ఒక హీరోయిన్తో కొంత కాలం ప్రేమలో ఉన్న వ్యక్తితో మరో హీరోయిన్ ప్రేమలో పడటం ఎక్కువగా బాలీవుడ్లోనే చూస్తాం. అక్కడి హీరోలు, హీరోయిన్లు బాయ్ఫ్రెండ్స్ను మార్చేయడం మామూలే. దక్షిణాదిన ఇలాంటి ఉదంతాలు తక్కువగానే కనిపిస్తాయి. నయనతార, శింబు లాంటి వాళ్లు ఇలా వేర్వేరు కాలాల్లో వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉన్నారు. వీళ్ల లాగా పాపులర్ కాని లవ్ స్టోరీలు కూడా కొన్ని ఉన్నాయి.
అందులో త్రిషతో ఒక టైంలో నిశ్చితార్థం చేసుకుని, ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయిన వరుణ్ మణియన్తో బిందు మాధవి లవ్ స్టోరీ కూడా ఒకటి. ఈ ప్రేమ కథ గురించి ఒక సమయంలో జోరుగా వార్తలు వినిపించాయి. కానీ తర్వాత ఏమైందో తెలియదు. ఇద్దరూ విడిపోయిన సంకేతాలు వచ్చాయి. ఐతే ఈ లవ్ స్టోరీ గురించి ఎప్పడూ మాట్లాడని బిందు మాధవి..
తెలుగులో నటించిన న్యూసెన్స్ అనే సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన బిందు మాధవి.. మీడియాలో వచ్చే రూమర్ల గురించి స్పందించింది. త్రిష బాయ్ప్రెండ్తో డేటింగ్ అంటూ తన గురించి వచ్చిన రూమర్ గురించి స్పందిస్తూ.. అది నిజమే అని ఆమె ఒప్పుకుంది. అవును.. నేను త్రిషప్రేమించిన వ్యక్తితో ఒక సమయంలో డేటింగ్లో ఉన్నాను. కానీ అతను అప్పటికే త్రిష నుంచి విడిపోయాడు అని బిందుమాధవి పేర్కొంది.
మరో వైపు న్యూసెన్స్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నవదీప్ మాట్లాడుతూ.. తన మీద మీడియాలో లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయన్నాడు. తన వల్ల ఒక హీరోయిన్ చనిపోయిందని.. తన ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని మీడియాలో అబద్ధపు రాతలు రాశారన్నాడు. తన ఇంట్లో ఫ్యామిలీ గెట్ టు గెదర్ జరిగితే దాన్ని రేవ్ పార్టీ అని రాసేశారని మీడియా వాళ్లను నిందించాడు నవదీప్.
This post was last modified on May 8, 2023 9:58 am
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…