాశాలున్నాయి. అప్పుడు సాధ్య పడ్డా పడకపోయినా.. పవన్ పుట్టిన రోజుకు మాత్రం 100 మిలియన్ ట్వీట్లు వేయాలన్న టార్గెట్ పెట్టుకుని రెడీ అవుతున్నారు ఫ్యాన్స్.
This post was last modified on August 10, 2020 3:34 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…