భయపడినట్టే అవుతోంది. ఐపీఎల్ ప్రభావం బాక్సాఫీస్ మీద గట్టిగానే పడుతోంది. ముఖ్యంగా సాయంత్రం జరిగే మ్యాచులు చూడటం కోసం జనం ఇళ్లలోనే కదలకుండా ఉండటంతో థియేటర్ల టికెట్ కౌంటర్లు వెలవెలబోతున్నాయి. అందులోనూ రోజూ జరుగుతున్న ఆటల్లో ట్విస్టులు, క్లైమాక్సులు, ఫలితాలు ఊహాతీతంగా వస్తున్నాయి. తాము ఏ టీమ్ కి మద్దతు ఇస్తున్నామనే కోణంలో కాకుండా ఏ ఎంజాయ్ మెంట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రతిదీ చూసేందుకు క్రికెట్ లవర్స్ ప్రిపేర్ అవుతున్నారు. దసరాకు కాదు కానీ దీని డ్యామేజ్ మీటర్, రావణాసురల మీద తీవ్రంగా పడింది.
అసలే ఫ్లాప్ టాక్ తో సతమతమవుతున్న టైంలో ఐపిఎల్ రూపంలో పడిన దెబ్బకు అల్లాడిపోతున్నాయి. అలా అని మార్నింగ్ మ్యాటీలు బాగున్నాయని కాదు. ఎండల తాకిడికి పగటి వేళ హాలుకు వచ్చేందుకు పబ్లిక్ అంత సుముఖంగా లేరు. దసరాలాగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వేడిని తట్టుకుని మరీ వెళ్తున్నారు కానీ సోసోగా ఉన్నాయంటే మాత్రం ఓటిటిలో చూద్దాం లెమ్మని లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఆక్యుపెన్సీలు అంతంత మాత్రంగా ఉండి షోలు క్యాన్సిల్ చేసే దాకా పరిస్థితి వెళ్తోంది. ఇంకా ఐపీఎల్ సీజన్ నలభై రోజుల పైగానే ఉంది. సో పూర్తి ముప్పు తొలగలేదు.
వచ్చే నెల కూడా భారీ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్యాన్ ఇండియా సినిమాలు పెద్దగా లేవు. నాగ చైతన్య కస్టడీ ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటుండగా అల్లరి నరేష్, గోపీచంద్ లాంటి స్ట్రగులింగ్ హీరోలు తమ అదృష్టాన్ని మేలోనే పరీక్షించుకోబోతున్నారు. ఈ నెలాఖరున ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 లు సైతం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఎలాగైనా సరే థియేటర్లోనే చూడాలన్న రిపోర్ట్స్ ని రాబట్టుకోవాలి. అప్పుడే వాటి మీద పెట్టిన పెట్టుబడికి తగట్టు ఓపెనింగ్స్, లాంగ్ రన్ దక్కుతాయి. ఐపీఎల్ ప్రతి సినిమా ప్రేమికుడు చూస్తున్నారని కాదు కానీ క్రికెట్ లవర్స్ అందరూ మూవీ లవర్సే అయ్యుంటారుగా
This post was last modified on April 11, 2023 8:38 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…