దేవరకొండ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్టే

హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని , అసలు ఈ కాంబోలో ఓ బాలీవుడ్ సినిమా ఉండనుందని కానీ ఎవరూ ఊహించలేదు. అయితే తాజాగా ఈ ఇద్దరి కాంబోలో వార్ 2 ఎనౌన్స్ చేసి మేకర్స్ అందరినీ షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సర్ ప్రయిజ్ చేశారు. నిజానికి ఈ మధ్య కాలంలో హృతిక్ గురించి మాట్లాడుకుంటే అందులో వార్ టాపిక్ ముందుంటుంది. బాలీవుడ్ లో వార్ సినిమా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసి బిగ్గెస్ట్ స్టైలిష్ యాక్షన్ గా మెప్పించింది.

ఆ సినిమాకు సీక్వెల్ అంటే అదీ ఎన్టీఆర్ కూడా ఉంటారంటే మూవీ లవర్స్ కి ఇంకేం కావాలి ? చెప్పండి. అయితే ఈ గోల్డెన్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కంటే ముందు యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతికి వచ్చిందట. లైగర్ షూటింగ్ టైమ్ లో హృతిక్ , విజయ్ కాంబోలో ఈ సీక్వెల్ సెట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి విజయ్ ను అప్రోచ్ అయ్యారట.

కానీ పాన్ ఇండియా లెవెల్ లో లైగర్ డిజాస్టర్ అవ్వడంతో ఆ తర్వాత తెలుగు నుండి మరో స్టార్ కోసం చూస్తూ ఫైనల్ గా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో అక్కడ భారీ క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ ను లైన్లో పెట్టేసి తారక్ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని తెలుస్తుంది. అలా విజయ్ కి వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు తారక చేతిలో పడింది.