నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కి ప్రత్యేకంగా పార్టీ ఇవ్వడం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇదేదో సినిమా ఒప్పందమో లేక బిజినెస్ కోసమో కాదట. అతను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న ప్రణాళికలో భాగంగా ఆ కలయిక ఇప్పటికి కుదిరిందన్న మాట. అయితే ఈ డిన్నర్ ని కేవలం అతనికే పరిమితం చేయకుండా తారక్ ఇండస్ట్రీలో తనకు బాగా సన్నిహితులైన వాళ్ళను పిలిపించుకుని ఇందులో భాగం చేయడం, ఆ ఫోటోలు ట్విట్టర్ ఫేస్ బుక్ లో చక్కర్లు కొట్టడం జరిగిపోయాయి.
ఆశ్చర్యకరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఇద్దరి ప్రాజెక్ట్ క్యాన్సిలయ్యాక సరిగా మాటలు లేవనే ప్రచారానికి చెక్ పెడుతూ మంచి పనే చేశారు. రాజమౌళి, మైత్రి రవిశంకర్ – నవీన్, కొరటాల శివ, శిరీష్, శోభు యార్లగడ్డ, కార్తికేయ తదితరులు హాజరయ్యారు. దిల్ రాజు, సుకుమార్ తదితరులకు సైతం ఆహ్వానాలు వెళ్లాయి కానీ షూటింగులు, హైదరాబాద్ లో లేకపోవడం లాంటి కారణాల వల్ల రాలేకపోయారు. కొందరు ఫోటో సెషన్ కంటే ముందే వెళ్లిపోవడం వల్ల పేర్లు మిస్ అయ్యాయి. మొత్తానికి ప్రైవేట్ పార్టీ ఇంతగా హైలైట్ కావడం అనూహ్యం.
ఇటీవలే ఎన్టీఆర్ 30 మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న తారక్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. తిరిగి ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో కొనసాగించబోతున్నారు. షూటింగ్ తాలూకు ఫోటోలు లీకవుతున్నందుకు టీమ్ జాగ్రత్త పడుతోంది. అయితే తన లుక్ కు సంబంధించి జూనియర్ ఎలాంటి దాపరికం ఉంచడం లేదు. సినిమాలో కనిపించే తీరులోనే బయట తిరుగుతున్నాడు. ఇంతకీ జేమ్స్ ఫారెల్ బృందంతో సమావేశం వెనుక ఏదైనా మతలబు ఉందా అనే కోణంలో పలు విశ్లేషణలు సాగుతున్నాయి కానీ అమెజాన్ ప్లానింగ్ ఎప్పుడూ ఊహాతీతంగానే ఉంటుంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…