Movie News

ఎన్టీఆర్ పార్టీ ఎందుకు ఇచ్చినట్టు

నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కి ప్రత్యేకంగా పార్టీ ఇవ్వడం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇదేదో సినిమా ఒప్పందమో లేక బిజినెస్ కోసమో కాదట. అతను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న ప్రణాళికలో భాగంగా ఆ కలయిక ఇప్పటికి కుదిరిందన్న మాట. అయితే ఈ డిన్నర్ ని కేవలం అతనికే పరిమితం చేయకుండా తారక్ ఇండస్ట్రీలో తనకు బాగా సన్నిహితులైన వాళ్ళను పిలిపించుకుని ఇందులో భాగం చేయడం, ఆ ఫోటోలు ట్విట్టర్ ఫేస్ బుక్ లో చక్కర్లు కొట్టడం జరిగిపోయాయి.

ఆశ్చర్యకరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఇద్దరి ప్రాజెక్ట్ క్యాన్సిలయ్యాక సరిగా మాటలు లేవనే ప్రచారానికి చెక్ పెడుతూ మంచి పనే చేశారు. రాజమౌళి, మైత్రి రవిశంకర్ – నవీన్, కొరటాల శివ, శిరీష్, శోభు యార్లగడ్డ, కార్తికేయ తదితరులు హాజరయ్యారు. దిల్ రాజు, సుకుమార్ తదితరులకు సైతం ఆహ్వానాలు వెళ్లాయి కానీ షూటింగులు, హైదరాబాద్ లో లేకపోవడం లాంటి కారణాల వల్ల రాలేకపోయారు. కొందరు ఫోటో సెషన్ కంటే ముందే వెళ్లిపోవడం వల్ల పేర్లు మిస్ అయ్యాయి. మొత్తానికి ప్రైవేట్ పార్టీ ఇంతగా హైలైట్ కావడం అనూహ్యం.

ఇటీవలే ఎన్టీఆర్ 30 మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న తారక్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. తిరిగి ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో కొనసాగించబోతున్నారు. షూటింగ్ తాలూకు ఫోటోలు లీకవుతున్నందుకు టీమ్ జాగ్రత్త పడుతోంది. అయితే తన లుక్ కు సంబంధించి జూనియర్ ఎలాంటి దాపరికం ఉంచడం లేదు. సినిమాలో కనిపించే తీరులోనే బయట తిరుగుతున్నాడు. ఇంతకీ జేమ్స్ ఫారెల్ బృందంతో సమావేశం వెనుక ఏదైనా మతలబు ఉందా అనే కోణంలో పలు విశ్లేషణలు సాగుతున్నాయి కానీ అమెజాన్ ప్లానింగ్ ఎప్పుడూ ఊహాతీతంగానే ఉంటుంది.

This post was last modified on April 13, 2023 10:35 am

Share
Show comments

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

35 minutes ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

2 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

3 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

3 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

5 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

5 hours ago