ది కేరళ స్టోరీ.. ఈ మధ్య కాలంలో ఎంతో వివాదాస్పదం అయిన సినిమా. విడుదలకు ముందు ట్రైలర్తోనే ఈ చిత్రం సంచలనం రేపింది. కేరళలో హిందూ, ఇతర మతాల అమ్మాయిలను వలలో వేసుకుని వారిని ఇస్లాం మతంలోకి మార్చి ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడం.. హింసకు పాల్పడటం.. ఈ నేపథ్యంలో సుదీప్తో సేన్ రూపొందించిన ఈ చిత్రం అనేక వివాదాలకు దారి తీసింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మద్దతుతో కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే ముస్లింల మీద విషం చిమ్మేలా రూపొందించిన ప్రాపగండా ఫిలిం ఇదంటూ లిబరల్స్ మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం కూడా విధించాయి. కానీ అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనికి పన్ను మినహాయింపును కూడా ఇచ్చాయి. విమర్శల సంగతి పక్కన పెడితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుంది.
ఐతే విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ సినిమా విషయంలో తన వ్యతిరేకతను బయటపెట్టాడు. నేను ఎప్పుడూ ఒకటే మాట చెబుతుంటాను. నాకు ప్రాపగండా సినిమాలు నచ్చవు. సినిమా టైటిల్ కింద నిజమైన కథ అని రాసినంత మాత్రాన సరిపోదు. అలా రాసినంత మాత్రాన అది నిజమైన కథ అయిపోదు అంటూ కేరళ స్టోరీ సినిమాపై చురకలు వేశారు కమల్ హాసన్.
ఈ సినిమా మీద విమర్శలు చేస్తే మోడీ అండ్ కోకు కోపం వస్తుందేమో అని సెలబ్రెటీలు భయపడి ఉంటారు కానీ.. కమల్ మాత్రం బోల్డ్గా తన అభిప్రాయం చెప్పారు. కేరళలో 30 వేల మందికి పైగా హిందూ, ఇతర మతాల అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతం మార్పించారని ఈ చిత్ర రూపకర్తలు ముందు ప్రకటించగా.. దానిపై వివాదం చెలరేగడంతో తర్వాత అలా జరిగింది ముగ్గురికే అంటూ మాట మార్చారు. వివాదాలను దాటుకుని ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
This post was last modified on May 29, 2023 12:32 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…