కరోనా వల్ల సినిమా థియేటర్లు మూసి పెట్టడంతో ఓటిటిలోనే చాలా సినిమాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఎంతగా జనం ఇళ్లల్లోనే ఉంటూ సినిమాలు టీవీలోనే చూస్తున్నా కానీ ఓటిటిలో వచ్చిన ప్రతి సినిమాను ఎగబడి చేసేయడం లేదు. ఇంకా చెప్పాలంటే రివ్యూస్ బాగుండి, సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుంటున్న సినిమాలను మాత్రమే చూస్తున్నారు.
ఈ థియేటర్ లాక్ డౌన్ టైంలో బాలీవుడ్ నుంచి పలు చిత్రాలు రిలీజ్ కాగా సుశాంత్ సింగ్ నటించిన దిల్ బేచారాకు తప్ప మిగతా ఏ సినిమాలకూ ఆదరణ దక్కలేదు. దిల్ బేచారా అయినా సుశాంత్ సింగ్ కి ఉన్న సింపతీ ఫాక్టర్ వల్ల అలా రికార్డు వ్యూస్ దక్కించుకుంది. కాకపోతే ఇంకా అగ్ర హీరోలు నటించిన చిత్రాలేమీ విడుదల కాలేదు.
అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ నటించిన సినిమాలు వస్తే ఓటిటి సీన్ మన దేశంలో ఎంత ఉందనేది తెలిసిపోతుంది. కాకపోతే సినిమాల కంటే సిరీస్ చూడ్డానికి ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సిరీస్ మీద దర్శకులు, నిర్మాతలు కూడా ఫోకస్ పెడుతున్నారు.
This post was last modified on August 3, 2020 7:51 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…