యాక్టర్స్ సినిమాళ్లో ఎమోషన్ కి తగ్గట్టుగా ఏడవటం సహజమే. అదే బయట ఒక యాక్టర్ కన్నీరు పెడితే అది హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా సిద్దార్థ్ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే .. సిద్దార్థ్ నటించిన టక్కర్ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా కొన్ని రోజులుగా తెలుగు , తమిళ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సిద్దార్థ్. తాజాగా సిద్దు ఓ తమిళ సంస్థ కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సంస్థ సిద్దార్థ్ ఇరవై ఏళ్ల కెరీర్ గురించి ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగా సిద్దార్థ్ ను శంకర్ కి నటుడిగా పరిచయం చేసిన సుజాత గారిని పిలిపించి సిద్దు కి సర్పయిజ్ ఇచ్చారు.
సుజాత గారిని చూడగానే సిద్దు ఎమోషనల్ అవుతూ ఆమె కాళ్ళపై పడిపోయి కన్నీరు పెట్టుకున్నాడు. ఆమె లేకపోతే ఈ ఇరవై ఏళ్లు ఇలా ఉండేవి కాదని చెప్తూ భావోద్వేగం చెందాడు. ఇక అనంతరం సుజాత సిద్దు గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. స్క్రీన్ రైటర్ సుజాత రంగరాజన్ భార్య అయిన సుజాత సిద్దార్థ్ లో ఉన్న నటుడిని గుర్తించి శంకర్ కి రిఫర్ చేయమని చెప్పారట. కానీ రంగరాజన్ అందుకు ఒప్పుకోలేదని సిద్దు డైరెక్టర్ అవుతాడని ఆయన నిరాకరిస్తే ఆమె స్వయంగా శంకర్ తో మాట్లాడి సిద్దార్థ్ ను బాయ్స్ సినిమాకి రిఫర్ చేశారట. మొదట సిద్దు బాయ్స్ ఆఫర్ ను ఒప్పుకోలేదని , ఆ సమయంలో మణిరత్నం బలవంతంగా చెప్పి ఒప్పించారని ఆమె పేర్కొంది.
ఇదంతా ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్న ప్రేక్షకులు సిద్దు ఆమె పై చూపించిన గ్రాటిట్యూడ్ కి మెచ్చుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిద్దార్థ్ కన్నీరు పెట్టుకున్న వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.
This post was last modified on June 8, 2023 7:07 pm
వైసీపీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలను మంత్రులు అస్సలు ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా వెనుకాడవద్దని ఆయన…
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం…
జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్…
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…