ఒక హీరోయిన్తో కొంత కాలం ప్రేమలో ఉన్న వ్యక్తితో మరో హీరోయిన్ ప్రేమలో పడటం ఎక్కువగా బాలీవుడ్లోనే చూస్తాం. అక్కడి హీరోలు, హీరోయిన్లు బాయ్ఫ్రెండ్స్ను మార్చేయడం మామూలే. దక్షిణాదిన ఇలాంటి ఉదంతాలు తక్కువగానే కనిపిస్తాయి. నయనతార, శింబు లాంటి వాళ్లు ఇలా వేర్వేరు కాలాల్లో వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉన్నారు. వీళ్ల లాగా పాపులర్ కాని లవ్ స్టోరీలు కూడా కొన్ని ఉన్నాయి.
అందులో త్రిషతో ఒక టైంలో నిశ్చితార్థం చేసుకుని, ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయిన వరుణ్ మణియన్తో బిందు మాధవి లవ్ స్టోరీ కూడా ఒకటి. ఈ ప్రేమ కథ గురించి ఒక సమయంలో జోరుగా వార్తలు వినిపించాయి. కానీ తర్వాత ఏమైందో తెలియదు. ఇద్దరూ విడిపోయిన సంకేతాలు వచ్చాయి. ఐతే ఈ లవ్ స్టోరీ గురించి ఎప్పడూ మాట్లాడని బిందు మాధవి..
తెలుగులో నటించిన న్యూసెన్స్ అనే సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన బిందు మాధవి.. మీడియాలో వచ్చే రూమర్ల గురించి స్పందించింది. త్రిష బాయ్ప్రెండ్తో డేటింగ్ అంటూ తన గురించి వచ్చిన రూమర్ గురించి స్పందిస్తూ.. అది నిజమే అని ఆమె ఒప్పుకుంది. అవును.. నేను త్రిషప్రేమించిన వ్యక్తితో ఒక సమయంలో డేటింగ్లో ఉన్నాను. కానీ అతను అప్పటికే త్రిష నుంచి విడిపోయాడు అని బిందుమాధవి పేర్కొంది.
మరో వైపు న్యూసెన్స్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నవదీప్ మాట్లాడుతూ.. తన మీద మీడియాలో లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయన్నాడు. తన వల్ల ఒక హీరోయిన్ చనిపోయిందని.. తన ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని మీడియాలో అబద్ధపు రాతలు రాశారన్నాడు. తన ఇంట్లో ఫ్యామిలీ గెట్ టు గెదర్ జరిగితే దాన్ని రేవ్ పార్టీ అని రాసేశారని మీడియా వాళ్లను నిందించాడు నవదీప్.
This post was last modified on May 8, 2023 9:58 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…