సీనియర్ నటుడు నరేష్ హీరోగా ఈ రోజుల్లో సినిమా తీయడం అన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే. యువ నటుల సినిమాలకే జనాలు థియేటర్లకు రావడం తగ్గించేస్తున్న రోజుల్లో ఆయన హీరోగా సినిమా తీస్తే ఆడియన్స్ కనీసం పట్టించుకుంటారా అనిపిస్తుంది. కానీ తన వ్యక్తిగత జీవితంలో ముడిపడ్డ సంఘటనలనే ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో పెట్టడం.. తన నిజ జీవిత భాగస్వామి పవిత్ర లోకేష్నే తనకు జోడీగా ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు నరేష్.
అగ్రెసివ్ ప్రమోషన్లతో ఈ సినిమా గురించి జనాలు చర్చించుకునేలా చేసి.. తొలి రోజు ఓ మోస్తరుగా థియేటర్లు నిండేలా చేయగలిగారు. ఐతే ప్రమోషన్లలో నరేష్తో పాటు టీంలో ఎవ్వరిని అడిగినా ఇది నిజ జీవిత కథ కాదు అనే చెప్పారు. ఇది ఫిక్షనల్ స్టోరీ అని.. అందరూ కనెక్టవుతారని… సెన్సేషనల్ విషయాలు ఉంటాయని.. ఇంకా చాలా మాటలే చెప్పారు.
తీరా చూస్తే సినిమాలో అవేవీ లేవు. కేవలం తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న వివాదాల గురించి క్లారిటీ ఇవ్వడానికి.. తాను ఉత్తముడినని చెప్పడానికి నరేష్ ఈ సినిమా తీసినట్లు అనిపించింది. నరేష్కు, ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి అసలు గొడవేంటి.. పవిత్ర లోకేష్తో ఈయన బంధం ఎలా మొదలైంది అనే విషయాల్లో జనాలకు కొన్ని సందేహాలు, కొంత క్యూరియాసిటీ ఉన్న మాట వాస్తవం.
వీటికి బదులివ్వాలని అనుకుంటే నరేష్ ఒక పర్సనల్, బోల్డ్ ఇంటర్వ్యూ ఇస్తే సరిపోయేది. మొత్తం ఏం చెప్పాలనుకున్నారో అదంతా చెబితే పోయేది. ఒక సెన్సేషనల్ ప్రోమో కట్ చేస్తే ఆటోమేటిగ్గా జనాలు ఆ ఇంటర్వ్యూ చూసేస్తారు. కానీ నరేష్ మాత్రం ఆ మార్గాన్ని వదిలేసి.. కోట్లు ఖర్చు పెట్గి ఎం.ఎస్.రాజుతో ఒక సినిమానే తీయించేశారు.
ఈ సినిమా చూస్తే మరీ ఏకపక్షంగా.. నరేష్, పవిత్రలను ఉత్తమోత్తములుగా చూపిస్తూ.. వాళ్ల మాజీ భాగస్వాములు పరమ నీచులు అనేలా చిత్రీకరించారు. వాళ్లలో చెడు లక్షణాలు ఉండొచ్చు కానీ.. మరీ ఇంత ఏకపక్షంగా, మరీ ఎగ్జాజరేట్ చేసి చూపించడం. వీళ్లు చాలా మంచి వాళ్లు… తప్పంతా వాళ్లదే అనడం మాత్రం అన్యాయంగానే అనిపిస్తుంది. నరేష్కు డబ్బుంది కాబట్టి ఈ సినిమా తీశారు.. మరి అవతలి వాళ్లు తమ వెర్షన్ ఎలా వినిపించాలి? వాళ్లకూ డబ్బుంటే అదే పని చేసేవారేమో.
This post was last modified on May 27, 2023 4:52 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…