వచ్చే శుక్రవారం గోపీచంద్ ‘రామబాణం’ , అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రెండు సినిమాలకు సంబందించి హీరోలిద్దరు ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆడియన్స్ కి సినిమాను రీచ్ చేసే పనిలో ఉన్నారు. కానీ రెండు సినిమాలకు రావాల్సినంత బజ్ లేదు. గోపీచంద్ సినిమా ట్రైలర్ చూసి రొటీన్ అనే ఆలోచనలో ఉన్నారు ప్రేక్షకులు. ట్రైలర్ కట్ మీద టీం పెద్దగా శ్రద్ద పెట్టకుండా రొటీన్ గా కట్ చేయడం ఎఫెక్ట్ అయింది.
నరేష్ ‘ఉగ్రం’తో మరోసారి నాంది లాంటి కథతోనే మరో యాంగిల్ చూపించబోతున్నాడనిపిస్తున్నాడని ప్రేక్షకుల్లో ఓ ఐడియా వచ్చేసింది. అల్లరి నరేష్ చేస్తున్న మరో కొత్త ప్రయత్నం కాబట్టి ఈ సినిమా సోలోగా వచ్చి ఉంటే కొంత ఓపెనింగ్స్ దక్కేవి. అలాగే మంచి థియేటర్స్ పడేవి. కానీ ఆపోజిట్ గోపీచంద్ లాంటి మాస్ హీరో సినిమా ఉండటంతో ఉగ్రంకి లిమిటెడ్ థియేటర్స్ దక్కాయి. ఇక బ్లాక్ బస్టర్ టాక్ తో ‘విరూపాక్ష’ కూడా కొన్ని థియేటర్స్ లో ఉంది. దీంతో అల్లరి నరేష్ ఉగ్రం కి పెద్ద దెబ్బే తగిలింది.
రామబాణం , ఉగ్రం రెండు సినిమాల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ మేకర్స్ ఊహించినట్టుగా బుకింగ్స్ లో జోరు కనిపించడం లేదు. మొదటి రోజు టాక్ మీదే ఈ రెండు సినిమాల రిజల్ట్ ఆధారపడి ఉంది. గోపీచంద్ ముందు సినిమాలు బాగా నిరాశ పరచడంతో రామబాణంకి కూడా మినిమం ఓపెనింగ్స్ వచ్చేలా లేవు.
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…
అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి…
తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…
గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తీర ప్రాంతం(బీచ్) ఏపీలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్..తన పార్టీని తెలంగాణలోనూ విస్తరించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని…