మాములుగా ఒక స్టార్ హీరో ఇమేజ్ మీద ఓపెనింగ్స్ రావడం చూశాం కానీ ఒక డైరెక్టర్ బ్రాండ్ మీద క్రేజ్ రావడమనేది కొందరికే జరుగుతుంది. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, పూరి లాంటివాళ్ళను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే వీళ్లంతా కమర్షియల్ దర్శకులు. కానీ సహజత్వానికి పెద్ద పీఠ వేస్తూ రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీస్తాడని పేరున్న వెట్రిమారన్ ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్.
నిన్న ‘విడుతలై పార్ట్ 1’ భారీ అంచనాల మధ్య తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యింది. ప్రీమియర్స్ నుంచే ప్రశంసల వర్షం కురుస్తోంది. కమెడియన్ సూరి కథానాయకుడిగా రూపొందిన ఈ ఇంటెన్స్ డ్రామాలో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషించారు. పీరియాడిక్ డ్రామాగా ఇది సాగుతుంది. పోలీస్ వ్యవస్థలో పాతుకుపోయిన అహంకార జాడ్యం, టెర్రరిస్టులు నక్సలైట్లను ఎదిరించే క్రమంలో వీళ్ళు చేసిన దురాగతాలు అన్నీ కూలంకుషంగా ఇందుకు చూపించే ప్రయత్నం చేశాడు వెట్రిమారన్.
సున్నిత మనస్కులు, చిన్న పిల్లలను దూరంగా ఉండమని రివ్యూయర్లు పేర్కొంటున్నారంటేనే హింస మోతాదు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. ఇళయరాజా సంగీతం, నటీనటుల పెర్ఫార్మన్స్, సాంకేతిక వర్గం పనితనం విడుతలైని ఇంకో స్థాయిలో నిలబెట్టాయి.
అణుగారిన వర్గాల ఘోషను వినిపించే వెట్రిమారన్ ఇందులోనూ అదే చేశారు. సూరి విజయ్ సేతుపతిల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీనిదెబ్బకు శింబు పాతుతల వసూళ్లు దెబ్బ తింటున్నాయని ట్రేడ్ వాపోతోంది. తెలుగు డబ్బింగ్ చేసి ఏప్రిల్ 7 విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు చెన్నై టాక్. వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తే మన ఆడియన్స్ కూ ఒక గొప్ప అనుభూతి దక్కుతుంది. వడ చెన్నై, అసురన్ స్ట్రెయిట్ వెర్షన్లు ఎలాగూ మిస్ అయ్యాయి. ఇదైనా చూడాలి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…