ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. తర్వాత రాబోతున్న గేమ్ చేంజర్ మీద హైప్ మాములుగా లేదు. హీరోగా ఒకపక్కా బిజీగా ఉంటూనే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్న చరణ్ మనసులో ఇంకో కొత్త బిజినెస్ ప్లాన్ మనసులో ఉందట. అదే ఐపీఎల్ ఎంట్రీ. అయితే ఆటగాడిగా కాదండోయ్. ఫ్రాంచైజ్ ఓనర్ గా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ప్రతినిథిగా కేవలం సన్ రైజర్స్ మాత్రమే ఉంది. ఇది హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా అభిమానులు భావించి దానికి తెలంగాణ సెంటిమెంట్ జోడించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి నగరానికి చోటు లేకపోవడంతో నిర్వాహకులు ఆ దిశగా ఆలోచించి వచ్చే ఏడాది 2024లో జరగబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో వైజాగ్ పేరుతో ఒక ఫ్రాంచైజ్ ని లాంచ్ చేసే ప్రతిపాదనలో ఉన్నారట. దాన్ని సొంతం చేసుకోవడానికి చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. భార్య ఉపాసనతో కలిసి కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని టీమ్స్ ని షారుఖ్ ఖాన్, ప్రీతి జింతా లాంటి వాళ్ళు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్ సెలెబ్రిటీలు ఎవరూ ఈ దిశగా ఆలోచించలేదు కాబట్టి చరణ్ మొదటివాడు కావొచ్చట.
అఫీషియల్ గా తెలియడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ మొత్తానికి మంచి ఐడియానే. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. విడుదల ఎప్పుడు ఉంటుందనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఇండియన్ 2 షూటింగ్ ఒక కొలిక్కి వస్తే తప్ప శంకర్ ఏ నిర్ణయం తీసుకోలేడు. సంక్రాంతికి వచ్చే ఛాన్స్ తగ్గిపోతున్న కారణంలో 2024 వేసవి తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఫ్రెష్ గా వచ్చిన ఈ ఐపీఎల్ వార్త నిజమైతే మాత్రం ఇంకో ఇంటరెస్టింగ్ టీమ్ తోడైనట్టే.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…