పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ప్రాధాన్యత క్రమంలో మూడు సినిమాలున్నాయి. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ఆ తర్వాత బ్రో. చివరిదే మొదట విడుదలవుతున్నా కంటెంట్ పరంగా అది రీమేక్ కావడం, కమర్షియల్ అంశాలు మరీ ఎక్కువగా ఉండే అవకాశం లేకపోవడం వల్ల సుజిత్, హరీష్ శంకర్ లకు ప్లస్ అవుతోంది. అయితే వీటికన్నా ముందు మొదలైన పవన్ కళ్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు మీద బజ్ దాదాపుగా జీరోకు వచ్చేసింది. అప్డేట్స్ ఇవ్వడం ఆపేసిన నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు క్రిష్ లు అడుగుదామన్నా బయట కనిపించడం లేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం హరిహర వీరమల్లుకి లాంగ్ వెయిటింగ్ తప్పదు . ఎందుకంటే పవన్ ఈ నెలలో వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నాడు. రాజకీయంగా యాక్టివ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఎన్నికలు కాస్త ముందుగానే జరిగేలా ఉన్నాయి. అదే నిజమైతే పొత్తులు కన్ఫర్మ్ చేసుకుని ఎలక్షన్ క్యాంపైన్ కి సిద్ధమవ్వాల్సి ఉంటుంది. జనసేన తరఫున జనానికి కనిపించాల్సిన ఫ్రంట్ ఇమేజ్ తానే కావడంతో షూటింగులతో పొలిటికల్ ఎఫైర్స్ బ్యాలన్స్ చేయడం కష్టం. బ్రో ఎలాగూ అయిపోయింది. మిగిలిన వాటిలో ముందు ఓజి పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేస్తారు.
టైం ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్లు దొరుకుతాయి. ఇక హరిహర వీరమల్లు కోసం పవన్ తిరిగి హెయిర్ స్టైల్ ని పెంచాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన షెడ్యూల్స్ లో సహజమైన జుట్టుతో నటించాడు కాబట్టి ఇప్పుడు విగ్గు వాడితే బాగుండదు. అందుకే లేట్ అయినా సరే పనులన్నీ పూర్తి చేసుకుని అప్పుడు తిరిగి వీరమల్లు లుక్ లోకి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగిందంటే మాత్రం మళ్ళీ బ్రేక్ తప్పదు. ఎంత విపరీతమైన జాప్యం అవుతున్నా ఏఎం రత్నంకు ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్ లేదు. మధ్యలో అగ్నిప్రమాదం లాంటి దుర్ఘటనలు గాయం మీద కారం చల్లుతున్నాయి
This post was last modified on June 4, 2023 4:13 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…