సీనియర్ నటుడు నరేష్ హీరోగా ఈ రోజుల్లో సినిమా తీయడం అన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే. యువ నటుల సినిమాలకే జనాలు థియేటర్లకు రావడం తగ్గించేస్తున్న రోజుల్లో ఆయన హీరోగా సినిమా తీస్తే ఆడియన్స్ కనీసం పట్టించుకుంటారా అనిపిస్తుంది. కానీ తన వ్యక్తిగత జీవితంలో ముడిపడ్డ సంఘటనలనే ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో పెట్టడం.. తన నిజ జీవిత భాగస్వామి పవిత్ర లోకేష్నే తనకు జోడీగా ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు నరేష్.
అగ్రెసివ్ ప్రమోషన్లతో ఈ సినిమా గురించి జనాలు చర్చించుకునేలా చేసి.. తొలి రోజు ఓ మోస్తరుగా థియేటర్లు నిండేలా చేయగలిగారు. ఐతే ప్రమోషన్లలో నరేష్తో పాటు టీంలో ఎవ్వరిని అడిగినా ఇది నిజ జీవిత కథ కాదు అనే చెప్పారు. ఇది ఫిక్షనల్ స్టోరీ అని.. అందరూ కనెక్టవుతారని… సెన్సేషనల్ విషయాలు ఉంటాయని.. ఇంకా చాలా మాటలే చెప్పారు.
తీరా చూస్తే సినిమాలో అవేవీ లేవు. కేవలం తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న వివాదాల గురించి క్లారిటీ ఇవ్వడానికి.. తాను ఉత్తముడినని చెప్పడానికి నరేష్ ఈ సినిమా తీసినట్లు అనిపించింది. నరేష్కు, ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి అసలు గొడవేంటి.. పవిత్ర లోకేష్తో ఈయన బంధం ఎలా మొదలైంది అనే విషయాల్లో జనాలకు కొన్ని సందేహాలు, కొంత క్యూరియాసిటీ ఉన్న మాట వాస్తవం.
వీటికి బదులివ్వాలని అనుకుంటే నరేష్ ఒక పర్సనల్, బోల్డ్ ఇంటర్వ్యూ ఇస్తే సరిపోయేది. మొత్తం ఏం చెప్పాలనుకున్నారో అదంతా చెబితే పోయేది. ఒక సెన్సేషనల్ ప్రోమో కట్ చేస్తే ఆటోమేటిగ్గా జనాలు ఆ ఇంటర్వ్యూ చూసేస్తారు. కానీ నరేష్ మాత్రం ఆ మార్గాన్ని వదిలేసి.. కోట్లు ఖర్చు పెట్గి ఎం.ఎస్.రాజుతో ఒక సినిమానే తీయించేశారు.
ఈ సినిమా చూస్తే మరీ ఏకపక్షంగా.. నరేష్, పవిత్రలను ఉత్తమోత్తములుగా చూపిస్తూ.. వాళ్ల మాజీ భాగస్వాములు పరమ నీచులు అనేలా చిత్రీకరించారు. వాళ్లలో చెడు లక్షణాలు ఉండొచ్చు కానీ.. మరీ ఇంత ఏకపక్షంగా, మరీ ఎగ్జాజరేట్ చేసి చూపించడం. వీళ్లు చాలా మంచి వాళ్లు… తప్పంతా వాళ్లదే అనడం మాత్రం అన్యాయంగానే అనిపిస్తుంది. నరేష్కు డబ్బుంది కాబట్టి ఈ సినిమా తీశారు.. మరి అవతలి వాళ్లు తమ వెర్షన్ ఎలా వినిపించాలి? వాళ్లకూ డబ్బుంటే అదే పని చేసేవారేమో.
This post was last modified on May 27, 2023 4:52 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…