ది కేరళ స్టోరీ.. ఈ మధ్య కాలంలో ఎంతో వివాదాస్పదం అయిన సినిమా. విడుదలకు ముందు ట్రైలర్తోనే ఈ చిత్రం సంచలనం రేపింది. కేరళలో హిందూ, ఇతర మతాల అమ్మాయిలను వలలో వేసుకుని వారిని ఇస్లాం మతంలోకి మార్చి ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడం.. హింసకు పాల్పడటం.. ఈ నేపథ్యంలో సుదీప్తో సేన్ రూపొందించిన ఈ చిత్రం అనేక వివాదాలకు దారి తీసింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మద్దతుతో కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే ముస్లింల మీద విషం చిమ్మేలా రూపొందించిన ప్రాపగండా ఫిలిం ఇదంటూ లిబరల్స్ మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం కూడా విధించాయి. కానీ అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనికి పన్ను మినహాయింపును కూడా ఇచ్చాయి. విమర్శల సంగతి పక్కన పెడితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుంది.
ఐతే విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ సినిమా విషయంలో తన వ్యతిరేకతను బయటపెట్టాడు. నేను ఎప్పుడూ ఒకటే మాట చెబుతుంటాను. నాకు ప్రాపగండా సినిమాలు నచ్చవు. సినిమా టైటిల్ కింద నిజమైన కథ అని రాసినంత మాత్రాన సరిపోదు. అలా రాసినంత మాత్రాన అది నిజమైన కథ అయిపోదు అంటూ కేరళ స్టోరీ సినిమాపై చురకలు వేశారు కమల్ హాసన్.
ఈ సినిమా మీద విమర్శలు చేస్తే మోడీ అండ్ కోకు కోపం వస్తుందేమో అని సెలబ్రెటీలు భయపడి ఉంటారు కానీ.. కమల్ మాత్రం బోల్డ్గా తన అభిప్రాయం చెప్పారు. కేరళలో 30 వేల మందికి పైగా హిందూ, ఇతర మతాల అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతం మార్పించారని ఈ చిత్ర రూపకర్తలు ముందు ప్రకటించగా.. దానిపై వివాదం చెలరేగడంతో తర్వాత అలా జరిగింది ముగ్గురికే అంటూ మాట మార్చారు. వివాదాలను దాటుకుని ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
This post was last modified on May 29, 2023 12:32 am
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…