నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కి ప్రత్యేకంగా పార్టీ ఇవ్వడం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇదేదో సినిమా ఒప్పందమో లేక బిజినెస్ కోసమో కాదట. అతను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న ప్రణాళికలో భాగంగా ఆ కలయిక ఇప్పటికి కుదిరిందన్న మాట. అయితే ఈ డిన్నర్ ని కేవలం అతనికే పరిమితం చేయకుండా తారక్ ఇండస్ట్రీలో తనకు బాగా సన్నిహితులైన వాళ్ళను పిలిపించుకుని ఇందులో భాగం చేయడం, ఆ ఫోటోలు ట్విట్టర్ ఫేస్ బుక్ లో చక్కర్లు కొట్టడం జరిగిపోయాయి.
ఆశ్చర్యకరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఇద్దరి ప్రాజెక్ట్ క్యాన్సిలయ్యాక సరిగా మాటలు లేవనే ప్రచారానికి చెక్ పెడుతూ మంచి పనే చేశారు. రాజమౌళి, మైత్రి రవిశంకర్ – నవీన్, కొరటాల శివ, శిరీష్, శోభు యార్లగడ్డ, కార్తికేయ తదితరులు హాజరయ్యారు. దిల్ రాజు, సుకుమార్ తదితరులకు సైతం ఆహ్వానాలు వెళ్లాయి కానీ షూటింగులు, హైదరాబాద్ లో లేకపోవడం లాంటి కారణాల వల్ల రాలేకపోయారు. కొందరు ఫోటో సెషన్ కంటే ముందే వెళ్లిపోవడం వల్ల పేర్లు మిస్ అయ్యాయి. మొత్తానికి ప్రైవేట్ పార్టీ ఇంతగా హైలైట్ కావడం అనూహ్యం.
ఇటీవలే ఎన్టీఆర్ 30 మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న తారక్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. తిరిగి ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో కొనసాగించబోతున్నారు. షూటింగ్ తాలూకు ఫోటోలు లీకవుతున్నందుకు టీమ్ జాగ్రత్త పడుతోంది. అయితే తన లుక్ కు సంబంధించి జూనియర్ ఎలాంటి దాపరికం ఉంచడం లేదు. సినిమాలో కనిపించే తీరులోనే బయట తిరుగుతున్నాడు. ఇంతకీ జేమ్స్ ఫారెల్ బృందంతో సమావేశం వెనుక ఏదైనా మతలబు ఉందా అనే కోణంలో పలు విశ్లేషణలు సాగుతున్నాయి కానీ అమెజాన్ ప్లానింగ్ ఎప్పుడూ ఊహాతీతంగానే ఉంటుంది.
This post was last modified on April 13, 2023 10:35 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…