తమిళ దర్శకుల మీద తెలుగు హీరోల ఆసక్తి ఈనాటిది కాదు. కానీ ఒక దశలో అది ఆసక్తిని దాటి మోజుగా మారింది. మధ్యలో కొన్నేళ్లు తమిళ దర్శకులకు తెలుగు హీరోలు దూరంగా ఉన్నారు కానీ.. కొన్నేళ్ల నుంచి మళ్లీ వారి వైపు చూస్తున్నారు. కానీ ఎన్నో ఆశలు, అంచనాలతో వారితో సినిమాలు చేస్తున్న తెలుగు స్టార్లకు షాకులు తప్పట్లేదు.
కొన్నేళ్ల కిందట సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన మురుగదాస్లో మహేష్ బాబు జట్టు కట్టాడు. మురుగదాస్ మంచి ఫాంలో ఉండగా మహేష్ ‘స్పైడర్’ చేశాడు. కానీ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ డెలివర్ చేసిన మురుగదాస్.. ఆ తర్వాత కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అనంతరం తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్తో ‘నోటా’ సినిమా చేశాడు. అది అతడి కెరీర్లో అతి పెద్ద ఫ్లాప్గా నిలిచింది.
ఇక గత ఏడాది మరో యువ కథానాయకుడు రామ్.. తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామితో ‘ది వారియర్’ చేశాడు. లింగుస్వామి ఫామ్ కోల్పోయి చాలా కాలం అయినా రామ్ రిస్క్ చేశాడు. ఫలితంగా ఒక డిజాస్టర్ తన ఖాతాలో పడింది. ఇప్పుడు వెంకట్ ప్రభు లాంటి విలక్షణ దర్శకుడు కూడా తెలుగు స్టార్కు హిట్ ఇవ్వలేకపోయాడు.
తన కథకు సరిపోతాడని ఏరి కోరి నాగచైతన్యను ఎంచుకుని ఆయన తెలుగు, తమిళ భాషల్లో ‘కస్టడీ’ మూవీ తీశాడు. అసలే చైతూ సరైన ఫాంలో లేడు. మంచి హిట్ కొట్టి చాలా కాలం అయింది. అక్కినేని వారికి అస్సలు కలిసి రాని టైంలో ‘కస్టడీ’ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఈ చిత్రం కూడా అంచనాలను అందుకోలేకపోయింది. నెగెటివ్ టాక్తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం నిలబడుతుందో అనే సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on May 12, 2023 11:05 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…