అవును.. టాలీవుడ్ అభిమానులకు పండుగ రోజులు మొదలవుతున్నాయి. వచ్చే నెల రోజుల్లో అనేకానేక కానుకలు వాళ్ల ముందుకు రాబోతున్నాయి. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోసం ఓ కానుక రెడీ అవుతోంది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతడి కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ టీం ఓ బహుమతి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా అది టైటిల్ ట్రాక్ కావచ్చని అంటున్నారు.
తమన్ సైతం అభిమానులను ఊరించేలా ఓ ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సవం వస్తుంది. ఆ రోజు పలు కొత్త సినిమాల పోస్టర్లు లేదా ఇంకేవైనా విశేషాలు వెల్లడయ్యే అవకాశముంది. రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో దేశభక్తి యాంగిల్ ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ఏదైనా విశేషాన్ని పంచుకునే అవకాశం ఉంటుందంటున్నారు.
ఇక ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు రాబోతోంది. ఆ రోజు హంగామా మామూలుగా ఉండదంటున్నారు. ‘ఆచార్య’ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజయ్యే అవకాశాలున్నాయి. అలాగే చిరు కొత్త చిత్రాల గురించి ప్రకటనలు రావచ్చు. ఇక ఆగస్టు 29న అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఆ రోజు ఆయన కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’ టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. అలాగే నాగ్ కొత్త చిత్రాల ప్రకటన ఉండొచ్చట.
ఇక సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ జన్మదినం అన్న సంగతి తెలిసిందే. ఆ రోజు ‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజ్ చేయొచ్చని అంటున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే కొత్త సినిమాల విడుదల సందడి లేక అల్లాడిపోతున్న అభిమానులకు ఇలా కొత్త విశేషాలతో అయినా కొంత ఉపశమనం దక్కుతుందేమో చూడాలి.
This post was last modified on August 8, 2020 7:56 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…