వచ్చే శుక్రవారం గోపీచంద్ ‘రామబాణం’ , అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రెండు సినిమాలకు సంబందించి హీరోలిద్దరు ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆడియన్స్ కి సినిమాను రీచ్ చేసే పనిలో ఉన్నారు. కానీ రెండు సినిమాలకు రావాల్సినంత బజ్ లేదు. గోపీచంద్ సినిమా ట్రైలర్ చూసి రొటీన్ అనే ఆలోచనలో ఉన్నారు ప్రేక్షకులు. ట్రైలర్ కట్ మీద టీం పెద్దగా శ్రద్ద పెట్టకుండా రొటీన్ గా కట్ చేయడం ఎఫెక్ట్ అయింది.
నరేష్ ‘ఉగ్రం’తో మరోసారి నాంది లాంటి కథతోనే మరో యాంగిల్ చూపించబోతున్నాడనిపిస్తున్నాడని ప్రేక్షకుల్లో ఓ ఐడియా వచ్చేసింది. అల్లరి నరేష్ చేస్తున్న మరో కొత్త ప్రయత్నం కాబట్టి ఈ సినిమా సోలోగా వచ్చి ఉంటే కొంత ఓపెనింగ్స్ దక్కేవి. అలాగే మంచి థియేటర్స్ పడేవి. కానీ ఆపోజిట్ గోపీచంద్ లాంటి మాస్ హీరో సినిమా ఉండటంతో ఉగ్రంకి లిమిటెడ్ థియేటర్స్ దక్కాయి. ఇక బ్లాక్ బస్టర్ టాక్ తో ‘విరూపాక్ష’ కూడా కొన్ని థియేటర్స్ లో ఉంది. దీంతో అల్లరి నరేష్ ఉగ్రం కి పెద్ద దెబ్బే తగిలింది.
రామబాణం , ఉగ్రం రెండు సినిమాల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ మేకర్స్ ఊహించినట్టుగా బుకింగ్స్ లో జోరు కనిపించడం లేదు. మొదటి రోజు టాక్ మీదే ఈ రెండు సినిమాల రిజల్ట్ ఆధారపడి ఉంది. గోపీచంద్ ముందు సినిమాలు బాగా నిరాశ పరచడంతో రామబాణంకి కూడా మినిమం ఓపెనింగ్స్ వచ్చేలా లేవు.
This post was last modified on May 2, 2023 10:54 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన తెలంగాణ నేత, హైదరాబాద్ పాత బస్తీ పరిధి గోషా మహల్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న…
ఏపీ విపక్షం వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నచందంగా పరిస్థితి మారిపోయింది. అసెంబ్లీ లో ఆ పార్టీకి 11…
రాజకీయాల్లో నాయకుల ప్రతిభ, ఎత్తులు పై ఎత్తులు.. ఎన్ని ఉన్నా చివరాఖరుకు.. సామాజిక వర్గాల దన్ను, వారి మద్దతు లేకుండా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ అధినేత వైైఎస్ జగన్…
సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఏకంగా ఒక సినిమా ప్రమోషన్ ఎలా ఉండాలో సూచించే స్థాయికి వెళ్ళిపోయింది.…
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉన్నా... సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరు పరిధిలో హార్డ్…