విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను రేపు హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కైతలపూర్ మైదానంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రజనీకాంత్ ముఖ్యఅతిథిగా ఈ వేడుకను చేయడం తెలిసిందే. ఇప్పుడు దాన్ని తలదాన్నీ స్థాయిలో భాగ్యనగరాన్ని వేదికగా మార్చబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి రాబోయే గెస్టులతో అరుదైన కలయిక జరిగే అవకాశం ఉందని సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వాగతం బోర్డులను చూస్తే అర్థమవుతోంది.
పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్, ప్రభాస్, కళ్యాణ్ రామ్ తదితరులకు వెల్కమ్ చెబుతూ ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేశారు. వీళ్లందరితో బాలకృష్ణకు అన్ స్టాపబుల్ షో రూపంలో మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ చనువుతోనే ఆయనే స్వయంగా వాళ్ళను ఆహ్వానించినట్టు దానికి అంగీకారం వచ్చినట్టు తెలిసింది. చివరి నిమిషంలో ఒకరిద్దరు డ్రాప్ అయినా మొత్తానికి కనులవిందుగా అనిపించే తారాతోరణం సందడి చేయబోతోంది. చిరంజీవికీ ఆహ్వానం ఉన్నప్పటికీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోతున్నట్టు సమాచారం
వీళ్ళు కాకుండా ఎన్టీఆర్ తో పని చేసిన దర్శకులు నిర్మాతలు ఎందరో రాబోతున్నారు. రాజకీయ నాయకులు సరేసరి. ఎన్టీఆర్ కు చిరకాలం నిలిచిపోయే విధంగా గొప్ప నివాళిని ఈ సందర్భంగా అందించబోతున్నారు. నందమూరి నారా కుటుంబాల నుంచి దాదాపు అందరూ హాజరు కాబోతున్నారు. టాలీవుడ్ చరిత్రలో తనకు మాత్రమే సాధ్యమయ్యే సువర్ణాక్షర సంతకాన్ని లిఖించిన ఎన్టీఆర్ ను ఈ రీతిలో స్మరించుకోవడం అబినందించాల్సిన విషయం. ప్రత్యక్షంగా వచ్చే అభిమానులతో పాటు కోట్లాది ప్రేక్షకులు టీవీ ద్వారా ఈ ఉత్సవాలను చూడబోతున్నారు.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…