నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కి ప్రత్యేకంగా పార్టీ ఇవ్వడం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇదేదో సినిమా ఒప్పందమో లేక బిజినెస్ కోసమో కాదట. అతను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న ప్రణాళికలో భాగంగా ఆ కలయిక ఇప్పటికి కుదిరిందన్న మాట. అయితే ఈ డిన్నర్ ని కేవలం అతనికే పరిమితం చేయకుండా తారక్ ఇండస్ట్రీలో తనకు బాగా సన్నిహితులైన వాళ్ళను పిలిపించుకుని ఇందులో భాగం చేయడం, ఆ ఫోటోలు ట్విట్టర్ ఫేస్ బుక్ లో చక్కర్లు కొట్టడం జరిగిపోయాయి.
ఆశ్చర్యకరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఇద్దరి ప్రాజెక్ట్ క్యాన్సిలయ్యాక సరిగా మాటలు లేవనే ప్రచారానికి చెక్ పెడుతూ మంచి పనే చేశారు. రాజమౌళి, మైత్రి రవిశంకర్ – నవీన్, కొరటాల శివ, శిరీష్, శోభు యార్లగడ్డ, కార్తికేయ తదితరులు హాజరయ్యారు. దిల్ రాజు, సుకుమార్ తదితరులకు సైతం ఆహ్వానాలు వెళ్లాయి కానీ షూటింగులు, హైదరాబాద్ లో లేకపోవడం లాంటి కారణాల వల్ల రాలేకపోయారు. కొందరు ఫోటో సెషన్ కంటే ముందే వెళ్లిపోవడం వల్ల పేర్లు మిస్ అయ్యాయి. మొత్తానికి ప్రైవేట్ పార్టీ ఇంతగా హైలైట్ కావడం అనూహ్యం.
ఇటీవలే ఎన్టీఆర్ 30 మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న తారక్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. తిరిగి ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో కొనసాగించబోతున్నారు. షూటింగ్ తాలూకు ఫోటోలు లీకవుతున్నందుకు టీమ్ జాగ్రత్త పడుతోంది. అయితే తన లుక్ కు సంబంధించి జూనియర్ ఎలాంటి దాపరికం ఉంచడం లేదు. సినిమాలో కనిపించే తీరులోనే బయట తిరుగుతున్నాడు. ఇంతకీ జేమ్స్ ఫారెల్ బృందంతో సమావేశం వెనుక ఏదైనా మతలబు ఉందా అనే కోణంలో పలు విశ్లేషణలు సాగుతున్నాయి కానీ అమెజాన్ ప్లానింగ్ ఎప్పుడూ ఊహాతీతంగానే ఉంటుంది.
This post was last modified on April 13, 2023 10:35 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…