సీనియర్ నటుడు నరేష్ హీరోగా ఈ రోజుల్లో సినిమా తీయడం అన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే. యువ నటుల సినిమాలకే జనాలు థియేటర్లకు రావడం తగ్గించేస్తున్న రోజుల్లో ఆయన హీరోగా సినిమా తీస్తే ఆడియన్స్ కనీసం పట్టించుకుంటారా అనిపిస్తుంది. కానీ తన వ్యక్తిగత జీవితంలో ముడిపడ్డ సంఘటనలనే ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో పెట్టడం.. తన నిజ జీవిత భాగస్వామి పవిత్ర లోకేష్నే తనకు జోడీగా ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు నరేష్.
అగ్రెసివ్ ప్రమోషన్లతో ఈ సినిమా గురించి జనాలు చర్చించుకునేలా చేసి.. తొలి రోజు ఓ మోస్తరుగా థియేటర్లు నిండేలా చేయగలిగారు. ఐతే ప్రమోషన్లలో నరేష్తో పాటు టీంలో ఎవ్వరిని అడిగినా ఇది నిజ జీవిత కథ కాదు అనే చెప్పారు. ఇది ఫిక్షనల్ స్టోరీ అని.. అందరూ కనెక్టవుతారని… సెన్సేషనల్ విషయాలు ఉంటాయని.. ఇంకా చాలా మాటలే చెప్పారు.
తీరా చూస్తే సినిమాలో అవేవీ లేవు. కేవలం తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న వివాదాల గురించి క్లారిటీ ఇవ్వడానికి.. తాను ఉత్తముడినని చెప్పడానికి నరేష్ ఈ సినిమా తీసినట్లు అనిపించింది. నరేష్కు, ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి అసలు గొడవేంటి.. పవిత్ర లోకేష్తో ఈయన బంధం ఎలా మొదలైంది అనే విషయాల్లో జనాలకు కొన్ని సందేహాలు, కొంత క్యూరియాసిటీ ఉన్న మాట వాస్తవం.
వీటికి బదులివ్వాలని అనుకుంటే నరేష్ ఒక పర్సనల్, బోల్డ్ ఇంటర్వ్యూ ఇస్తే సరిపోయేది. మొత్తం ఏం చెప్పాలనుకున్నారో అదంతా చెబితే పోయేది. ఒక సెన్సేషనల్ ప్రోమో కట్ చేస్తే ఆటోమేటిగ్గా జనాలు ఆ ఇంటర్వ్యూ చూసేస్తారు. కానీ నరేష్ మాత్రం ఆ మార్గాన్ని వదిలేసి.. కోట్లు ఖర్చు పెట్గి ఎం.ఎస్.రాజుతో ఒక సినిమానే తీయించేశారు.
ఈ సినిమా చూస్తే మరీ ఏకపక్షంగా.. నరేష్, పవిత్రలను ఉత్తమోత్తములుగా చూపిస్తూ.. వాళ్ల మాజీ భాగస్వాములు పరమ నీచులు అనేలా చిత్రీకరించారు. వాళ్లలో చెడు లక్షణాలు ఉండొచ్చు కానీ.. మరీ ఇంత ఏకపక్షంగా, మరీ ఎగ్జాజరేట్ చేసి చూపించడం. వీళ్లు చాలా మంచి వాళ్లు… తప్పంతా వాళ్లదే అనడం మాత్రం అన్యాయంగానే అనిపిస్తుంది. నరేష్కు డబ్బుంది కాబట్టి ఈ సినిమా తీశారు.. మరి అవతలి వాళ్లు తమ వెర్షన్ ఎలా వినిపించాలి? వాళ్లకూ డబ్బుంటే అదే పని చేసేవారేమో.
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…