ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. తర్వాత రాబోతున్న గేమ్ చేంజర్ మీద హైప్ మాములుగా లేదు. హీరోగా ఒకపక్కా బిజీగా ఉంటూనే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్న చరణ్ మనసులో ఇంకో కొత్త బిజినెస్ ప్లాన్ మనసులో ఉందట. అదే ఐపీఎల్ ఎంట్రీ. అయితే ఆటగాడిగా కాదండోయ్. ఫ్రాంచైజ్ ఓనర్ గా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ప్రతినిథిగా కేవలం సన్ రైజర్స్ మాత్రమే ఉంది. ఇది హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా అభిమానులు భావించి దానికి తెలంగాణ సెంటిమెంట్ జోడించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి నగరానికి చోటు లేకపోవడంతో నిర్వాహకులు ఆ దిశగా ఆలోచించి వచ్చే ఏడాది 2024లో జరగబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో వైజాగ్ పేరుతో ఒక ఫ్రాంచైజ్ ని లాంచ్ చేసే ప్రతిపాదనలో ఉన్నారట. దాన్ని సొంతం చేసుకోవడానికి చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. భార్య ఉపాసనతో కలిసి కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని టీమ్స్ ని షారుఖ్ ఖాన్, ప్రీతి జింతా లాంటి వాళ్ళు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్ సెలెబ్రిటీలు ఎవరూ ఈ దిశగా ఆలోచించలేదు కాబట్టి చరణ్ మొదటివాడు కావొచ్చట.
అఫీషియల్ గా తెలియడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ మొత్తానికి మంచి ఐడియానే. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. విడుదల ఎప్పుడు ఉంటుందనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఇండియన్ 2 షూటింగ్ ఒక కొలిక్కి వస్తే తప్ప శంకర్ ఏ నిర్ణయం తీసుకోలేడు. సంక్రాంతికి వచ్చే ఛాన్స్ తగ్గిపోతున్న కారణంలో 2024 వేసవి తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఫ్రెష్ గా వచ్చిన ఈ ఐపీఎల్ వార్త నిజమైతే మాత్రం ఇంకో ఇంటరెస్టింగ్ టీమ్ తోడైనట్టే.
This post was last modified on April 20, 2023 12:42 pm
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…