సినీ రంగానికి దూరమైన కొన్నేళ్లకే రాజకీయ రంగంలోకి అడుగు పెట్టింది రోజా. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కీలక స్థానంలో ఉందామె. ఆ రెండు పార్టీల్లో అధికార ప్రతినిధిగా మీడియాలో బాగా పేరుపొందింది.
తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచింది. మంత్రి పదవికి చాలా చేరువగా వెళ్లింది. అది దక్కకపోయినా కేబినెట్ హోదాకు సమానమైన ఏపీఐఐసీ ఛైర్మన్గా వ్యవహరిస్తోంది.
వైకాపాలో కీలక నేతగా ఉన్న రోజా.. ఇప్పుడు ఆశ్చర్యకర వ్యాఖ్య చేసింది. తాను పూర్తి స్థాయి రాజకీయాల్లో లేనట్లు మాట్లాడింది. ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ ఛైర్మన్గా ఉంటూ జబర్దస్త్ లాంటి కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించడం మీద రోజా తరచుగా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమె ఈ షోను విడిచిపెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తుంటాయి.
కానీ రోజా అవేమీ పట్టించుకోకుండా షోలో కొనసాగుతోంది. ఇదే విషయమై తాజాగా మీడియా వాళ్లు ప్రశ్నిస్తే రోజా తనదైన శైలిలో బదులిచ్చింది. జబర్దస్త్ వల్ల తనకు ఉండే క్రేజ్ అలాగే కంటిన్యూ అవుతోందనే బాధతో చాలామంది మాట్లాడుతున్నారని.. అది మంచి కామెడీ షో మాత్రమే అని దాని వల్ల చాలా మంది ఆరోగ్యం కూడా బాగు పడుతుందని చెప్పుకొచ్చింది రోజా.
అలాగే తాను జబర్దస్త్లో నటించడం తమ నాయకుడికి తెలుసని.. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా మారితే అవన్నీ వదిలేస్తానని చెప్పింది. ఈ మాటే అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా మారడం అంటే రోజా ఉద్దేశంలో ఏంటని అడుగుతున్నారు. ఎమ్మెల్యే అయి.. కేబినెట్ స్థాయి పదవి కూడా చేపడుతున్న వ్యక్తి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలు కాకపోవడం ఏంటో?
This post was last modified on August 4, 2020 6:06 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…