సీనియర్ నటులు నరేష్ తన వ్యక్తిగత జీవితంలో నూతన భాగస్వామిగా ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉన్న పవిత్ర లోకేష్ తో ఉన్న బంధం గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఆయన మూడో భార్య చేస్తున్న లీగల్ పోరాటం అందరికీ తెలిసిందే. అయితే చట్టబద్దంగా వివాహం చేసుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం లేకపోవడంతో తన లైఫ్ లో ఏం జరిగిందని అందరికీ వివరించడం కోసం నరేష్ తిరిగి సినిమానే మాధ్యమంగా ఎంచుకోవడం ఆమధ్య టైటిల్ లాంచ్ లో చూశాం. మళ్ళీ పెళ్లి పేరుతో తెలుగు కన్నడ భాషల్లో రూపొందిస్తున్న బై లింగ్వల్ కి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్సకత్వం వహించారు.
దీనికయ్యే బడ్జెట్ అంతా నరేష్ దే. ఇవాళ విడుదల చేసిన టీజర్ ఆయన వివాహ వ్యవహారాలకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు సినిమాగా మారాయని అర్థమవుతుంది. మాజీ భార్య మీడియా ముందుకు వెళ్లడం, నరేష్ మీద ఫిర్యాదు చేయడం, ఆయనతో పాటు పవిత్ర ఒక హోటల్ లో ఉండగా కెమెరాలు తీసుకెళ్లి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం ఇవన్నీ కూలంకుషంగా చూపించినట్టు కనిపిస్తోంది. ఇక్కడ నరేష్ ఉద్దేశం ఒకటే. ప్రతిసారి అందరికీ వివరించి చెప్పడం కంటే ఇలా ఒక మూవీ రూపంలో ఇస్తే పబ్లిసిటీ, ప్రమోషన్, బిజినెస్ అన్నీ ఒకేసారి జరిగిపోతాయి.
వీటికి తోడు ఎక్స్ వైఫ్ కి బోలెడు కౌంటర్లు దీని ద్వారా వేసినట్టు ఉంటుంది. ఇన్ని దశాబ్దాల టాలీవుడ్ లో ఎందరో తారల జీవితాల్లో ఇద్దరు లేదా ముగ్గురు లైఫ్ పార్ట్ నర్స్ ఉన్నారు కానీ ఎవరివీ మరీ ఇంత స్థాయిలో వివాదం కాలేదు. అది కూడా అయిదు పదులు దాటేసిన లేటు వయసులో. మొత్తానికి అన్ని కోణాల్లో ఆలోచించి కోటి రెండు కోట్లు పోయినా పర్వాలేదని నరేష్ ఇలా చేయడం మొదట్లో రిస్క్ అనిపించింది కానీ తీరా చూస్తే ఇప్పుడీ చిత్రానికి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. ఎలాగూ బడ్జెట్ తక్కువ కాబట్టి రేట్లు చాలా రీజనబుల్ గా ఉంటాయి. పర్ఫెక్ట్ ప్లాన్ అంటే ఇదేనేమో
This post was last modified on April 21, 2023 5:03 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…