సీనియర్ నటుడు నరేష్ ఒకప్పుడు సినిమా వేడుకలకు వస్తే ఏ హడావుడి ఉండేది కాదు. ఆయన ప్రెస్ మీట్లలో పాల్గొన్నా కూడా మామూలుగా సాగిపోయేది. ఇక నరేష్ నటించిన సినిమా తాలూకు ప్రోమో థియేటర్లలో రిలీజైతే ఆయన్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది.
లేటు వయసులో కన్నడ నటి పవిత్ర లోకేష్ తో ఆయన ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి మీడియాతో పాటు జనాల్లోనూ ఆయన పట్ల క్యూరియాసిటీ పెరిగిపోయింది. అందులోనూ తమ నిజ జీవిత కథతోనే ‘మళ్ళీ పెళ్ళి’ పేరుతో సినిమా తీస్తుండటం జనాలకు పెద్ద షాక్. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా నరేష్ పెట్టిన ప్రెస్ మీట్ కూడా హాట్ టాపిక్గా మారింది.
ఈ కార్యక్రమానికి ఆయన వచ్చినపుడు.. వెళ్లినపుడు.. ప్రెస్ మీట్లో మాట్లాడినపుడు హడావుడి మామూలుగా లేదు. మీడియా ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. శుక్రవారం ‘కస్టడీ’ సినిమా ఫ్యాన్స్ షో సందర్భంగా ‘మళ్ళీ పెళ్ళి’ ట్రైలర్ ప్రదర్శిస్తే.. నాగచైతన్య ఎంట్రీ సీన్కు ఉన్నంత రెస్పాన్స్.. ఈ ట్రైలర్కు కూడా కనిపించింది.
ఆ ట్రైలర్ రన్ అవుతున్నంతసేపు ఒకటే హోరు. ఒక స్టార్ హీరోను చూసినట్లు నరేష్ కనిపించినపుడల్లా జనాలు హోరెత్తించేశారు. నరేష్కు ఇంత క్రేజ్ ఏంటి అని మిగతా జనాలంతా షాకయ్యే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. ‘మళ్ళీ పెళ్ళి’ ట్రైలర్కు ట్యూబ్లో, మిగతా సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆ ట్రైలర్ గురించి జనాల కామెంట్లు చదివితే నవ్వి నవ్వి పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. ఎలాగైతేనేం తన సినిమాకు నరేష్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారన్నది వాస్తవం.
This post was last modified on May 12, 2023 2:36 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…