వచ్చే శుక్రవారం గోపీచంద్ ‘రామబాణం’ , అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రెండు సినిమాలకు సంబందించి హీరోలిద్దరు ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆడియన్స్ కి సినిమాను రీచ్ చేసే పనిలో ఉన్నారు. కానీ రెండు సినిమాలకు రావాల్సినంత బజ్ లేదు. గోపీచంద్ సినిమా ట్రైలర్ చూసి రొటీన్ అనే ఆలోచనలో ఉన్నారు ప్రేక్షకులు. ట్రైలర్ కట్ మీద టీం పెద్దగా శ్రద్ద పెట్టకుండా రొటీన్ గా కట్ చేయడం ఎఫెక్ట్ అయింది.
నరేష్ ‘ఉగ్రం’తో మరోసారి నాంది లాంటి కథతోనే మరో యాంగిల్ చూపించబోతున్నాడనిపిస్తున్నాడని ప్రేక్షకుల్లో ఓ ఐడియా వచ్చేసింది. అల్లరి నరేష్ చేస్తున్న మరో కొత్త ప్రయత్నం కాబట్టి ఈ సినిమా సోలోగా వచ్చి ఉంటే కొంత ఓపెనింగ్స్ దక్కేవి. అలాగే మంచి థియేటర్స్ పడేవి. కానీ ఆపోజిట్ గోపీచంద్ లాంటి మాస్ హీరో సినిమా ఉండటంతో ఉగ్రంకి లిమిటెడ్ థియేటర్స్ దక్కాయి. ఇక బ్లాక్ బస్టర్ టాక్ తో ‘విరూపాక్ష’ కూడా కొన్ని థియేటర్స్ లో ఉంది. దీంతో అల్లరి నరేష్ ఉగ్రం కి పెద్ద దెబ్బే తగిలింది.
రామబాణం , ఉగ్రం రెండు సినిమాల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ మేకర్స్ ఊహించినట్టుగా బుకింగ్స్ లో జోరు కనిపించడం లేదు. మొదటి రోజు టాక్ మీదే ఈ రెండు సినిమాల రిజల్ట్ ఆధారపడి ఉంది. గోపీచంద్ ముందు సినిమాలు బాగా నిరాశ పరచడంతో రామబాణంకి కూడా మినిమం ఓపెనింగ్స్ వచ్చేలా లేవు.
This post was last modified on May 2, 2023 10:54 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…