కరోనా వల్ల పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ఇబ్బంది పడ్డ వాళ్లే. టాలీవుడ్ బిగ్ షాట్స్లో ఒకరైన దిల్ రాజు కూడా అందుకు మినహాయింపు కాదు. ఆయన ఫస్ట్ కాపీ తీసి రెడీగా ఉంచుకునున ‘వి’ చిత్రం.. ఇక విడుదలే తరువాయి అనుకున్న తరుణంలో లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. ఓటీటీ రిలీజ్ కోసం మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ.. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్లోనే రిలీజ్ చేయాలని ఆయన ఎదురు చూస్తున్నారు.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ‘వి’ మాత్రమే కాదు.. రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’ సైతం ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా అన్ని ప్రణాళికలనూ దెబ్బ తీసింది. ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ ఇంకా మిగిలి ఉండటంతో దాని విడుదల గురించి ఇప్పుడే ఆలోచించే పరిస్థితి లేదు. ‘వి’ సంగతే తేల్చాల్సి ఉంది.
అందరు నిర్మాతల్లాగే థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి.. మళ్లీ జనం ఎప్పుడు హాళ్లలో సినిమాలు చూసేందుకు వస్తారు అని ఎదురు చూసి చూసి అలసిపోతున్నాడు రాజు. ఆగస్టుకల్లా పరిస్థితులు బాగుపడతాయి. సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని ముందు అనుకున్నాడు. తర్వాత దసరాపై ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అప్పటికి కూడా థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడుస్తాయన్న ఆశ లేదు.
ఐతే అక్టోబరు నవంబరు నెలలకు కరోనా వ్యాక్సిన్ రావడమో.. లేక హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి కరోనా భయం తొలగిపోవడమో జరిగి థియేటర్లు తెరుస్తారని.. కొన్ని వారాలు చిన్నా చితకా సినిమాలతో ట్రయల్ రన్ నడిపించాక.. క్రిస్మస్కు ‘వి’ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసుకోవచ్చని రాజు ఆశిస్తున్నట్లు సమాచారం. అదీ కాదంటే సంక్రాంతి గురించి ఆలోచిస్తాడేమో. ప్రస్తుతానికైతే ‘వి’ క్రిస్మస్కు విడుదల కావచ్చన్నది అంచనా.
This post was last modified on August 9, 2020 7:39 am
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…