పేరుకు కోలీవుడ్ హీరో అనే మాటే కానీ చియాన్ విక్రమ్ కు అన్ని భాషల్లోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దురదృష్టవశాత్తు ఎంత కష్టపడినా ఆ స్థాయిలో సక్సెస్ లేక వెనుకాడబడుతున్నాడు కానీ ప్రయాగాలు చేయడంలో కమల్ హాసన్ ని మించిపోయాడని ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు. ఐ సమయంలో ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టి మరీ వేసిన కురూపి గూని వేషం ఎప్పటికీ మర్చిపోలేం. అపరిచితుడు లాంటివి ఇప్పటికీ గ్రేట్ క్లాసిక్స్ అనిపిస్తున్నాయంటే శంకర్ టేకింగ్ కన్నా విక్రమ్ నటన గొప్పగా అనిపించడం వల్లే. తాజాగా మరో టెర్రిఫిక్ రోల్ తో వస్తున్నాడు విక్రమ్.
తంగలాన్ పేరుతో రూపొందుతున్న పీరియాడిక్ కం హిస్టారిక్ డ్రామాలో భీతిగొలిపే వేషధారణతో ఇలాంటివి విక్రమ్ కు మాత్రమే సాధ్యమనేలా అదరగొట్టాడు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా యూనిట్ మేకింగ్ వీడియోతో కలిపి చిన్న టీజర్ ని విడుదల చేసింది. అందులో విక్రమ్ అర్ధనగ్నంగా వయసు మళ్ళిన పాత్రలో సగం జుత్తు రాలిపోయి మొహమంతా కమిలిపోయి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అడవులు, కొండలు, కోనలు, రాతి యుగం మనుషులు ఇలా వాతావరణం చాలా అరుదుగా చూసేలా అనిపిస్తోంది. ఆది పినిశెట్టి ఏకవీర ఛాయలైతే కనిపించాయి.
తంగలాన్ దర్శకుడు పా రంజిత్. వెనుకబడిన వర్గాల భావజాలాన్ని తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేసే ఈ విలక్షణ దర్శకుడు ఈ సారి ఎవరూ ఊహించని బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. తమిళ జనాలకు ఇవి బాగా కనెక్ట్ అవుతాయి కాని ఎటొచ్చి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకోవడమే సవాల్ గా మారుతోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని తెలుగులో యువి సంస్థ అందిస్తోంది. సూర్య కంగువ దారిలోనే దీనికి కూడా తెలుగు టైటిల్ తంగలాన్ అని యధాతథంగా పెట్టేశారు. రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ ఏడాది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on April 17, 2023 11:09 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…