గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మధ్య తెలుగులో తీస్తున్న డైరెక్ట్ సినిమాల కంటే.. అనువాద చిత్రాలతోనే మంచి ఫలితాలు అందుకుంటోంది. ఆ సంస్థ నుంచి గత ఏడాది వ్యవధిలో వచ్చిన స్ట్రెయిట్ సినిమాలు పక్కా కమర్షియల్, వినరో భాగ్యము విష్ణు కథ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. కానీ కన్నడ అనువాద చిత్రం ‘కాంతార’ అనూహ్యమైన వసూళ్లతో అదరగొట్టింది. అలాగే తమిళ డబ్బింగ్ మూవీ ‘విడుదల’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది.
తాజాగా మలయాళ అనువాద చిత్రం ‘2018’ సైతం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది. కేరళలో సంచలన విజయం సాధిస్తూ మాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన చిత్రమిది. కాంతార, విడుదల సినిమాల మాదిరే.. ఒరిజినల్ వెర్షన్లు మంచి టాక్ తెచ్చుకుని మంచి రన్తో సాగుతున్న టైంలోనే హడావుడిగా దీన్ని కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు. అయినా జనం ఈ సినిమాను బాగానే చూస్తున్నారు.
గత వారం విడుదలైన తెలుగు చిత్రాల్లో ‘మేమ్ ఫేమస్’ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ‘మళ్ళీ పెళ్ళి’ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ రెంటితో పోలిస్తే ‘2018’కే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఆ సినిమాలు నెమ్మదిస్తుంటే.. ఈ చిత్రం మాత్రం అంతకంతకూ వసూళ్లు పెంచుకుంటూ వెళ్లింది. ఉన్న వాటిలో బెస్ట్ మూవీగా దీనికే ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారు. సినిమా కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కినప్పటికీ.. అందులోని ఎమోషన్లు మాత్రం భాషా భేదం లేకుండా అందరినీ ఆకట్టుకునేవే.
ముఖ్యంగా ఈ చిత్రానికి సెకండాఫ్ మేజర్ హైలైట్గా నిలిచింది. తొలి రోజు నుంచి నిలకడగా వసూళ్లు రాబట్టిన ‘2018’ ఇప్పటికే నాలుగు కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం. ఈ చిత్ర హక్కుల కోసం గీతా వారు పెట్టిన పెట్టుబడి కోటి రూపాయలేనట. దీనికి కొంత డబ్బింగ్, పబ్లిసిటీ ఖర్చు తోడైంది. అలా అని వాటి కోసం కూడా పెద్దగా ఏమీ ఖర్చు పెట్టేయలేదు. మొత్తానికి సినిమా మీద రూపాయి పెడితే నాలుగు రూపాయల ఆదాయం అంటే ఇది బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి.
This post was last modified on June 1, 2023 11:45 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…