కరోనా వల్ల సినిమా థియేటర్లు మూసి పెట్టడంతో ఓటిటిలోనే చాలా సినిమాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఎంతగా జనం ఇళ్లల్లోనే ఉంటూ సినిమాలు టీవీలోనే చూస్తున్నా కానీ ఓటిటిలో వచ్చిన ప్రతి సినిమాను ఎగబడి చేసేయడం లేదు. ఇంకా చెప్పాలంటే రివ్యూస్ బాగుండి, సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుంటున్న సినిమాలను మాత్రమే చూస్తున్నారు.
ఈ థియేటర్ లాక్ డౌన్ టైంలో బాలీవుడ్ నుంచి పలు చిత్రాలు రిలీజ్ కాగా సుశాంత్ సింగ్ నటించిన దిల్ బేచారాకు తప్ప మిగతా ఏ సినిమాలకూ ఆదరణ దక్కలేదు. దిల్ బేచారా అయినా సుశాంత్ సింగ్ కి ఉన్న సింపతీ ఫాక్టర్ వల్ల అలా రికార్డు వ్యూస్ దక్కించుకుంది. కాకపోతే ఇంకా అగ్ర హీరోలు నటించిన చిత్రాలేమీ విడుదల కాలేదు.
అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ నటించిన సినిమాలు వస్తే ఓటిటి సీన్ మన దేశంలో ఎంత ఉందనేది తెలిసిపోతుంది. కాకపోతే సినిమాల కంటే సిరీస్ చూడ్డానికి ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సిరీస్ మీద దర్శకులు, నిర్మాతలు కూడా ఫోకస్ పెడుతున్నారు.
This post was last modified on August 3, 2020 7:51 am
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…