ఒక హీరోయిన్తో కొంత కాలం ప్రేమలో ఉన్న వ్యక్తితో మరో హీరోయిన్ ప్రేమలో పడటం ఎక్కువగా బాలీవుడ్లోనే చూస్తాం. అక్కడి హీరోలు, హీరోయిన్లు బాయ్ఫ్రెండ్స్ను మార్చేయడం మామూలే. దక్షిణాదిన ఇలాంటి ఉదంతాలు తక్కువగానే కనిపిస్తాయి. నయనతార, శింబు లాంటి వాళ్లు ఇలా వేర్వేరు కాలాల్లో వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉన్నారు. వీళ్ల లాగా పాపులర్ కాని లవ్ స్టోరీలు కూడా కొన్ని ఉన్నాయి.
అందులో త్రిషతో ఒక టైంలో నిశ్చితార్థం చేసుకుని, ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయిన వరుణ్ మణియన్తో బిందు మాధవి లవ్ స్టోరీ కూడా ఒకటి. ఈ ప్రేమ కథ గురించి ఒక సమయంలో జోరుగా వార్తలు వినిపించాయి. కానీ తర్వాత ఏమైందో తెలియదు. ఇద్దరూ విడిపోయిన సంకేతాలు వచ్చాయి. ఐతే ఈ లవ్ స్టోరీ గురించి ఎప్పడూ మాట్లాడని బిందు మాధవి..
తెలుగులో నటించిన న్యూసెన్స్ అనే సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన బిందు మాధవి.. మీడియాలో వచ్చే రూమర్ల గురించి స్పందించింది. త్రిష బాయ్ప్రెండ్తో డేటింగ్ అంటూ తన గురించి వచ్చిన రూమర్ గురించి స్పందిస్తూ.. అది నిజమే అని ఆమె ఒప్పుకుంది. అవును.. నేను త్రిషప్రేమించిన వ్యక్తితో ఒక సమయంలో డేటింగ్లో ఉన్నాను. కానీ అతను అప్పటికే త్రిష నుంచి విడిపోయాడు అని బిందుమాధవి పేర్కొంది.
మరో వైపు న్యూసెన్స్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నవదీప్ మాట్లాడుతూ.. తన మీద మీడియాలో లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయన్నాడు. తన వల్ల ఒక హీరోయిన్ చనిపోయిందని.. తన ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని మీడియాలో అబద్ధపు రాతలు రాశారన్నాడు. తన ఇంట్లో ఫ్యామిలీ గెట్ టు గెదర్ జరిగితే దాన్ని రేవ్ పార్టీ అని రాసేశారని మీడియా వాళ్లను నిందించాడు నవదీప్.
This post was last modified on May 8, 2023 9:58 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…