సినీ రంగానికి దూరమైన కొన్నేళ్లకే రాజకీయ రంగంలోకి అడుగు పెట్టింది రోజా. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కీలక స్థానంలో ఉందామె. ఆ రెండు పార్టీల్లో అధికార ప్రతినిధిగా మీడియాలో బాగా పేరుపొందింది.
తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచింది. మంత్రి పదవికి చాలా చేరువగా వెళ్లింది. అది దక్కకపోయినా కేబినెట్ హోదాకు సమానమైన ఏపీఐఐసీ ఛైర్మన్గా వ్యవహరిస్తోంది.
వైకాపాలో కీలక నేతగా ఉన్న రోజా.. ఇప్పుడు ఆశ్చర్యకర వ్యాఖ్య చేసింది. తాను పూర్తి స్థాయి రాజకీయాల్లో లేనట్లు మాట్లాడింది. ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ ఛైర్మన్గా ఉంటూ జబర్దస్త్ లాంటి కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించడం మీద రోజా తరచుగా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమె ఈ షోను విడిచిపెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తుంటాయి.
కానీ రోజా అవేమీ పట్టించుకోకుండా షోలో కొనసాగుతోంది. ఇదే విషయమై తాజాగా మీడియా వాళ్లు ప్రశ్నిస్తే రోజా తనదైన శైలిలో బదులిచ్చింది. జబర్దస్త్ వల్ల తనకు ఉండే క్రేజ్ అలాగే కంటిన్యూ అవుతోందనే బాధతో చాలామంది మాట్లాడుతున్నారని.. అది మంచి కామెడీ షో మాత్రమే అని దాని వల్ల చాలా మంది ఆరోగ్యం కూడా బాగు పడుతుందని చెప్పుకొచ్చింది రోజా.
అలాగే తాను జబర్దస్త్లో నటించడం తమ నాయకుడికి తెలుసని.. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా మారితే అవన్నీ వదిలేస్తానని చెప్పింది. ఈ మాటే అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా మారడం అంటే రోజా ఉద్దేశంలో ఏంటని అడుగుతున్నారు. ఎమ్మెల్యే అయి.. కేబినెట్ స్థాయి పదవి కూడా చేపడుతున్న వ్యక్తి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలు కాకపోవడం ఏంటో?
This post was last modified on August 4, 2020 6:06 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…