Political News

అమ‌రావ‌తిలో మ‌రో ర‌గ‌డ‌.. రంగంలోకి రైతులు.. ఏం జ‌రిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఎలానూ చేయ‌డం లేదు. అంతేకాదు.. క‌నీసం అమ‌రావ‌తి ఊసు కూడా ఎత్త‌డం లేదు. రాజధాని లేద‌న్న విమ‌ర్శ‌ల‌ను కూడా అధికార పార్టీ పాల‌కులు లైట్ తీసుకున్నారు. కానీ, రైతులు మాత్రం త‌మ ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తూనేఉన్నారు. ప్ర‌స్తుతం అమ‌రావ‌తి వివాదం ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టులో ఉంది. ఇంత‌లోనే రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల ప్ర‌జ‌ల‌కు.. ఇక్క‌డ జ‌గ‌న‌న్న ఇళ్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం దూకుడు ప్ర‌ద‌ర్శించింది.

ఈ క్ర‌మంలోనే ఆర్ – 5 జోన్ అని ఒక దానిని క్రియేట్ చేసింది. ఇక్క‌డ అమ‌రావ‌తి యేత‌ర ప్రాంతాల‌కు చెందిన పేద‌ల‌కు సెంటు భూమిని ఇవ్వాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. దీనిని కూడా రైతులు వ్య‌తిరేకి స్తున్నారు. తాము రాజ‌ధానికే ఇచ్చామ‌ని.. వేరేవారికి ఇచ్చేందుకుకాద‌ని వారు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయినా ప్ర‌భుత్వం మాత్రం త‌న‌ప‌నితాను చేసుకుపోతోంది. దీంతో రైతులు.. ఈ విష‌యంపైనా హైకోర్టులో నాలుగు రోజుల కింద‌ట కేసు దాఖ‌లు చేశారు.

దీనిపై ఇంకా తీర్పు రాలేదు. ఇంత‌లోనే ప్ర‌భుత్వం.. రాజధాని ప్రాంతంలోని ఆర్ – 5 జోన్లో ఉన్న అట‌వీ భూముల‌ను శుభ్రం చేసే ప‌ని చేప‌ట్టింది. ఈ విష‌యం తెలుసుకున్న రైతులు ఆయా ప‌నుల‌ను అడ్డుకున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలలోని పేదలకు రాజధానిలో సెంటు భూమి ఇచ్చేందుకు ఆర్ 5 జోన్లో జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు సీఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సమాచారం అందుకున్న రైతులు హుటాహుటిన కృష్ణాయపాలెం చేరుకున్నారు. జేసీబీలను, అధికారులను.. రైతులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి జేసీబీలను వెనక్కి పంపించారు.

ఆర్ – 5 జోన్ అనే అంశం హైకోర్టులో ఉండగా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని రైతులు ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో.. అవినాష్ రెడ్డి వ్యవహారంపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని రైతులు చెప్పారు. ఎక్కడో ఉన్న పేదలను ఇక్కడకి తీసుకొచ్చి.. ఇక్కడ ఉన్న వారితో గొడవలు పెట్టే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసమే భూములు ఇచ్చామ‌న్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్త‌త నెల‌కొంది.

This post was last modified on April 21, 2023 4:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: Amaravati

Recent Posts

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

6 minutes ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

10 minutes ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

13 minutes ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

23 minutes ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

41 minutes ago

ఆ సంస్థకు చుక్కలు చూపిస్తున్న 2026

కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…

48 minutes ago