సీనియర్ నటుడు నరేష్ హీరోగా ఈ రోజుల్లో సినిమా తీయడం అన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే. యువ నటుల సినిమాలకే జనాలు థియేటర్లకు రావడం తగ్గించేస్తున్న రోజుల్లో ఆయన హీరోగా సినిమా తీస్తే ఆడియన్స్ కనీసం పట్టించుకుంటారా అనిపిస్తుంది. కానీ తన వ్యక్తిగత జీవితంలో ముడిపడ్డ సంఘటనలనే ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో పెట్టడం.. తన నిజ జీవిత భాగస్వామి పవిత్ర లోకేష్నే తనకు జోడీగా ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు నరేష్.
అగ్రెసివ్ ప్రమోషన్లతో ఈ సినిమా గురించి జనాలు చర్చించుకునేలా చేసి.. తొలి రోజు ఓ మోస్తరుగా థియేటర్లు నిండేలా చేయగలిగారు. ఐతే ప్రమోషన్లలో నరేష్తో పాటు టీంలో ఎవ్వరిని అడిగినా ఇది నిజ జీవిత కథ కాదు అనే చెప్పారు. ఇది ఫిక్షనల్ స్టోరీ అని.. అందరూ కనెక్టవుతారని… సెన్సేషనల్ విషయాలు ఉంటాయని.. ఇంకా చాలా మాటలే చెప్పారు.
తీరా చూస్తే సినిమాలో అవేవీ లేవు. కేవలం తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న వివాదాల గురించి క్లారిటీ ఇవ్వడానికి.. తాను ఉత్తముడినని చెప్పడానికి నరేష్ ఈ సినిమా తీసినట్లు అనిపించింది. నరేష్కు, ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి అసలు గొడవేంటి.. పవిత్ర లోకేష్తో ఈయన బంధం ఎలా మొదలైంది అనే విషయాల్లో జనాలకు కొన్ని సందేహాలు, కొంత క్యూరియాసిటీ ఉన్న మాట వాస్తవం.
వీటికి బదులివ్వాలని అనుకుంటే నరేష్ ఒక పర్సనల్, బోల్డ్ ఇంటర్వ్యూ ఇస్తే సరిపోయేది. మొత్తం ఏం చెప్పాలనుకున్నారో అదంతా చెబితే పోయేది. ఒక సెన్సేషనల్ ప్రోమో కట్ చేస్తే ఆటోమేటిగ్గా జనాలు ఆ ఇంటర్వ్యూ చూసేస్తారు. కానీ నరేష్ మాత్రం ఆ మార్గాన్ని వదిలేసి.. కోట్లు ఖర్చు పెట్గి ఎం.ఎస్.రాజుతో ఒక సినిమానే తీయించేశారు.
ఈ సినిమా చూస్తే మరీ ఏకపక్షంగా.. నరేష్, పవిత్రలను ఉత్తమోత్తములుగా చూపిస్తూ.. వాళ్ల మాజీ భాగస్వాములు పరమ నీచులు అనేలా చిత్రీకరించారు. వాళ్లలో చెడు లక్షణాలు ఉండొచ్చు కానీ.. మరీ ఇంత ఏకపక్షంగా, మరీ ఎగ్జాజరేట్ చేసి చూపించడం. వీళ్లు చాలా మంచి వాళ్లు… తప్పంతా వాళ్లదే అనడం మాత్రం అన్యాయంగానే అనిపిస్తుంది. నరేష్కు డబ్బుంది కాబట్టి ఈ సినిమా తీశారు.. మరి అవతలి వాళ్లు తమ వెర్షన్ ఎలా వినిపించాలి? వాళ్లకూ డబ్బుంటే అదే పని చేసేవారేమో.
This post was last modified on May 27, 2023 4:52 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…