తన కొడుకు హృతిక్ రోషన్.. కహోనా ప్యార్ హై అనే ఒకే ఒక్క సినిమాతో సూపర్ స్టార్ను చేసేసిన దర్శకుడు రాకేష్ రోషన్. హృతిక్ టాలెంట్, అతడి అందం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయి అతను స్టార్గా అవతరించినప్పటికీ.. అతడికి అదిరిపోయే డెబ్యూ ఇచ్చిన ఘనత రాకేష్దే. ఆ తర్వాత కూడా కొడుకుతో కోయీ మిల్ గయా, క్రిష్, క్రిష్-3 లాంటి బ్లాక్బస్టర్లు ఇచ్చాడు రాకేష్.
ఇండియాలో ఫ్రాంఛైజీ చిత్రాల ఒరవడి పెరగడంలో క్రిష్ సిరీస్ది చాలా కీలక పాత్ర. ఇండియాకంటూ చెప్పుకోవడానికి సూపర్ హీరో ఫ్రాంఛైజీ ఇదే. ఐతే క్రిష్-3 వచ్చి పదేళ్లు అవుతున్నా ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా రాలేదు. నాలుగైదేళ్ల ముందే దీని కోసం ప్లానింగ్ జరిగింది కానీ.. హృతిక్ కుటుంబానికి అనుకోని కష్టం రావడంతో సినిమా వాయిదా వేయక తప్పలేదు.
రాకేష్ రోషన్ కొన్నేళ్ల కిందట క్యాన్సర్ బారిన పడటంతో క్రిష్-4 పని ఆగిపోయింది. క్యాన్సర్ లాంటి మహమ్మారి నుంచి కోలుకుని మామూలుగా బతకడమే కష్టం. ఇక సినిమా తీయడం, అందులోనూ క్రిష్-4 లాంటి మెగా మూవీ తీయడం అంటే మాటలు కాదు. దీంతో ఈ సినిమా, ఈ ఫ్రాంఛైజీ ఇక ఉండదని చాలామంది అనుకున్నారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్లుగా దీని గురించి సౌండ్ లేదు. కాగా ఇటీవల క్రిష్-4 సినిమా ఉంటుందని, కానీ దర్శకుడు వేరని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
హృతిక్తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు తీసి.. ఇటీవలే వార్-2 సినిమాను అనౌన్స్ చేసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. ఐతే హృతిక్ తండ్రి స్వయంగా ఈ వార్తలను ఖండించాడు. ఇలాంటి ప్రతిపాదనే లేదని తేల్చేశాడు. తనే క్రిష్-4 సినిమా తీస్తానని.. స్క్రిప్టు అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాను ప్రకటిస్తానని పేర్కొన్నాడు. వయసు మీద పడి, తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాక కూడా ఇంత పెద్ద సినిమా చేయాలన్న సంకల్పంతో ఉన్నాడంటే రాకేష్ మామూలోడు కాదు.
This post was last modified on April 19, 2023 9:35 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…