Movie News

ఐపీఎల్ మీద రామ్ చరణ్ ఆసక్తి

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. తర్వాత రాబోతున్న గేమ్ చేంజర్ మీద హైప్ మాములుగా లేదు. హీరోగా ఒకపక్కా బిజీగా ఉంటూనే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్న చరణ్ మనసులో ఇంకో కొత్త బిజినెస్ ప్లాన్ మనసులో ఉందట. అదే ఐపీఎల్ ఎంట్రీ. అయితే ఆటగాడిగా కాదండోయ్. ఫ్రాంచైజ్ ఓనర్ గా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ప్రతినిథిగా కేవలం సన్ రైజర్స్ మాత్రమే ఉంది. ఇది హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా అభిమానులు భావించి దానికి తెలంగాణ సెంటిమెంట్ జోడించారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి నగరానికి చోటు లేకపోవడంతో నిర్వాహకులు ఆ దిశగా ఆలోచించి వచ్చే ఏడాది 2024లో జరగబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో వైజాగ్ పేరుతో ఒక ఫ్రాంచైజ్ ని లాంచ్ చేసే ప్రతిపాదనలో ఉన్నారట. దాన్ని సొంతం చేసుకోవడానికి చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. భార్య ఉపాసనతో కలిసి కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని టీమ్స్ ని షారుఖ్ ఖాన్, ప్రీతి జింతా లాంటి వాళ్ళు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్ సెలెబ్రిటీలు ఎవరూ ఈ దిశగా ఆలోచించలేదు కాబట్టి చరణ్ మొదటివాడు కావొచ్చట.

అఫీషియల్ గా తెలియడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ మొత్తానికి మంచి ఐడియానే. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. విడుదల ఎప్పుడు ఉంటుందనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఇండియన్ 2 షూటింగ్ ఒక కొలిక్కి వస్తే తప్ప శంకర్ ఏ నిర్ణయం తీసుకోలేడు. సంక్రాంతికి వచ్చే ఛాన్స్ తగ్గిపోతున్న కారణంలో 2024 వేసవి తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఫ్రెష్ గా వచ్చిన ఈ ఐపీఎల్ వార్త నిజమైతే మాత్రం ఇంకో ఇంటరెస్టింగ్ టీమ్ తోడైనట్టే.

Satya

Recent Posts

సాయిపల్లవి చేసుంటే ఎలా ఉండేది

మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…

1 hour ago

తమిళ నటుడికి పిచ్చెక్కించేసిన కంచరపాలెం

స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్‌కు మంచి గుర్తింపే ఉంది.…

2 hours ago

ఫోటో కోసం శ్రీలీలను పక్కకు జరిపిన సీఎం భార్య?

ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…

2 hours ago

ఈ తప్పులకూ అంత పెద్ద శిక్షా…?

తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…

2 hours ago

బోరింగ్ అన్నారు… కోట్లు ఇచ్చేస్తున్నారు

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…

3 hours ago

అడ్రస్ లేని సినిమా గురించి మెగా హీరో ఏమన్నాడు?

సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…

3 hours ago