వేసవిలో భారీ చిత్రాలు లేక టాలీవుడ్ బాక్సాఫీస్ కళ తప్పిందనే చెప్పాలి. దీంతో ఈ సీజన్ తర్వాత రానున్న ప్రభాస్ భారీ చిత్రం ‘ఆదిపురుష్’ కోసం ఇటు ట్రేడ్ వర్గాలు, అటు ప్రేక్షకులతో పాటు మొత్తంగా ఇండస్ట్రీ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇంకో మూడు వారాల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ‘ఆదిపురుష్’ను రిలీజ్ చేయడానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి.
తెలుగులో ఈ సినిమాకు మంచి బజ్ ఉండగా.. దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 6న తిరుపతి వేదికగా ‘ఆదిపురుష్’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చింది. ఆ ఈవెంట్ను నభూతో అనే స్థాయిలో నిర్వహించడానికి ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
తిరుపతి మొత్తం రామ నామ స్మరణతో మార్మోగిపోయేలా ఈ ఈవెంట్ను నిర్వహించబోతున్నారట. ఇందుకోసం ముంబయి నుంచి వంద మంది గాయకులు.. రెండొందల మంది డ్యాన్సర్లను రప్పిస్తున్నారట. వీళ్లంతా కలిసి రాముడి మీద అద్భుత గీతాలను పెర్ఫామ్ చేయబోతున్నారట. వంద మంది కలిసి ఒకేసారి పాటలు పాడితే.. ఎలాంటి రీసౌండ్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈవెంట్కు లక్ష మందికి తక్కువ కాకుండా అభిమానులు వస్తారన్న అంచనాతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక వాళ్లంతా కూడా కలిసి రామ నామస్మరణ చేస్తే ఈవెంట్ హోరెత్తిపోవడం ఖాయం. టాప్ యాంకర్ సుమనే ఈ ఈవెంట్కు వ్యాఖ్యానాన్ని అందించబోతోంది. ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ సహా యూనిట్లో కీలకమైన వ్యక్తులందరూ ఈ ఈవెంట్లో సందడి చేయనున్నారు. దేశమంతా చర్చించుకునేలా ఈ ఈవెంట్ను చేయడం కోసం కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.
This post was last modified on June 2, 2023 8:54 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…