ఒకప్పుడు తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిల రెఫరెన్సులు సినిమాల్లో ఎక్కువగా కనిపించేవి. కానీ గత కొన్నేళ్లలో పరిశీలిస్తే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల రెఫరెన్సులు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా పవన్ పేరు వినిపించినా.. ఆయన మేనరిజంలను ఎవరైనా అనుకరించినా థియేటర్లు హోరెత్తిపోతుంటాయి. సినిమాల్లో అనే కాక టీవీ షోలు, సోషల్ మీడియాలో పేరున్న వ్యక్తులు, సంస్థల హ్యాండిల్స్లో సైతం పవన్ను బాగా వాడేస్తుంటారు. ఇప్పుడు క్రికెట్లోకి కూడా పవన్ ఫీవర్ వచ్చేసింది.
తెలుగువారి ఐపీఎల్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్.. తాజాగా పవన్ను వాడేసింది. ఒక ట్రెండీ ట్వీట్తో పవర్ స్టార్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తమ జట్టు కెప్టెన్ మార్క్రమ్ ఆరెంజ్ కలర్ రుమాలు ధరించిన సందర్భంగా.. ఆ ఫొటో పెట్టి పవన్ తన మార్కును ఎర్ర టవల్ వేసుకున్న ఫొటోను జోడించి.. ‘‘ఫైర్ స్టార్మ్ ఈజీ్ కమింగ్’ అని వ్యాఖ్యను కూడా జోడించింది.
మంగళవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్.. ముంబయి ఇండియన్స్తో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్ వేసింది సన్రైజర్స్. పవన్ సరిగ్గా ఈ రోజే.. సుజీత్ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్కు హాజరయ్యాడు. ఈ సందర్భ:గా ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి మొదట్నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ ట్యాగ్ను వాడుకుని.. పవన్తో మార్క్రమ్కు పోలిక పెడుతూ ట్వీట్ వేయడం తెలివైన ఎత్తుగడే. చెన్నై, బెంగళూరు, ముంబయి లాంటి జట్లతో పోలిస్తే సన్రైజర్స్కు లోకల్ కనెక్షన్ పెద్దగా ఉండదని.. స్థానిక అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేయదని విమర్శలు ఉన్నాయి. ఐతే ఈ సీజన్లో మళ్లీ అభిమానులను ఎంగేజ్ చేయడానికి సన్రైజర్స్ యాజమాన్యం కొంచెం ఎఫర్ట్ పెడుతోంది. ఈ క్రమంలోనే ఇలాంటి తెలుగు టచ్ ఉన్న ట్వీట్లు వేస్తోంది.
This post was last modified on April 18, 2023 5:55 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…