సీనియర్ నటులు నరేష్ తన వ్యక్తిగత జీవితంలో నూతన భాగస్వామిగా ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉన్న పవిత్ర లోకేష్ తో ఉన్న బంధం గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఆయన మూడో భార్య చేస్తున్న లీగల్ పోరాటం అందరికీ తెలిసిందే. అయితే చట్టబద్దంగా వివాహం చేసుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం లేకపోవడంతో తన లైఫ్ లో ఏం జరిగిందని అందరికీ వివరించడం కోసం నరేష్ తిరిగి సినిమానే మాధ్యమంగా ఎంచుకోవడం ఆమధ్య టైటిల్ లాంచ్ లో చూశాం. మళ్ళీ పెళ్లి పేరుతో తెలుగు కన్నడ భాషల్లో రూపొందిస్తున్న బై లింగ్వల్ కి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్సకత్వం వహించారు.
దీనికయ్యే బడ్జెట్ అంతా నరేష్ దే. ఇవాళ విడుదల చేసిన టీజర్ ఆయన వివాహ వ్యవహారాలకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు సినిమాగా మారాయని అర్థమవుతుంది. మాజీ భార్య మీడియా ముందుకు వెళ్లడం, నరేష్ మీద ఫిర్యాదు చేయడం, ఆయనతో పాటు పవిత్ర ఒక హోటల్ లో ఉండగా కెమెరాలు తీసుకెళ్లి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం ఇవన్నీ కూలంకుషంగా చూపించినట్టు కనిపిస్తోంది. ఇక్కడ నరేష్ ఉద్దేశం ఒకటే. ప్రతిసారి అందరికీ వివరించి చెప్పడం కంటే ఇలా ఒక మూవీ రూపంలో ఇస్తే పబ్లిసిటీ, ప్రమోషన్, బిజినెస్ అన్నీ ఒకేసారి జరిగిపోతాయి.
వీటికి తోడు ఎక్స్ వైఫ్ కి బోలెడు కౌంటర్లు దీని ద్వారా వేసినట్టు ఉంటుంది. ఇన్ని దశాబ్దాల టాలీవుడ్ లో ఎందరో తారల జీవితాల్లో ఇద్దరు లేదా ముగ్గురు లైఫ్ పార్ట్ నర్స్ ఉన్నారు కానీ ఎవరివీ మరీ ఇంత స్థాయిలో వివాదం కాలేదు. అది కూడా అయిదు పదులు దాటేసిన లేటు వయసులో. మొత్తానికి అన్ని కోణాల్లో ఆలోచించి కోటి రెండు కోట్లు పోయినా పర్వాలేదని నరేష్ ఇలా చేయడం మొదట్లో రిస్క్ అనిపించింది కానీ తీరా చూస్తే ఇప్పుడీ చిత్రానికి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. ఎలాగూ బడ్జెట్ తక్కువ కాబట్టి రేట్లు చాలా రీజనబుల్ గా ఉంటాయి. పర్ఫెక్ట్ ప్లాన్ అంటే ఇదేనేమో
This post was last modified on April 21, 2023 5:03 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…