స్టార్ హీరోల వారసులకు ఉండే క్రేజే వేరు. రేణు దేశాయ్ వెర్షన్ ఎలా ఉన్నా అకీరానందన్ ని పవన్ కళ్యాణ్ వారసుడిగా అభిమానులు చూస్తున్నారు. టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు కానీ కుర్రాడు మాత్రం రెగ్యులర్ గా హైదరాబాద్ లో కనిపిస్తూనే ఉంటాడు. ప్రీమియర్ షోలకు రావడం, మీడియా కెమెరాలను తప్పించుకునే ప్రయత్నం చేయకపోవడం, అడవి శేష్ దగ్గర ఎక్కువ సమయం గడపడం లాంటి కారణాల వల్ల అబ్బాయికి సినిమాల మీద ఆసక్తి ఏంటో అర్థమవుతూనే ఉంది. తాజాగా వచ్చిన లీక్ ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగానే తిరుగుతోంది
దాని ప్రకారం ప్రస్తుతం పవన్ చేస్తున్న ఓజిలో గ్యాంగ్ స్టర్ పాత్ర మూడు టైం ఫ్రేమ్స్ లో ఉంటుందట. అందులో ఒకటి పదిహేడేళ్ల టీనేజ్ ప్రాయం లో వస్తుంది. దాన్ని అకీరాతో చేయిస్తే బాగుంటుందనే ప్రతిపాదన దర్శకుడు సుజిత్ పెడితే పవర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారట. ఒకవేళ ఓకే అయితే అంతకన్నా స్పెషల్ న్యూస్ పవన్ ఫ్యాన్స్ కి ఏముంటుంది. గతంలో 1 నేనొక్కడినే కోసం గౌతమ్ ఇలాగే మహేష్ బాబు చిన్ననాటి క్యారెక్టర్ చేయడం అందరికీ గుర్తే. ఫలితం అటుఇటు అయ్యింది కానీ ఒక మంచి క్యారెక్టర్ అయితే అబ్బాయికి పడింది.
ఇది ప్రస్తుతానికి గాసిప్ గానే తిరుగుతోంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం. వాస్తవమైతే అభిమానుల హంగామా మాములుగా ఉండదు. ఇంతకీ రేణు దేశాయి మనసులో ఏముందో ఇది కన్ఫర్మ్ అయ్యాకే తెలుస్తుంది. దేశాయ్ పేరు కన్నా కొణిదెల బ్రాండ్ తోనే అకీరాకు ఇండస్ట్రీ ఎంట్రీ సులభంగా ఉంటుంది కాబట్టి బహుశా ఆపడం లాంటివేవీ ఉండకపోవచ్చు. పైగా పవన్ ఆఖరి కొడుకుది చాలా చిన్న వయసు కాబట్టి ఇప్పుడున్న ఫ్యాన్స్ అందరూ అకీరానే చూడాలని ఫిక్స్ అయిపోయారు. ఓజిని వచ్చే ఏడాది సంక్రాంతి లేదా వేసవి విడుదల టార్గెట్ గా షూట్ చేస్తున్నారు
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…