Movie News

కమల్‌కు దీటైన హీరోయిన్

లోకనాయకుడు కమల్ హాసన్ గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు ‘విక్రమ్’ మూవీతో. యంగ్ డైరెక్టర్ లోెకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం అంచనాలను మించిపోయి భారీ విజయాన్నందుకుంది. దీంతో కమల్ కెరీర్‌కు మళ్లీ మంచి ఊపు వచ్చింది. దీని తర్వాత ఆయన మధ్యలో ఆగిన ‘ఇండియన్-2’ను పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సినిమా చివరి దశలో ఉంది. ఆ పని అవగొట్టి అతి త్వరలోనే మణిరత్నం సినిమా మీదికి వెళ్లబోతున్నాడు కమల్.

మూడు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత ఆయన మళ్లీ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో జట్టు కడుతున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘నాయకుడు’ అప్పట్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. మళ్లీ ఇంత కాలానికి ఈ కాంబో కార్యరూపం దాలుస్తుండటం అభిమానులకు అమితానందాన్ని ఇస్తోంది. ఈ చిత్రాన్ని క‌మ‌ల్ త‌న సొంత నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ మీదే నిర్మిస్తుండ‌డం విశేషం.

అనౌన్స్‌మెంట్ త‌ర్వాత వార్త‌ల్లో లేని ఈ చిత్రం.. సైలెంటుగా ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ‘పొన్నియన్ సెల్వన్-2’ రిలీజ్ తర్వాత సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు మణిరత్నం. ఈ చిత్రానికి కథానాయికగా ఇంతకుముందు త్రిష, నయనతార తదితరుల పేర్లు వినిపించాయి. ఐతే ఇప్పుడు ఆ పేర్లు వెనక్కి వెళ్లిపోయాయి. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యా బాలన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే కథానాయికగా ఖరారు చేశారట. ఇంకో లేడీ క్యారెక్టర్ కూడా ఉంటుందంటున్నారు కానీ.. దాని గురించి క్లారిటీ లేదు. విద్య అయితే కమల్‌కు జోడీగా ఫిక్సయినట్లే అంటున్నారు. ఈ జోడీ భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు.

విశేషం ఏంటంటే.. ఈ సినిమా కథ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. చ‌నిపోయిన ఒక మ‌నిషి మ‌ళ్లీ బ్ర‌తికి స‌మాజంలోకి వ‌స్తే ఎదురయ్యే ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. విన‌డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే పాయింటే ఇది. మ‌ణిర‌త్నం నుంచి ఈ ద‌శ‌లో ఇలాంటి సినిమాను ఊహించ‌లేం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారు కమల్, మణిరత్నం.

This post was last modified on April 28, 2023 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

13 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

14 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago