కరోనా వల్ల సినిమా థియేటర్లు మూసి పెట్టడంతో ఓటిటిలోనే చాలా సినిమాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఎంతగా జనం ఇళ్లల్లోనే ఉంటూ సినిమాలు టీవీలోనే చూస్తున్నా కానీ ఓటిటిలో వచ్చిన ప్రతి సినిమాను ఎగబడి చేసేయడం లేదు. ఇంకా చెప్పాలంటే రివ్యూస్ బాగుండి, సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుంటున్న సినిమాలను మాత్రమే చూస్తున్నారు.
ఈ థియేటర్ లాక్ డౌన్ టైంలో బాలీవుడ్ నుంచి పలు చిత్రాలు రిలీజ్ కాగా సుశాంత్ సింగ్ నటించిన దిల్ బేచారాకు తప్ప మిగతా ఏ సినిమాలకూ ఆదరణ దక్కలేదు. దిల్ బేచారా అయినా సుశాంత్ సింగ్ కి ఉన్న సింపతీ ఫాక్టర్ వల్ల అలా రికార్డు వ్యూస్ దక్కించుకుంది. కాకపోతే ఇంకా అగ్ర హీరోలు నటించిన చిత్రాలేమీ విడుదల కాలేదు.
అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ నటించిన సినిమాలు వస్తే ఓటిటి సీన్ మన దేశంలో ఎంత ఉందనేది తెలిసిపోతుంది. కాకపోతే సినిమాల కంటే సిరీస్ చూడ్డానికి ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సిరీస్ మీద దర్శకులు, నిర్మాతలు కూడా ఫోకస్ పెడుతున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…