తన కొడుకు హృతిక్ రోషన్.. కహోనా ప్యార్ హై అనే ఒకే ఒక్క సినిమాతో సూపర్ స్టార్ను చేసేసిన దర్శకుడు రాకేష్ రోషన్. హృతిక్ టాలెంట్, అతడి అందం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయి అతను స్టార్గా అవతరించినప్పటికీ.. అతడికి అదిరిపోయే డెబ్యూ ఇచ్చిన ఘనత రాకేష్దే. ఆ తర్వాత కూడా కొడుకుతో కోయీ మిల్ గయా, క్రిష్, క్రిష్-3 లాంటి బ్లాక్బస్టర్లు ఇచ్చాడు రాకేష్.
ఇండియాలో ఫ్రాంఛైజీ చిత్రాల ఒరవడి పెరగడంలో క్రిష్ సిరీస్ది చాలా కీలక పాత్ర. ఇండియాకంటూ చెప్పుకోవడానికి సూపర్ హీరో ఫ్రాంఛైజీ ఇదే. ఐతే క్రిష్-3 వచ్చి పదేళ్లు అవుతున్నా ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా రాలేదు. నాలుగైదేళ్ల ముందే దీని కోసం ప్లానింగ్ జరిగింది కానీ.. హృతిక్ కుటుంబానికి అనుకోని కష్టం రావడంతో సినిమా వాయిదా వేయక తప్పలేదు.
రాకేష్ రోషన్ కొన్నేళ్ల కిందట క్యాన్సర్ బారిన పడటంతో క్రిష్-4 పని ఆగిపోయింది. క్యాన్సర్ లాంటి మహమ్మారి నుంచి కోలుకుని మామూలుగా బతకడమే కష్టం. ఇక సినిమా తీయడం, అందులోనూ క్రిష్-4 లాంటి మెగా మూవీ తీయడం అంటే మాటలు కాదు. దీంతో ఈ సినిమా, ఈ ఫ్రాంఛైజీ ఇక ఉండదని చాలామంది అనుకున్నారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్లుగా దీని గురించి సౌండ్ లేదు. కాగా ఇటీవల క్రిష్-4 సినిమా ఉంటుందని, కానీ దర్శకుడు వేరని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
హృతిక్తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు తీసి.. ఇటీవలే వార్-2 సినిమాను అనౌన్స్ చేసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. ఐతే హృతిక్ తండ్రి స్వయంగా ఈ వార్తలను ఖండించాడు. ఇలాంటి ప్రతిపాదనే లేదని తేల్చేశాడు. తనే క్రిష్-4 సినిమా తీస్తానని.. స్క్రిప్టు అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాను ప్రకటిస్తానని పేర్కొన్నాడు. వయసు మీద పడి, తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాక కూడా ఇంత పెద్ద సినిమా చేయాలన్న సంకల్పంతో ఉన్నాడంటే రాకేష్ మామూలోడు కాదు.
This post was last modified on April 19, 2023 9:35 am
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…