Movie News

ఆమెను చూసి ఏడ్చేసిన సిద్దార్థ్

యాక్టర్స్ సినిమాళ్లో ఎమోషన్ కి తగ్గట్టుగా ఏడవటం సహజమే. అదే బయట ఒక యాక్టర్ కన్నీరు పెడితే అది హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా సిద్దార్థ్ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే .. సిద్దార్థ్ నటించిన టక్కర్ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా కొన్ని రోజులుగా తెలుగు , తమిళ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సిద్దార్థ్. తాజాగా సిద్దు ఓ తమిళ సంస్థ కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సంస్థ సిద్దార్థ్ ఇరవై ఏళ్ల కెరీర్ గురించి ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగా సిద్దార్థ్ ను శంకర్ కి నటుడిగా పరిచయం చేసిన సుజాత గారిని పిలిపించి సిద్దు కి సర్పయిజ్ ఇచ్చారు. 

సుజాత గారిని చూడగానే సిద్దు ఎమోషనల్ అవుతూ ఆమె కాళ్ళపై పడిపోయి కన్నీరు పెట్టుకున్నాడు. ఆమె లేకపోతే ఈ ఇరవై ఏళ్లు ఇలా ఉండేవి కాదని చెప్తూ భావోద్వేగం చెందాడు. ఇక అనంతరం సుజాత సిద్దు గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. స్క్రీన్ రైటర్ సుజాత రంగరాజన్ భార్య అయిన సుజాత సిద్దార్థ్ లో ఉన్న నటుడిని గుర్తించి శంకర్ కి రిఫర్ చేయమని చెప్పారట. కానీ రంగరాజన్ అందుకు ఒప్పుకోలేదని సిద్దు డైరెక్టర్ అవుతాడని ఆయన నిరాకరిస్తే ఆమె స్వయంగా శంకర్ తో మాట్లాడి సిద్దార్థ్ ను బాయ్స్ సినిమాకి రిఫర్ చేశారట. మొదట సిద్దు బాయ్స్ ఆఫర్ ను ఒప్పుకోలేదని , ఆ సమయంలో మణిరత్నం బలవంతంగా చెప్పి ఒప్పించారని ఆమె పేర్కొంది. 

ఇదంతా ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్న ప్రేక్షకులు సిద్దు ఆమె పై చూపించిన గ్రాటిట్యూడ్ కి మెచ్చుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిద్దార్థ్ కన్నీరు పెట్టుకున్న వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.

This post was last modified on June 8, 2023 7:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

1 hour ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

2 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

3 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

4 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

4 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

5 hours ago