లోకనాయకుడు కమల్ హాసన్ గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు ‘విక్రమ్’ మూవీతో. యంగ్ డైరెక్టర్ లోెకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం అంచనాలను మించిపోయి భారీ విజయాన్నందుకుంది. దీంతో కమల్ కెరీర్కు మళ్లీ మంచి ఊపు వచ్చింది. దీని తర్వాత ఆయన మధ్యలో ఆగిన ‘ఇండియన్-2’ను పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సినిమా చివరి దశలో ఉంది. ఆ పని అవగొట్టి అతి త్వరలోనే మణిరత్నం సినిమా మీదికి వెళ్లబోతున్నాడు కమల్.
మూడు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత ఆయన మళ్లీ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో జట్టు కడుతున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘నాయకుడు’ అప్పట్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. మళ్లీ ఇంత కాలానికి ఈ కాంబో కార్యరూపం దాలుస్తుండటం అభిమానులకు అమితానందాన్ని ఇస్తోంది. ఈ చిత్రాన్ని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మీదే నిర్మిస్తుండడం విశేషం.
అనౌన్స్మెంట్ తర్వాత వార్తల్లో లేని ఈ చిత్రం.. సైలెంటుగా ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ‘పొన్నియన్ సెల్వన్-2’ రిలీజ్ తర్వాత సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు మణిరత్నం. ఈ చిత్రానికి కథానాయికగా ఇంతకుముందు త్రిష, నయనతార తదితరుల పేర్లు వినిపించాయి. ఐతే ఇప్పుడు ఆ పేర్లు వెనక్కి వెళ్లిపోయాయి. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యా బాలన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే కథానాయికగా ఖరారు చేశారట. ఇంకో లేడీ క్యారెక్టర్ కూడా ఉంటుందంటున్నారు కానీ.. దాని గురించి క్లారిటీ లేదు. విద్య అయితే కమల్కు జోడీగా ఫిక్సయినట్లే అంటున్నారు. ఈ జోడీ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుందనడంలో సందేహం లేదు.
విశేషం ఏంటంటే.. ఈ సినిమా కథ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. చనిపోయిన ఒక మనిషి మళ్లీ బ్రతికి సమాజంలోకి వస్తే ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే పాయింటే ఇది. మణిరత్నం నుంచి ఈ దశలో ఇలాంటి సినిమాను ఊహించలేం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారు కమల్, మణిరత్నం.
This post was last modified on April 28, 2023 10:19 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…