తన కొడుకు హృతిక్ రోషన్.. కహోనా ప్యార్ హై అనే ఒకే ఒక్క సినిమాతో సూపర్ స్టార్ను చేసేసిన దర్శకుడు రాకేష్ రోషన్. హృతిక్ టాలెంట్, అతడి అందం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయి అతను స్టార్గా అవతరించినప్పటికీ.. అతడికి అదిరిపోయే డెబ్యూ ఇచ్చిన ఘనత రాకేష్దే. ఆ తర్వాత కూడా కొడుకుతో కోయీ మిల్ గయా, క్రిష్, క్రిష్-3 లాంటి బ్లాక్బస్టర్లు ఇచ్చాడు రాకేష్.
ఇండియాలో ఫ్రాంఛైజీ చిత్రాల ఒరవడి పెరగడంలో క్రిష్ సిరీస్ది చాలా కీలక పాత్ర. ఇండియాకంటూ చెప్పుకోవడానికి సూపర్ హీరో ఫ్రాంఛైజీ ఇదే. ఐతే క్రిష్-3 వచ్చి పదేళ్లు అవుతున్నా ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా రాలేదు. నాలుగైదేళ్ల ముందే దీని కోసం ప్లానింగ్ జరిగింది కానీ.. హృతిక్ కుటుంబానికి అనుకోని కష్టం రావడంతో సినిమా వాయిదా వేయక తప్పలేదు.
రాకేష్ రోషన్ కొన్నేళ్ల కిందట క్యాన్సర్ బారిన పడటంతో క్రిష్-4 పని ఆగిపోయింది. క్యాన్సర్ లాంటి మహమ్మారి నుంచి కోలుకుని మామూలుగా బతకడమే కష్టం. ఇక సినిమా తీయడం, అందులోనూ క్రిష్-4 లాంటి మెగా మూవీ తీయడం అంటే మాటలు కాదు. దీంతో ఈ సినిమా, ఈ ఫ్రాంఛైజీ ఇక ఉండదని చాలామంది అనుకున్నారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్లుగా దీని గురించి సౌండ్ లేదు. కాగా ఇటీవల క్రిష్-4 సినిమా ఉంటుందని, కానీ దర్శకుడు వేరని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
హృతిక్తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు తీసి.. ఇటీవలే వార్-2 సినిమాను అనౌన్స్ చేసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. ఐతే హృతిక్ తండ్రి స్వయంగా ఈ వార్తలను ఖండించాడు. ఇలాంటి ప్రతిపాదనే లేదని తేల్చేశాడు. తనే క్రిష్-4 సినిమా తీస్తానని.. స్క్రిప్టు అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాను ప్రకటిస్తానని పేర్కొన్నాడు. వయసు మీద పడి, తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాక కూడా ఇంత పెద్ద సినిమా చేయాలన్న సంకల్పంతో ఉన్నాడంటే రాకేష్ మామూలోడు కాదు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…