విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను రేపు హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కైతలపూర్ మైదానంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రజనీకాంత్ ముఖ్యఅతిథిగా ఈ వేడుకను చేయడం తెలిసిందే. ఇప్పుడు దాన్ని తలదాన్నీ స్థాయిలో భాగ్యనగరాన్ని వేదికగా మార్చబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి రాబోయే గెస్టులతో అరుదైన కలయిక జరిగే అవకాశం ఉందని సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వాగతం బోర్డులను చూస్తే అర్థమవుతోంది.
పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్, ప్రభాస్, కళ్యాణ్ రామ్ తదితరులకు వెల్కమ్ చెబుతూ ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేశారు. వీళ్లందరితో బాలకృష్ణకు అన్ స్టాపబుల్ షో రూపంలో మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ చనువుతోనే ఆయనే స్వయంగా వాళ్ళను ఆహ్వానించినట్టు దానికి అంగీకారం వచ్చినట్టు తెలిసింది. చివరి నిమిషంలో ఒకరిద్దరు డ్రాప్ అయినా మొత్తానికి కనులవిందుగా అనిపించే తారాతోరణం సందడి చేయబోతోంది. చిరంజీవికీ ఆహ్వానం ఉన్నప్పటికీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోతున్నట్టు సమాచారం
వీళ్ళు కాకుండా ఎన్టీఆర్ తో పని చేసిన దర్శకులు నిర్మాతలు ఎందరో రాబోతున్నారు. రాజకీయ నాయకులు సరేసరి. ఎన్టీఆర్ కు చిరకాలం నిలిచిపోయే విధంగా గొప్ప నివాళిని ఈ సందర్భంగా అందించబోతున్నారు. నందమూరి నారా కుటుంబాల నుంచి దాదాపు అందరూ హాజరు కాబోతున్నారు. టాలీవుడ్ చరిత్రలో తనకు మాత్రమే సాధ్యమయ్యే సువర్ణాక్షర సంతకాన్ని లిఖించిన ఎన్టీఆర్ ను ఈ రీతిలో స్మరించుకోవడం అబినందించాల్సిన విషయం. ప్రత్యక్షంగా వచ్చే అభిమానులతో పాటు కోట్లాది ప్రేక్షకులు టీవీ ద్వారా ఈ ఉత్సవాలను చూడబోతున్నారు.
This post was last modified on May 19, 2023 12:01 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…