టాలీవుడ్ దర్శక నిర్మాతలకున్న అతి పెద్ద సమస్య సంగీత దర్శకుల పరంగా పెద్దగా ఆప్షన్లు లేకపోవడం. తమన్ రేటుని అందరు భరించలేరు. దేవిశ్రీ ప్రసాద్ ప్రతి ఆల్బమ్ కి మంచి స్కోర్ ఇస్తాడని గ్యారెంటీ లేదు. పైగా రెమ్యునరేషనూ ఎక్కువే. మిక్కీ జె మేయర్ అన్ని జానర్లకు సూట్ కాడని రామబాణం ఋజువు చేసింది. మనం, ఇష్క్ నాటి మేజిక్ ని అనూప్ రూబెన్స్ ఇవ్వలేకపొతున్నాడు. అందుకే మన మేకర్స్ ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి మ్యూజిక్ డైరెక్టర్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఖర్చు కొంచెం ఎక్కువైనా సరే బెస్ట్ సాంగ్స్ కోసం రాజీ పడటం లేదు
మల్లువుడ్ సెన్సేషన్ హేశం అబ్దుల్ వహాబ్ చేతిలో ఖుషి, నాని 30 ఉన్నాయి. మంచి అవుట్ ఫుట్ వస్తోందని ఆల్రెడీ టాక్ ఉంది. అనిరుద్ రవిచందర్ ఎంత బిజీగా ఉన్నా సరే ఎన్టీఆర్ 30, విజయ్ దేవరకొండ 12కు కమిట్ మెంట్ ఇచ్చాడు. దసరాతో హిట్టు కొట్టిన సంతోష్ నారాయణన్ ఏకంగా ప్రాజెక్ట్ కెని జేబులో వేసుకున్నాడు. ఇది కాకుండా వెంకటేష్ సైంధవ్ కూడా తోడయ్యింది. కస్టడీకి స్కోర్ ఇచ్చిన యువన్ శంకర్ రాజాకు మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆఫర్ లో ఉంది. నితిన్ దర్శకుడు వక్కంతం వంశీ కాంబో కోసం హరీష్ జైరాజ్ ఆల్రెడీ పనులు మొదలుపెట్టారు.
కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాధ్ కు దర్శకుడు అజయ్ భూపతి మంగళవారంకి ఒప్పించాడు. మరో రెండు డిస్కషన్ లో ఉన్నాయి. ఇలా మలయాళం, తమిళం, కన్నడ నుంచి ఇంపోర్ట్ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ల నెంబర్ పెరుగుతూ పోతోంది. ఓపెనింగ్స్ విషయంలో పాటలు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో హీరోలు గమనిస్తున్నారు. సరైన ఛార్ట్ బస్టర్ సాంగ్ ఒకటి రెండు పడినా చాలు హైప్ పెరగడంలో ఇవి దోహదపడుతున్నాయి. అందుకే ఎంత వ్యయమైనా సరే ఇతర రాష్ట్రాల నుంచి తేక తప్పడం లేదు. పైగా పారితోషికాలు ఇక్కడున్నంత భారీగా ఎక్కడా ఉండవు
This post was last modified on May 12, 2023 11:02 pm
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…